ETV Bharat / politics

కేసీఆర్‌కు ప్రతిపక్ష హోదా ఎందుకు? - కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి తీవ్ర ఆరోపణలు - Telangana Assembly

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 29, 2024, 1:01 PM IST

MLA Komatireddy Rajagopal Reddy Comments on KCR : తెలంగాణ శాసనసభలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కేసీఆర్​పై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్‌ సభకు వచ్చి మాట్లాడాలని డిమాండ్ చేశారు. ఆయన సభకు ఎందుకు రావట్లేదని అడిగితే, కేసీఆర్‌తో మాట్లాడే స్థాయి తమది కాదన్నారని మండిపడ్డారు. సభకు రానప్పుడు కేసీఆర్‌కు ప్రతిపక్ష హోదా ఎందుకని రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు.

mla_rajagopal_reddy_fires_on_kcr
mla_rajagopal_reddy_fires_on_kcr (ETV Bharat)

MLA Rajagopal Reddy Fires on KCR : తెలంగాణ అసెంబ్లీలో విద్యుత్ విషయంలో గత ప్రభుత్వంపై కాంగ్రెస్ సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపణాస్త్రాలు సంధించారు. పదేండ్ల పాలనలో రాష్ట్రాన్ని నాశనం చేశారని విమర్శలు గుప్పించారు. విద్యుత్‌ పద్దుపై చర్చను ప్రారంభించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గత ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని అప్పుల్లోకి నెట్టేసిందని, దాని నుంచి బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని స్పష్టం చేశారు.

ప్రతిపక్ష నేతగా కేసీఆర్‌ సభకు వచ్చి మాట్లాడాలని రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. కేసీఆర్‌ సభకు ఎందుకు రావట్లేదని అడిగితే, కేసీఆర్‌తో మాట్లాడే స్థాయి మాది కాదన్నారని ఆయన మండిపడ్డారు. సభకు రానప్పుడు కేసీఆర్‌కు ప్రతిపక్ష హోదా ఎందుకని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత హోదా కేసీఆర్‌ కాకుండా వేరేవారు తీసుకోవచ్చుకదా అంటూ ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి విమర్శలు చేయడం తగదని హితవు పలికారు.

MLA Rajagopal Reddy On Power Purchase : యాదాద్రి విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణంలో పాత సాంకేతిక పరిజ్ఞానంతో, ఎప్పుడో పక్కన పడేసిన పాత మోటార్లను ఉపయోగించారని ఆక్షేపించిన రాజగోపాల్ రెడ్డి, ఆ విద్యుత్ ప్రాజెక్టు నిత్యం ఏదో విధంగా షట్ డౌన్ అవుతుందని అధికారులే బయట పెట్టారని సభ దృష్టికి తీసుకువచ్చారు. ఆ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం కూడా నామినేటెడ్ విధానంలో ఇవ్వడంతోపాటుగా ఇష్టానుసారంగా అంచనాలు పెంచి బీహెచ్‌ఈఎల్‌కు 20 వేల కోట్లు విలువైన పనులు ఇచ్చారని ఆరోపించారు.

నేడు తెలంగాణ శాసనసభలో బడ్జెట్ పద్దులపై చర్చ

'బొగ్గు గనులకు 280 కిలోమీటర్ల దూరంలో దామరచర్ల వద్ద థర్మల్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. బొగ్గు అందుబాటులో ఉన్న చోట పవర్ ప్రాజెక్ట్ పెట్టాల్సి ఉంది. కానీ గత ప్రభుత్వం అందుకు భిన్నంగా పెట్టి బాధ్యతా రహితంగా వ్యవహరించి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారు. రాష్ట్రంలోని అన్ని శాఖల్లో బిల్లులు పెండింగ్ ఉన్నాయి. గత ప్రభుత్వాధినేతకు ఐఏఎస్ అధికారులతో కాళ్లు మొక్కించుకున్న చరిత్ర ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన వ్యవహారంపై గంటల తరబడి మాట్లాడవచ్చు. గతంలో 24 గంటలు విద్యుత్ ఇవ్వనే లేదు. ఛత్తీస్​గడ్ పవర్ అగ్రిమెంట్ విషయంలో గత ప్రభుత్వం సక్రమంగా వ్యవహరించలేదు. అందువల్ల తెలంగాణ ప్రజలు తీవ్రంగా నష్ట పోయారు.' అని రాజ్​గోపాల్ రెడ్డి ఆరోపించారు.

గవర్నమెంట్ వెబ్ సైట్లలో గత ప్రభుత్వ సమాచారాన్ని తొలగిస్తున్నారు - తక్షణమే జోక్యం చేసుకోవాలి : కేటీఆర్

MLA Rajagopal Reddy Fires on KCR : తెలంగాణ అసెంబ్లీలో విద్యుత్ విషయంలో గత ప్రభుత్వంపై కాంగ్రెస్ సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపణాస్త్రాలు సంధించారు. పదేండ్ల పాలనలో రాష్ట్రాన్ని నాశనం చేశారని విమర్శలు గుప్పించారు. విద్యుత్‌ పద్దుపై చర్చను ప్రారంభించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గత ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని అప్పుల్లోకి నెట్టేసిందని, దాని నుంచి బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని స్పష్టం చేశారు.

ప్రతిపక్ష నేతగా కేసీఆర్‌ సభకు వచ్చి మాట్లాడాలని రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. కేసీఆర్‌ సభకు ఎందుకు రావట్లేదని అడిగితే, కేసీఆర్‌తో మాట్లాడే స్థాయి మాది కాదన్నారని ఆయన మండిపడ్డారు. సభకు రానప్పుడు కేసీఆర్‌కు ప్రతిపక్ష హోదా ఎందుకని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత హోదా కేసీఆర్‌ కాకుండా వేరేవారు తీసుకోవచ్చుకదా అంటూ ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి విమర్శలు చేయడం తగదని హితవు పలికారు.

MLA Rajagopal Reddy On Power Purchase : యాదాద్రి విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణంలో పాత సాంకేతిక పరిజ్ఞానంతో, ఎప్పుడో పక్కన పడేసిన పాత మోటార్లను ఉపయోగించారని ఆక్షేపించిన రాజగోపాల్ రెడ్డి, ఆ విద్యుత్ ప్రాజెక్టు నిత్యం ఏదో విధంగా షట్ డౌన్ అవుతుందని అధికారులే బయట పెట్టారని సభ దృష్టికి తీసుకువచ్చారు. ఆ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం కూడా నామినేటెడ్ విధానంలో ఇవ్వడంతోపాటుగా ఇష్టానుసారంగా అంచనాలు పెంచి బీహెచ్‌ఈఎల్‌కు 20 వేల కోట్లు విలువైన పనులు ఇచ్చారని ఆరోపించారు.

నేడు తెలంగాణ శాసనసభలో బడ్జెట్ పద్దులపై చర్చ

'బొగ్గు గనులకు 280 కిలోమీటర్ల దూరంలో దామరచర్ల వద్ద థర్మల్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. బొగ్గు అందుబాటులో ఉన్న చోట పవర్ ప్రాజెక్ట్ పెట్టాల్సి ఉంది. కానీ గత ప్రభుత్వం అందుకు భిన్నంగా పెట్టి బాధ్యతా రహితంగా వ్యవహరించి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారు. రాష్ట్రంలోని అన్ని శాఖల్లో బిల్లులు పెండింగ్ ఉన్నాయి. గత ప్రభుత్వాధినేతకు ఐఏఎస్ అధికారులతో కాళ్లు మొక్కించుకున్న చరిత్ర ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన వ్యవహారంపై గంటల తరబడి మాట్లాడవచ్చు. గతంలో 24 గంటలు విద్యుత్ ఇవ్వనే లేదు. ఛత్తీస్​గడ్ పవర్ అగ్రిమెంట్ విషయంలో గత ప్రభుత్వం సక్రమంగా వ్యవహరించలేదు. అందువల్ల తెలంగాణ ప్రజలు తీవ్రంగా నష్ట పోయారు.' అని రాజ్​గోపాల్ రెడ్డి ఆరోపించారు.

గవర్నమెంట్ వెబ్ సైట్లలో గత ప్రభుత్వ సమాచారాన్ని తొలగిస్తున్నారు - తక్షణమే జోక్యం చేసుకోవాలి : కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.