ETV Bharat / sports

భారత్‌ - పాక్​ మ్యాచ్‌కు కేవలం 750 మంది హాజరయ్యారా? - ఇలా ఎప్పుడు జరిగిందంటే? - IND vs PAK Match Less Tickets

author img

By ETV Bharat Sports Team

Published : Sep 17, 2024, 1:27 PM IST

IND vs PAK Match Less Tickets : క్రికెట్‌లో భారత్‌ - పాకిస్థాన్‌ మ్యాచ్​కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సాధారణంగా దాయాదుల మధ్య పోరు జరిగిందంటే భారీ సంఖ్యలో ప్రేక్షకులు స్టేడియానికి హాజరవతుంటారు. అయితే ఓ సారి మాత్రం భారత్ - పాక్‌ మ్యాచ్‌కు ఊహించని సంఘటన ఎదురైంది. అతి తక్కువ మంది ప్రేక్షకులు మాత్రమే ఈ దాయాదుల పోరుకు హాజరయ్యారు. అసలు ఈ మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ జరిగిందంటే?

source Associated Press
IND vs PAK Match Less Tickets (source Associated Press)

IND vs PAK Match Less Tickets : క్రికెట్‌లో భారత్‌ - పాకిస్థాన్‌ మ్యాచ్​కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ దాయాదుల మధ్య పోరు ప్రపంచంలో ఎక్కడ జరిగినా మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లు భారీ స్థాయిలో అమ్ముడుపోతుంటాయి. చూస్తుండంగానే క్షణాల్లోనే హాట్‌ కేకుల్లా అయిపోతుంటాయి. అందుకు తగ్గట్టే భారీ సంఖ్యలో అభిమానులు స్టేడియానికి తరలివస్తుంటారు. అయితే ఓ సారి మాత్రం భారత్ - పాక్‌ మ్యాచ్‌కు ఊహించని సంఘటన ఎదురైంది. అతి తక్కువ మంది ప్రేక్షకులు మాత్రమే ఈ దాయాదుల పోరుకు హాజరయ్యారు. 28 ఏళ్ల క్రితం ఈ సంఘటన జరిగింది.

ఎందుకంటే? - ద్వైపాక్షిక సిరీస్​లో భాగంగా కెనడాలోని టొరంటో వేదికగా సెప్టెంబర్​ 16, 1996న భారత్‌, పాకిస్థాన్‌ మధ్య వన్డే మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌కు వర్షం తీవ్ర అంతరాయం కలిగించింది. దీంతో 750 మంది ప్రేక్షకులు మాత్రమే స్టేడియానికి హాజరై మ్యాచ్‌ను వీక్షించారు. దాయాదుల మధ్య జరిగిన పోరుకు ఇంత తక్కువ మంది ప్రేక్షకులు హాజరు అవ్వడం బహుశ ఇదే మొదటి సారి కావొచ్చు.

కుదించిన మ్యాచ్​ - వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 33 ఓవర్లకు కుదించారు. ఈ పోరులో మొదట బ్యాటింగ్​కు దిగిన పాకిస్థాన్‌ 9 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది. సయీద్ అన్వర్ (46) టాప్‌ స్కోరర్​గా నిలిచాడు. జవగళ్ శ్రీనాథ్, అనిల్ కుంబ్లే తలో మూడు వికెట్లు తీయగా, వెంకటేశ్‌ ప్రసాద్ 2 వికెట్లు తీశాడు.

171 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ 29.5 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. కెప్టెన్‌ సచిన్‌ తెందుల్కర్‌ (89 బంతుల్లో 89*; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) అద్భుతంగా రాణించాడు. రాహుల్ ద్రవిడ్ (39), మహ్మద్‌ అజారుద్దీన్‌ (30) రన్స్ చేశారు.

కాగా, కొంత కాలంగా భారత్, పాకిస్థాన్‌ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు నిర్వహించడం లేదు. ఐసీసీ, ఆసియా కప్‌ వంటి టోర్నీల్లో మాత్రమే ఇరు జట్లు పోటీ పడుతున్నాయి. ఇరు జట్లు చివరి సారిగా 2024 టీ20 వరల్డ్​ కప్‌లో పోటీ పడ్డాయి. ఈ పోరులో టీమ్ ఇండియా ఆరు పరుగుల తేడాతో గెలుపొందింది. వచ్చే ఏడాది జరగనున్న ఛాంపియన్స్‌ ట్రోఫీలో మళ్లీ ఈ రెండు జట్లు తలపడే ఛాన్స్ ఉంది.

స్పిన్​ బౌలింగ్​ను ఎదుర్కోవడంలో టీమ్ఇండియా కష్టాలు - గత రికార్డులు ఏం చెబుతున్నాయంటే? - Teamindia struggled Spin Stats

భారత్, బంగ్లా టెస్ట్​ సిరీస్ - అశ్విన్​ను ఊరిస్తున్న టాప్​ 5 రికార్డులివే! - RAVICHANDRAN ASHWIN BIG RECORDS

IND vs PAK Match Less Tickets : క్రికెట్‌లో భారత్‌ - పాకిస్థాన్‌ మ్యాచ్​కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ దాయాదుల మధ్య పోరు ప్రపంచంలో ఎక్కడ జరిగినా మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లు భారీ స్థాయిలో అమ్ముడుపోతుంటాయి. చూస్తుండంగానే క్షణాల్లోనే హాట్‌ కేకుల్లా అయిపోతుంటాయి. అందుకు తగ్గట్టే భారీ సంఖ్యలో అభిమానులు స్టేడియానికి తరలివస్తుంటారు. అయితే ఓ సారి మాత్రం భారత్ - పాక్‌ మ్యాచ్‌కు ఊహించని సంఘటన ఎదురైంది. అతి తక్కువ మంది ప్రేక్షకులు మాత్రమే ఈ దాయాదుల పోరుకు హాజరయ్యారు. 28 ఏళ్ల క్రితం ఈ సంఘటన జరిగింది.

ఎందుకంటే? - ద్వైపాక్షిక సిరీస్​లో భాగంగా కెనడాలోని టొరంటో వేదికగా సెప్టెంబర్​ 16, 1996న భారత్‌, పాకిస్థాన్‌ మధ్య వన్డే మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌కు వర్షం తీవ్ర అంతరాయం కలిగించింది. దీంతో 750 మంది ప్రేక్షకులు మాత్రమే స్టేడియానికి హాజరై మ్యాచ్‌ను వీక్షించారు. దాయాదుల మధ్య జరిగిన పోరుకు ఇంత తక్కువ మంది ప్రేక్షకులు హాజరు అవ్వడం బహుశ ఇదే మొదటి సారి కావొచ్చు.

కుదించిన మ్యాచ్​ - వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 33 ఓవర్లకు కుదించారు. ఈ పోరులో మొదట బ్యాటింగ్​కు దిగిన పాకిస్థాన్‌ 9 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది. సయీద్ అన్వర్ (46) టాప్‌ స్కోరర్​గా నిలిచాడు. జవగళ్ శ్రీనాథ్, అనిల్ కుంబ్లే తలో మూడు వికెట్లు తీయగా, వెంకటేశ్‌ ప్రసాద్ 2 వికెట్లు తీశాడు.

171 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ 29.5 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. కెప్టెన్‌ సచిన్‌ తెందుల్కర్‌ (89 బంతుల్లో 89*; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) అద్భుతంగా రాణించాడు. రాహుల్ ద్రవిడ్ (39), మహ్మద్‌ అజారుద్దీన్‌ (30) రన్స్ చేశారు.

కాగా, కొంత కాలంగా భారత్, పాకిస్థాన్‌ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు నిర్వహించడం లేదు. ఐసీసీ, ఆసియా కప్‌ వంటి టోర్నీల్లో మాత్రమే ఇరు జట్లు పోటీ పడుతున్నాయి. ఇరు జట్లు చివరి సారిగా 2024 టీ20 వరల్డ్​ కప్‌లో పోటీ పడ్డాయి. ఈ పోరులో టీమ్ ఇండియా ఆరు పరుగుల తేడాతో గెలుపొందింది. వచ్చే ఏడాది జరగనున్న ఛాంపియన్స్‌ ట్రోఫీలో మళ్లీ ఈ రెండు జట్లు తలపడే ఛాన్స్ ఉంది.

స్పిన్​ బౌలింగ్​ను ఎదుర్కోవడంలో టీమ్ఇండియా కష్టాలు - గత రికార్డులు ఏం చెబుతున్నాయంటే? - Teamindia struggled Spin Stats

భారత్, బంగ్లా టెస్ట్​ సిరీస్ - అశ్విన్​ను ఊరిస్తున్న టాప్​ 5 రికార్డులివే! - RAVICHANDRAN ASHWIN BIG RECORDS

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.