ETV Bharat / politics

కాంగ్రెస్​ కండువా కప్పుకున్న కేకే - దిల్లీలో ఖర్గే సమక్షంలో చేరిక - KK Join in Congress Party

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 3, 2024, 4:42 PM IST

Updated : Jul 3, 2024, 6:31 PM IST

KK Join in Congress Party : బీఆర్ఎస్​ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ కే కేశవరావు కాంగ్రెస్​ పార్టీలో చేరారు. అందులో భాగంగానే ఇవాళ దిల్లీలోని ఏఐసీసీ ప్రెసిడెంట్​ ఖర్గే నివాసానికి చేరుకున్న కేకే, సీఎం రేవంత్​ రెడ్డి సమక్షంలో హస్తం కండువా కప్పుకున్నారు.

K KesavaRao Party Change Update
MP K Keshava Rao to Join Congress (ETV Bharat)

K Keshava Rao Joins Congress Party : కాంగ్రెస్​లో చేరికలపర్వం కొనసాగుతోంది. కారు దిగుతున్న పలువురు నేతలు హస్తం గూటికి ఒక్కరొక్కరుగా చేరుతున్నారు. ఈక్రమంలోనే సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దిల్లీలోని సీఎం రేవంత్​ సమక్షంలో కండువా కప్పి ఏఐసీసీ ప్రెసిడెంట్ ఖర్గే పార్టీలోకి కేకేను ఆహ్వానించారు.

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్‌ మున్షీ, తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేకే కుమార్తె, హైదరాబాద్‌ మేయర్‌ విజయలక్ష్మి గతంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే.

K Keshava Rao Joins Congress Party : కాంగ్రెస్​లో చేరికలపర్వం కొనసాగుతోంది. కారు దిగుతున్న పలువురు నేతలు హస్తం గూటికి ఒక్కరొక్కరుగా చేరుతున్నారు. ఈక్రమంలోనే సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దిల్లీలోని సీఎం రేవంత్​ సమక్షంలో కండువా కప్పి ఏఐసీసీ ప్రెసిడెంట్ ఖర్గే పార్టీలోకి కేకేను ఆహ్వానించారు.

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్‌ మున్షీ, తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేకే కుమార్తె, హైదరాబాద్‌ మేయర్‌ విజయలక్ష్మి గతంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే.

Last Updated : Jul 3, 2024, 6:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.