ETV Bharat / politics

వీఎంసీపై సడలిన వైఎస్సార్సీపీ పట్టు - పాలకపక్షానికి సొంతపార్టీ నుంచే వ్యతిరేకత - YSRCP Corporators Issue in VMC

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 23, 2024, 8:51 AM IST

YSRCP VMC Corporators Against Own party : విజయవాడ నగరపాలక సంస్థ పాలకమండలిలో వైఎస్సార్సీపీ క్రమంగా పట్టు కోల్పోతోంది. స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో అధికారపక్ష కార్పొరేటర్లు ఆ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేశారు. ప్రజా సమస్యలను ప్రశ్నిస్తే గతంలో విపక్ష సభ్యుల గొంతునొక్కిన పాలకపక్షానికి, ఇప్పుడు సొంతపార్టీ నుంచే వ్యతిరేకత ఎదురవుతోంది.

YSRCP Corporators Issue in VMC
YSRCP Corporators Issue in VMC (ETV Bharat)

YSRCP Corporators Issue in VMC : వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు విజయవాడ నగరపాలక కౌన్సిల్‌ను అప్రజాస్వామిక పద్ధతిలో ఏకపక్షంగా నిర్వహించింది. ఇష్టానుసారం అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంది. కొందరు ఆ పార్టీ కార్పొరేటర్లకు ఈ వ్యవహారం నచ్చకున్నా అన్నింటినీ మౌనంగా భరించారు. రాష్ట్రంలో అధికారం మారడంతో వీఎంసీ పాలకమండలిలోనూ కొంత మార్పు వచ్చింది.

నోరెత్తుతున్న సొంతపార్టీ కార్పొరేటర్లు : గతంలో విపక్షాలను కనీసం పట్టించుకోని పాలకపక్షం, ఇటీవల జరిగిన కౌన్సిల్ సమావేశంలో తెలుగుదేశం సూచనలు, సలహాలు తీసుకుంది. ప్రజలకు భారంగా మారిన చెత్తపన్నును రద్దు చేయడమేగాక, ఆస్తిపన్ను పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. గతంలో ఇవే సమస్యలపై విపక్షాలు గళమెత్తితే మార్షల్స్ సాయంతో బలవంతంగా బయటకు గెంటివేసింది. ఇన్నాళ్లు మౌనంగా వారి అరాచకాలను భరించిన సొంతపార్టీ కార్పొరేటర్లూ నోరెత్తుతున్నారు.

వైఎస్సార్సీపీ పనిపోయింది. ఆ పార్టీ కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు కూటమి ప్రభుత్వంలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. కార్పొరేటర్లు పార్టీ మారాలని చూస్తున్నారు. మా మాటకు వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు విలువ ఇస్తున్నారు. మా నిర్ణయాలను వారు పరిగణలోనికి తీసుకుంటున్నారు. గతంలో ఇలా ఉండేది కాదు. - బాలస్వామి, వీఎంసీ టీడీపీ పక్షనేత

YSRCP VMC Corporators Against Own party : మూడేళ్లుగా వీఎంసీలో అధికారపక్షంగా ఉన్న వైఎస్సార్సీపీ ప్రజా సమస్యలపై దృష్టిపెట్టిన దాఖలాలు లేవు. సీజనల్ వ్యాధులు, కలుషిత నీరు, డ్రైనేజీ సమస్య, దోమల బెడద ఉన్నా పట్టించుకోలేదు. ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులనూ రాబట్టలేకపోయింది. నాడు ముఖ్యమంత్రిగా జగన్ విజయవాడ అభివృద్ధి కోసం ప్రకటించిన రూ.150 కోట్లనూ పాలకపక్షం పట్టుకురాలేకపోయింది. ఆ పార్టీ హయాంలోనే నగరంలో పెద్ద ఎత్తున ఆస్తుల ఆక్రమణలు చోటుచేసుకున్నా అరికట్టలేకపోయారు.

అధికార వైఎస్సార్సీపీలోనే భిన్నాభిప్రాయలు : వైఎస్సార్సీపీ ప్రజావ్యతిరేక విధానాలతో విసుగెత్తిపోయిన పలువురు వైసీపీ కార్పొరేటర్లు ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇటీవల జరిగిన స్టాండింగ్‌ కమిటీ ఎన్నికల్లో ఆ పార్టీకి వ్యతిరేకంగా ఓటువేశారు. మరోవైపు ప్రస్తుతం నగరంలో పారిశుధ్య కార్మికులుగా పని చేస్తున్న వారికి అవసరమైన వస్తువులు సమకూర్చాల్సి ఉంది. ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థ ఏర్పాటుకు అయ్యే రూ.3 కోట్ల రూపాయల వ్యయం అంశంపై అధికార వైఎస్సార్సీపీలోనే భిన్నాభిప్రాయలు వ్యక్తమయ్యాయి. ఇదే అంశంపై సొంత పార్టీని ఇరకాటంలో పెట్టే విధంగా విపక్షాల సభ్యులకు, పాలకపక్షం సభ్యులే సమాచారం అందించడం ఆసక్తిగా మారింది.

45 రోజుల క్రితం నగరంలోని మొగల్రాజపురం, కండ్రిక ప్రాంతాల్లో కలుషిత నీరు కారణంగా అతిసార బారినపడి 9 మంది మృత్యువాత పడ్డారు. వందల మంది ఆసుపత్రుల పాలైనా అధికార పక్షం పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. మేయర్, డిప్యూటీ మేయర్ల కన్నెత్తి చూడలేదు. నేటికీ మంచినీటి సరఫరా వ్యవస్థను మెరుగుపరచలేని పరిస్థితుల్లో వీఎంసీ పాలక మండలి ఉంది.

బెజవాడలో పారిశుధ్యం అస్తవ్యస్తం - ఆనారోగ్యంతో ప్రజలు విలవిల - Drainage Problems in Bejawada

విజయవాడలో అధ్వానంగా దర్శనమిస్తున్న పార్కులు - పట్టించుకోని వీఎంసీ అధికారులు

YSRCP Corporators Issue in VMC : వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు విజయవాడ నగరపాలక కౌన్సిల్‌ను అప్రజాస్వామిక పద్ధతిలో ఏకపక్షంగా నిర్వహించింది. ఇష్టానుసారం అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంది. కొందరు ఆ పార్టీ కార్పొరేటర్లకు ఈ వ్యవహారం నచ్చకున్నా అన్నింటినీ మౌనంగా భరించారు. రాష్ట్రంలో అధికారం మారడంతో వీఎంసీ పాలకమండలిలోనూ కొంత మార్పు వచ్చింది.

నోరెత్తుతున్న సొంతపార్టీ కార్పొరేటర్లు : గతంలో విపక్షాలను కనీసం పట్టించుకోని పాలకపక్షం, ఇటీవల జరిగిన కౌన్సిల్ సమావేశంలో తెలుగుదేశం సూచనలు, సలహాలు తీసుకుంది. ప్రజలకు భారంగా మారిన చెత్తపన్నును రద్దు చేయడమేగాక, ఆస్తిపన్ను పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. గతంలో ఇవే సమస్యలపై విపక్షాలు గళమెత్తితే మార్షల్స్ సాయంతో బలవంతంగా బయటకు గెంటివేసింది. ఇన్నాళ్లు మౌనంగా వారి అరాచకాలను భరించిన సొంతపార్టీ కార్పొరేటర్లూ నోరెత్తుతున్నారు.

వైఎస్సార్సీపీ పనిపోయింది. ఆ పార్టీ కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు కూటమి ప్రభుత్వంలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. కార్పొరేటర్లు పార్టీ మారాలని చూస్తున్నారు. మా మాటకు వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు విలువ ఇస్తున్నారు. మా నిర్ణయాలను వారు పరిగణలోనికి తీసుకుంటున్నారు. గతంలో ఇలా ఉండేది కాదు. - బాలస్వామి, వీఎంసీ టీడీపీ పక్షనేత

YSRCP VMC Corporators Against Own party : మూడేళ్లుగా వీఎంసీలో అధికారపక్షంగా ఉన్న వైఎస్సార్సీపీ ప్రజా సమస్యలపై దృష్టిపెట్టిన దాఖలాలు లేవు. సీజనల్ వ్యాధులు, కలుషిత నీరు, డ్రైనేజీ సమస్య, దోమల బెడద ఉన్నా పట్టించుకోలేదు. ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులనూ రాబట్టలేకపోయింది. నాడు ముఖ్యమంత్రిగా జగన్ విజయవాడ అభివృద్ధి కోసం ప్రకటించిన రూ.150 కోట్లనూ పాలకపక్షం పట్టుకురాలేకపోయింది. ఆ పార్టీ హయాంలోనే నగరంలో పెద్ద ఎత్తున ఆస్తుల ఆక్రమణలు చోటుచేసుకున్నా అరికట్టలేకపోయారు.

అధికార వైఎస్సార్సీపీలోనే భిన్నాభిప్రాయలు : వైఎస్సార్సీపీ ప్రజావ్యతిరేక విధానాలతో విసుగెత్తిపోయిన పలువురు వైసీపీ కార్పొరేటర్లు ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇటీవల జరిగిన స్టాండింగ్‌ కమిటీ ఎన్నికల్లో ఆ పార్టీకి వ్యతిరేకంగా ఓటువేశారు. మరోవైపు ప్రస్తుతం నగరంలో పారిశుధ్య కార్మికులుగా పని చేస్తున్న వారికి అవసరమైన వస్తువులు సమకూర్చాల్సి ఉంది. ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థ ఏర్పాటుకు అయ్యే రూ.3 కోట్ల రూపాయల వ్యయం అంశంపై అధికార వైఎస్సార్సీపీలోనే భిన్నాభిప్రాయలు వ్యక్తమయ్యాయి. ఇదే అంశంపై సొంత పార్టీని ఇరకాటంలో పెట్టే విధంగా విపక్షాల సభ్యులకు, పాలకపక్షం సభ్యులే సమాచారం అందించడం ఆసక్తిగా మారింది.

45 రోజుల క్రితం నగరంలోని మొగల్రాజపురం, కండ్రిక ప్రాంతాల్లో కలుషిత నీరు కారణంగా అతిసార బారినపడి 9 మంది మృత్యువాత పడ్డారు. వందల మంది ఆసుపత్రుల పాలైనా అధికార పక్షం పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. మేయర్, డిప్యూటీ మేయర్ల కన్నెత్తి చూడలేదు. నేటికీ మంచినీటి సరఫరా వ్యవస్థను మెరుగుపరచలేని పరిస్థితుల్లో వీఎంసీ పాలక మండలి ఉంది.

బెజవాడలో పారిశుధ్యం అస్తవ్యస్తం - ఆనారోగ్యంతో ప్రజలు విలవిల - Drainage Problems in Bejawada

విజయవాడలో అధ్వానంగా దర్శనమిస్తున్న పార్కులు - పట్టించుకోని వీఎంసీ అధికారులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.