ETV Bharat / politics

జగన్‌ పతనం ప్రారంభం- భస్మాసుర వధ బాధ్యత ఐదు కోట్ల ఆంధ్రులది : చంద్రబాబు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 28, 2024, 4:34 PM IST

TDP Chandrababu Raa Kadali Ra Public Meeting: జగన్‌ అభిమన్యుడు కాదు, అర్జునుడు కాదు, భస్మాసురుడని చంద్రబాబు వ్యాఖ్యానించారు. నెల్లూరు జిల్లాలోని కనపర్తిపాడులో నిర్వహించిన "రా-కదలిరా" సభలో మాట్లాడిన ఆయన జగన్ పతనం ప్రారంభమైందని, ఆయనను దేవుడు కూడా కాపాడలేరని పేర్కొన్నారు.

Etv Bharat
Etv Bharat

TDP Chandrababu Raa Kadali Ra Public Meeting: జగన్‌ అభిమన్యుడు కాదు, అర్జునుడు కాదు, భస్మాసురుడని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. నెల్లూరు జిల్లా కనపర్తిపాడులోని వేణుగోపాల స్వామి కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన "రా-కదలిరా" సభలో మాట్లాడిన ఆయన భస్మాసుర వధ చేసే బాధ్యత ఐదు కోట్ల మంది ప్రజలదని వ్యాఖ్యానించారు.

ప్రారంభమైన జగన్‌ పతనం: జగన్‌ పతనం ప్రారంభమైందని, దేవుడు కూడా ఆయనను కాపాడలేరని టీడీపీ చంద్రబాబు వ్యాఖ్యానించారు. జగన్‌ వల్ల బాధితులైన ప్రతి ఒక్క వ్యక్తి స్టార్‌ క్యాంపెయినరే అని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో 5 కోట్ల మంది స్టార్‌ క్యాంపెయినర్లుగా మారి వైఎస్సార్సీపీను భూస్థాపితం చేసేందుకు ప్రజలు శపథం చేయాలని సూచించారు. పేదలకు సేవ చేసే గుణగణాలు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలకు లేవని, బూతుల రత్నకు ఎమ్మెల్యే, బూతుల సామ్రాట్‌కు ఎంపీ, బూతుల నట సామ్రాట్‌కు మంత్రి పదవులు ఇస్తారన్నారు.

దేశంలో ధనిక సీఎం జగన్: దేశంలో అందరు ముఖ్యమంత్రుల కంటే జగన్​ వద్దే ఆస్తులు ఎక్కువగా ఉన్నాయని చంద్రబాబు అన్నారు. సీఎంల ఆస్తుల్లో అగ్రస్థానంలో ఉన్నా జగన్‌ మాత్రం పేదబిడ్డ అని చెప్పుకుంటున్నారన్నారు. రైతులు ఎక్కువగా అప్పులు చేసిన రాష్ట్రాల్లో, రైతుల ఆత్మహత్యల్లో ఏపీ ముందుందన్నారు. ఆక్వా రంగాన్ని బాగు చేసే బాధ్యత తీసుకుంటానన్న చంద్రబాబు రాబోయే ఎన్నికల్లో తనకు తోడుగా ప్రజలుండాలని కోరారు.

కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధం - జగన్​కు కౌంట్​డౌన్​ మొదలైంది: చంద్రబాబు

బిహార్​ను వెనక్కి నెట్టి నిరుద్యోగంలో అగ్రస్థానంలో ఏపీ: నిరుద్యోగంలో 24 శాతంతో ఏపీ అగ్రస్థానంలో ఉందని చంద్రబాబు ధ్వజమెత్తారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఐదేళ్లలో రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలతో పాటు, నిరుద్యోగులకు రూ.3 వేలు భృతి చెల్లిస్తామన్నారు. జగన్‌ను ఓడించేందుకు ప్రతి నిరుద్యోగి స్టార్‌ క్యాంపెయినర్​గా మారాలన్నారు. దీంతోపాటు స్థానిక సంస్థలకు ఇచ్చే నిధులను వైఎస్సార్సీపీ సర్కార్ కొట్టేసిందన్న ఆయన టీడీపీ అధికారంలోకి వచ్చాక స్థానిక సంస్థలకు అధికారం ఇచ్చి గౌరవిస్తామన్నారు.

మద్యపాన నిషేధం: మద్యపాన నిషేధం విధించకపోతే ఓటు అడగబోననన్న జగన్మోహన్ రెడ్డి మద్యం పేరుతో పేదల రక్తాన్ని తాగుతున్నాడని చంద్రబాబు వ్యాఖ్యానించారు. త్వరలోనే ఫ్యాన్‌ 3 రెక్కలను విరిచి పక్కనపెడతారన్న ఆయన చివరకు జగన్‌కు మిగిలేది మొండి ఫ్యానే అన్నారు. దీంతోపాటు టీడీపీ హయాంలో ఏమీ చేయలేదని చెబుతున్న జగన్ అబద్ధాలతో మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తున్నారన్నారు.

తనకు కష్టం వస్తే 80 దేశాల్లో ప్రజలు, ఇతర రాష్ట్రాల నేతలు మద్దతుగా నిలిచి తాను చేసిన పనులను నెమరవేసుకున్నారంటే ఇంకేం కావాలని చంద్రబాబు అన్నారు. వైఎస్సార్సీపీ రివర్స్‌ పాలనకు ప్రజలు రివర్స్‌ గిఫ్టు ఇస్తారన్న ఆయన తాడేపల్లి ప్యాలెస్‌లో జగన్‌ తీరిగ్గా బాధపడే రోజు వస్తుందన్నారు.

అబద్ధాల్లో జగన్‌ పీహెచ్‌డీ చేశారు-ఇలాంటి జలగ మనకు అవసరమా?: చంద్రబాబు

అభివృద్ధిలో గుండుసున్నా: వైఎస్సార్సీపీ పాలనలో రాష్ట్రం పూర్తిగా నష్టపోయిందని, ఐదేళ్లు అందరూ బాధితులమేనని చంద్రబాబు అన్నారు. దీంతోపాటు వైఎస్సార్సీపీ పాలనలో ప్రజల జీవితాల్లో మార్పు రాలేదన్న ఆయన తెలుగుజాతిని ప్రపంచంలో నంబర్‌ వన్ చేసే బాధ్యత తీసుకుంటానని పేర్కొన్నారు. జగన్‌ సమావేశం నిర్వహించి 'సిద్ధం' అంటున్నా 'మీ టికెట్లు వద్దు' అని వైఎస్సార్సీపీ నేతలు పారిపోతున్నారని ఎద్దేవా చేశారు.

ఈ నేపథ్యంలో ఏపీ బాగు కోసం వైఎస్సార్సీపీ నాయకులకు పిలుపునిస్తున్నానన్న చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాల కోసం కదలి రావాలని కోరారు. దీంతోపాటు గల్లా జయదేవ్‌ పరిశ్రమ రాష్ట్రం నుంచి వెళ్లిపోయేలా చేశారన్న ఆయన రాజకీయ కుటుంబం రాజకీయాలు వద్దనే పరిస్థితి సీఎం జగన్​ తెచ్చారన్నారు.

జగన్​కు కమిషన్లు ఇవ్వలేక పరిశ్రమలు తరలిపోతున్నాయి- వైసీపీ ఓటమి ఖాయమైంది: చంద్రబాబు

TDP Chandrababu Raa Kadali Ra Public Meeting: జగన్‌ అభిమన్యుడు కాదు, అర్జునుడు కాదు, భస్మాసురుడని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. నెల్లూరు జిల్లా కనపర్తిపాడులోని వేణుగోపాల స్వామి కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన "రా-కదలిరా" సభలో మాట్లాడిన ఆయన భస్మాసుర వధ చేసే బాధ్యత ఐదు కోట్ల మంది ప్రజలదని వ్యాఖ్యానించారు.

ప్రారంభమైన జగన్‌ పతనం: జగన్‌ పతనం ప్రారంభమైందని, దేవుడు కూడా ఆయనను కాపాడలేరని టీడీపీ చంద్రబాబు వ్యాఖ్యానించారు. జగన్‌ వల్ల బాధితులైన ప్రతి ఒక్క వ్యక్తి స్టార్‌ క్యాంపెయినరే అని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో 5 కోట్ల మంది స్టార్‌ క్యాంపెయినర్లుగా మారి వైఎస్సార్సీపీను భూస్థాపితం చేసేందుకు ప్రజలు శపథం చేయాలని సూచించారు. పేదలకు సేవ చేసే గుణగణాలు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలకు లేవని, బూతుల రత్నకు ఎమ్మెల్యే, బూతుల సామ్రాట్‌కు ఎంపీ, బూతుల నట సామ్రాట్‌కు మంత్రి పదవులు ఇస్తారన్నారు.

దేశంలో ధనిక సీఎం జగన్: దేశంలో అందరు ముఖ్యమంత్రుల కంటే జగన్​ వద్దే ఆస్తులు ఎక్కువగా ఉన్నాయని చంద్రబాబు అన్నారు. సీఎంల ఆస్తుల్లో అగ్రస్థానంలో ఉన్నా జగన్‌ మాత్రం పేదబిడ్డ అని చెప్పుకుంటున్నారన్నారు. రైతులు ఎక్కువగా అప్పులు చేసిన రాష్ట్రాల్లో, రైతుల ఆత్మహత్యల్లో ఏపీ ముందుందన్నారు. ఆక్వా రంగాన్ని బాగు చేసే బాధ్యత తీసుకుంటానన్న చంద్రబాబు రాబోయే ఎన్నికల్లో తనకు తోడుగా ప్రజలుండాలని కోరారు.

కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధం - జగన్​కు కౌంట్​డౌన్​ మొదలైంది: చంద్రబాబు

బిహార్​ను వెనక్కి నెట్టి నిరుద్యోగంలో అగ్రస్థానంలో ఏపీ: నిరుద్యోగంలో 24 శాతంతో ఏపీ అగ్రస్థానంలో ఉందని చంద్రబాబు ధ్వజమెత్తారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఐదేళ్లలో రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలతో పాటు, నిరుద్యోగులకు రూ.3 వేలు భృతి చెల్లిస్తామన్నారు. జగన్‌ను ఓడించేందుకు ప్రతి నిరుద్యోగి స్టార్‌ క్యాంపెయినర్​గా మారాలన్నారు. దీంతోపాటు స్థానిక సంస్థలకు ఇచ్చే నిధులను వైఎస్సార్సీపీ సర్కార్ కొట్టేసిందన్న ఆయన టీడీపీ అధికారంలోకి వచ్చాక స్థానిక సంస్థలకు అధికారం ఇచ్చి గౌరవిస్తామన్నారు.

మద్యపాన నిషేధం: మద్యపాన నిషేధం విధించకపోతే ఓటు అడగబోననన్న జగన్మోహన్ రెడ్డి మద్యం పేరుతో పేదల రక్తాన్ని తాగుతున్నాడని చంద్రబాబు వ్యాఖ్యానించారు. త్వరలోనే ఫ్యాన్‌ 3 రెక్కలను విరిచి పక్కనపెడతారన్న ఆయన చివరకు జగన్‌కు మిగిలేది మొండి ఫ్యానే అన్నారు. దీంతోపాటు టీడీపీ హయాంలో ఏమీ చేయలేదని చెబుతున్న జగన్ అబద్ధాలతో మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తున్నారన్నారు.

తనకు కష్టం వస్తే 80 దేశాల్లో ప్రజలు, ఇతర రాష్ట్రాల నేతలు మద్దతుగా నిలిచి తాను చేసిన పనులను నెమరవేసుకున్నారంటే ఇంకేం కావాలని చంద్రబాబు అన్నారు. వైఎస్సార్సీపీ రివర్స్‌ పాలనకు ప్రజలు రివర్స్‌ గిఫ్టు ఇస్తారన్న ఆయన తాడేపల్లి ప్యాలెస్‌లో జగన్‌ తీరిగ్గా బాధపడే రోజు వస్తుందన్నారు.

అబద్ధాల్లో జగన్‌ పీహెచ్‌డీ చేశారు-ఇలాంటి జలగ మనకు అవసరమా?: చంద్రబాబు

అభివృద్ధిలో గుండుసున్నా: వైఎస్సార్సీపీ పాలనలో రాష్ట్రం పూర్తిగా నష్టపోయిందని, ఐదేళ్లు అందరూ బాధితులమేనని చంద్రబాబు అన్నారు. దీంతోపాటు వైఎస్సార్సీపీ పాలనలో ప్రజల జీవితాల్లో మార్పు రాలేదన్న ఆయన తెలుగుజాతిని ప్రపంచంలో నంబర్‌ వన్ చేసే బాధ్యత తీసుకుంటానని పేర్కొన్నారు. జగన్‌ సమావేశం నిర్వహించి 'సిద్ధం' అంటున్నా 'మీ టికెట్లు వద్దు' అని వైఎస్సార్సీపీ నేతలు పారిపోతున్నారని ఎద్దేవా చేశారు.

ఈ నేపథ్యంలో ఏపీ బాగు కోసం వైఎస్సార్సీపీ నాయకులకు పిలుపునిస్తున్నానన్న చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాల కోసం కదలి రావాలని కోరారు. దీంతోపాటు గల్లా జయదేవ్‌ పరిశ్రమ రాష్ట్రం నుంచి వెళ్లిపోయేలా చేశారన్న ఆయన రాజకీయ కుటుంబం రాజకీయాలు వద్దనే పరిస్థితి సీఎం జగన్​ తెచ్చారన్నారు.

జగన్​కు కమిషన్లు ఇవ్వలేక పరిశ్రమలు తరలిపోతున్నాయి- వైసీపీ ఓటమి ఖాయమైంది: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.