ETV Bharat / sports

రూ.72.03 కోట్లు ఖర్చు చేస్తే పతకాలు సున్నా - ఒలింపిక్స్​లో నిరాశపరిచిన బ్యాడ్మింటన్​ - Paris Olympics 2024 Badminton

author img

By ETV Bharat Sports Team

Published : Aug 13, 2024, 7:21 AM IST

Paris Olympics 2024 Badminton : పారిస్​ ఒలింపిక్స్‌ 2024లో భారత్‌ కచ్చితంగా మెడల్​ సాధిస్తుందనుకున్న ఈవెంట్లలో బ్యాడ్మింటన్‌ కూడా ఒకటి. కానీ అది జరగలేదు. పీవీ సింధు, ప్రణయ్‌, అశ్విని పొన్నప్ప- తనీషా క్రాస్టో, సాత్విక్‌- చిరాగ్‌ జోడీ చేతులెత్తేశారు. లక్ష్య సేన్‌ అదిరే ప్రదర్శనతో సెమీస్​కు దూసుకెళ్లినప్పటికీ కాంస్య పతక పోరులో ఓటమిని అందుకున్నాడు. పూర్తి వివరాలు స్టోరీలో.

source Associated Press and Getty Images
Paris Olympics 2024 Badminton (source Associated Press and Getty Images)

Paris Olympics 2024 Badminton : పారిస్​ ఒలింపిక్స్‌ 2024లో భారత్‌ కచ్చితంగా మెడల్​ సాధిస్తుందనుకున్న ఈవెంట్లలో బ్యాడ్మింటన్‌ కూడా ఒకటి. వరుసగా 2012 లండన్‌, 2016 రియో, 2020 టోక్యో ఒలింపిక్స్‌లలో మెడల్స్​ రావడమే దీనికి కారణం. లండన్‌ ఒలింపిక్స్​లో సైనా నెహ్వాల్‌ బ్రాంజ్​ మెడల్​ను అందుకోగా, రియోలో సిల్వర్​, టోక్యోలో బ్రాంజ్​ మెడల్స్​తో పీవీ సింధు మెరిసింది.

అందుకే ఈసారి బ్యాడ్మింటన్ ఈవెంట్​లో ఒకటి కన్నా ఎక్కువ మెడల్స్​ రావొచ్చని చాలా మంది భావించారు. హ్యాట్రిక్‌ మెడల్​ కోసం సింధు బరిలో దిగడం, సింగిల్స్‌లో హెచ్‌.ఎస్‌.ప్రణయ్, లక్ష్యసేన్‌ సూపర్​ ఫామ్‌తో కనపడటం, ప్రపంచ బ్యాడ్మింటన్‌ డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌- చిరాగ్‌ శెట్టి జోడీ ఫామ్​లో ఉండటంతో అంచనాలు బాగా పెరిగాయి.

దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా బ్యాడ్మింటన్‌ కోసం భారీగానే ఖర్చు చేసింది. ఈ పారిస్‌ ఒలింపిక్స్​ కోసం రూ.470 కోట్లు కేటాయించింది. అందులో బ్యాడ్మింటన్‌కు రూ.72.03 కోట్లు. అథ్లెటిక్స్‌ (రూ.96.08 కోట్లు) తర్వాత బ్యాడ్మింటన్‌కే అధికంగా నిధులు కేటాయించింది. కానీ బ్యాడ్మింటన్​లో ఫలితాలు నిరాశను కలిగించాయి.

లక్ష్య సేన్‌ తప్పా మిగతా వాళ్లు ఘోరంగా విఫలమయ్యారు. సింధు ట్రైనింగ్ కోసం రూ.3.13 కోట్లు ఖర్చు చేస్తే ఆమె ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ఓడిపోయింది.

ఇక 2022 కామన్వెల్త్‌ గేమ్స్​ టైటిల్‌, 2023లో ఆసియా క్రీడలు, ఆసియా ఛాంపియన్‌షిప్‌లలో గోల్డ్​మెడల్స్​ సాధించిన సాత్విక్‌- చిరాగ్‌ జోడీ ఈ ఏడాది నాలుగు బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ టూర్‌ టైటిళ్లు గెలిచారు. దీంతో వీరిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ఈ జోడీ కూడా అనూహ్యంగా క్వార్టర్‌ ఫైనల్​లో ఓటమిని అందుకుంది. ఈ సాత్విక్‌- చిరాగ్‌ జోడీ కోసం ప్రభుత్వం రూ.5.62 కోట్లు ఖర్చు చేసింది.

ప్రణయ్‌ కోసం రూ.1.8 కోట్లు ఖర్చు చేయగా, మహిళల డబుల్స్‌ జోడీ అశ్విని పొన్నప్ప- తనీషా క్రాస్టో కోసం రూ.1.5 కోట్లు కేటాయించింది.

లాస్‌ ఏంజెలెస్‌ ఒలింపిక్స్‌లో డౌటే? - ప్రస్తుత బ్యాడ్మింటన్​ జట్టులోని ప్లేయర్స్​లో ఎంతమంది 2028 లాస్‌ ఏంజెలెస్‌ ఒలింపిక్స్‌లో పాల్గొంటారనేది చెప్పలేం. సింధు ఫిట్‌నెస్‌ కాపాడుకోవడం కత్తి మీద సాము లాంటిది. ప్రణయ్‌దీ కూడా అదే పరిస్థితి. ఇకపోతే లక్ష్యసేన్, సాత్విక్‌- చిరాగ్‌ మీదే ఆశలు ఉన్నాయి. మరి వారు ఏమాత్రం రాణిస్తారో చూడాలి.
పారిస్‌ ఒలింపిక్స్‌ మెడల్​ విన్నర్స్​పై కాసుల వర్షం - ఎవరెవరికి ఎంతిచ్చారంటే? - Paris Olympics 2024

పారిస్ ఒలింపిక్స్​ - మన అథ్లెట్లు సాధించిన 11 సూపర్​​ రికార్డులివే - Paris Olympics 2024 Records

Paris Olympics 2024 Badminton : పారిస్​ ఒలింపిక్స్‌ 2024లో భారత్‌ కచ్చితంగా మెడల్​ సాధిస్తుందనుకున్న ఈవెంట్లలో బ్యాడ్మింటన్‌ కూడా ఒకటి. వరుసగా 2012 లండన్‌, 2016 రియో, 2020 టోక్యో ఒలింపిక్స్‌లలో మెడల్స్​ రావడమే దీనికి కారణం. లండన్‌ ఒలింపిక్స్​లో సైనా నెహ్వాల్‌ బ్రాంజ్​ మెడల్​ను అందుకోగా, రియోలో సిల్వర్​, టోక్యోలో బ్రాంజ్​ మెడల్స్​తో పీవీ సింధు మెరిసింది.

అందుకే ఈసారి బ్యాడ్మింటన్ ఈవెంట్​లో ఒకటి కన్నా ఎక్కువ మెడల్స్​ రావొచ్చని చాలా మంది భావించారు. హ్యాట్రిక్‌ మెడల్​ కోసం సింధు బరిలో దిగడం, సింగిల్స్‌లో హెచ్‌.ఎస్‌.ప్రణయ్, లక్ష్యసేన్‌ సూపర్​ ఫామ్‌తో కనపడటం, ప్రపంచ బ్యాడ్మింటన్‌ డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌- చిరాగ్‌ శెట్టి జోడీ ఫామ్​లో ఉండటంతో అంచనాలు బాగా పెరిగాయి.

దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా బ్యాడ్మింటన్‌ కోసం భారీగానే ఖర్చు చేసింది. ఈ పారిస్‌ ఒలింపిక్స్​ కోసం రూ.470 కోట్లు కేటాయించింది. అందులో బ్యాడ్మింటన్‌కు రూ.72.03 కోట్లు. అథ్లెటిక్స్‌ (రూ.96.08 కోట్లు) తర్వాత బ్యాడ్మింటన్‌కే అధికంగా నిధులు కేటాయించింది. కానీ బ్యాడ్మింటన్​లో ఫలితాలు నిరాశను కలిగించాయి.

లక్ష్య సేన్‌ తప్పా మిగతా వాళ్లు ఘోరంగా విఫలమయ్యారు. సింధు ట్రైనింగ్ కోసం రూ.3.13 కోట్లు ఖర్చు చేస్తే ఆమె ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ఓడిపోయింది.

ఇక 2022 కామన్వెల్త్‌ గేమ్స్​ టైటిల్‌, 2023లో ఆసియా క్రీడలు, ఆసియా ఛాంపియన్‌షిప్‌లలో గోల్డ్​మెడల్స్​ సాధించిన సాత్విక్‌- చిరాగ్‌ జోడీ ఈ ఏడాది నాలుగు బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ టూర్‌ టైటిళ్లు గెలిచారు. దీంతో వీరిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ఈ జోడీ కూడా అనూహ్యంగా క్వార్టర్‌ ఫైనల్​లో ఓటమిని అందుకుంది. ఈ సాత్విక్‌- చిరాగ్‌ జోడీ కోసం ప్రభుత్వం రూ.5.62 కోట్లు ఖర్చు చేసింది.

ప్రణయ్‌ కోసం రూ.1.8 కోట్లు ఖర్చు చేయగా, మహిళల డబుల్స్‌ జోడీ అశ్విని పొన్నప్ప- తనీషా క్రాస్టో కోసం రూ.1.5 కోట్లు కేటాయించింది.

లాస్‌ ఏంజెలెస్‌ ఒలింపిక్స్‌లో డౌటే? - ప్రస్తుత బ్యాడ్మింటన్​ జట్టులోని ప్లేయర్స్​లో ఎంతమంది 2028 లాస్‌ ఏంజెలెస్‌ ఒలింపిక్స్‌లో పాల్గొంటారనేది చెప్పలేం. సింధు ఫిట్‌నెస్‌ కాపాడుకోవడం కత్తి మీద సాము లాంటిది. ప్రణయ్‌దీ కూడా అదే పరిస్థితి. ఇకపోతే లక్ష్యసేన్, సాత్విక్‌- చిరాగ్‌ మీదే ఆశలు ఉన్నాయి. మరి వారు ఏమాత్రం రాణిస్తారో చూడాలి.
పారిస్‌ ఒలింపిక్స్‌ మెడల్​ విన్నర్స్​పై కాసుల వర్షం - ఎవరెవరికి ఎంతిచ్చారంటే? - Paris Olympics 2024

పారిస్ ఒలింపిక్స్​ - మన అథ్లెట్లు సాధించిన 11 సూపర్​​ రికార్డులివే - Paris Olympics 2024 Records

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.