ETV Bharat / politics

కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు వచ్చే వాటాను 50 శాతానికి పెంచాలి : డిప్యూటీ సీఎం - CENTRAL FINANCE COMMISSION meet

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 10, 2024, 12:16 PM IST

16th Central Finance Commission Meeting : 16వ ఆర్థిక సంఘం సమావేశం హైదరాబాద్​లోని ప్రజాభవన్​లో జరిగింది. ఈ సమావేశంలో సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు పాల్గొన్నారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రారంభ ఉపన్యాసం చేశారు. కేంద్రపన్నుల్లో రాష్ట్రాలకు వచ్చే వాటాను 50 శాతానికి పెంచాలని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కోరారు.

16th Central Finance Commission Meeting
16th Central Finance Commission Meeting (ETV Bharat)

16th Central Finance Commission Meeting in Hyderabad : కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు వచ్చే వాటాను 50 శాతానికి పెంచాలని, రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా కేంద్ర ప్రాయోజిత పథకాలను వినియోగించే వెసులుబాటు కల్పించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కోరారు. ప్రజాభవన్​లో జరిగిన 16వ కేంద్ర ఆర్థిక సంఘం సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రారంభ ఉపన్యాసాన్ని డిప్యూటీ సీఎం పలు అంశాలను ప్రస్తావించారు.

స్థూల పన్ను ఆదాయంలో రాష్ట్రాల వాటా తక్కువగా ఉందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. పన్నుల నుంచి రాష్ట్రాలకు వచ్చే ఆదాయం వాటాను 41శాతం నుంచి 50 శాతానికి పెంచాలని కోరారు. రైతు భరోసా, రైతు రుణమాఫీ రాష్ట్రానికి జీవరేఖ లాంటి పథకాలు రాష్ట్ర ప్రజలకు ఆర్థిక భరోసా, అధిక భద్రతను కల్పిస్తాయని అన్నారు. కేంద్ర పథకాలను వినియోగించుకోవాలంటే తరచూ కఠినమైన నిబంధనలు విధిస్తున్నారని, ఫలితంగా కేంద్ర ప్రాయోజిత పథకాలను పొందడంలో రాష్ట్రాలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని డిప్యూటీ సీఎం భట్టి పేర్కొన్నారు.

కీలక దశల్లో తెలంగాణ వేగంగా అడుగులు : రాష్ట్రాలు తమ అవసరాలకు అనుగుణంగా కేంద్ర ప్రాయోజిత పథకాలు వినియోగించుకునేలా స్వయం ప్రతిపత్తి కల్పించాలని ఆర్థిక సంఘాన్ని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కోరారు. కీలక దశలో ఉన్న తెలంగాణ రాష్ట్రం వేగంగా అడుగులు వేస్తుందని వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి రూ.6.85 లక్షల కోట్లకు పైగా రుణభారంతో సతమతం అవుతోందని వివరించారు. సెస్​లు, సర్​ఛార్జీలల్లో రాష్ట్రాలకు వాటా ఇవ్వాలని ఉపముఖ్యమంత్రి కోరారు.

సంపద, ఆదాయం మధ్య పెద్ద అంతరం : సంక్షేమ కార్యక్రమాల బలోపేతం, మౌలిక సదుపాయాల కల్పన ద్వారా అంతరాలను పరిష్కరించడానికి అవకాశం ఉందని డిప్యూటీ సీఎం భట్టి అన్నారు. చారిత్రక కారణాల వల్ల అభివృద్ధిలో అసమానతలు ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర తలసరి ఆదాయం ఎక్కువ ఉన్నప్పటికీ సంపద, ఆదాయం మధ్య పెద్ద అంతరం ఉందని చెప్పారు. ఇలాంటి అసమానతలు మూలంగానే రాష్ట్ర సాధన ఉద్యమం ప్రారంభమైందని గుర్తు చేశారు. అసమానతల పరిష్కారానికి మౌలిక సదుపాయాలు, సంక్షేమ రంగంపై గణనీయంగా ఖర్చు చేయాల్సి ఉందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు.

కేంద్ర నిధుల్లో రాష్ట్రానికి వాటాలు మరింతగా పెంచండి - 16వ ఆర్థిక సంఘానికి ప్రభుత్వం విజ్ఞప్తి

రానున్న పదేళ్లలో తెలంగాణను ట్రిలియన్‌ డాలర్‌ ఎకానమీగా మార్చడమే మా లక్ష్యం - సీఎం రేవంత్​ - CM REVANTH INAGURATES COGNIZANT

16th Central Finance Commission Meeting in Hyderabad : కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు వచ్చే వాటాను 50 శాతానికి పెంచాలని, రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా కేంద్ర ప్రాయోజిత పథకాలను వినియోగించే వెసులుబాటు కల్పించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కోరారు. ప్రజాభవన్​లో జరిగిన 16వ కేంద్ర ఆర్థిక సంఘం సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రారంభ ఉపన్యాసాన్ని డిప్యూటీ సీఎం పలు అంశాలను ప్రస్తావించారు.

స్థూల పన్ను ఆదాయంలో రాష్ట్రాల వాటా తక్కువగా ఉందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. పన్నుల నుంచి రాష్ట్రాలకు వచ్చే ఆదాయం వాటాను 41శాతం నుంచి 50 శాతానికి పెంచాలని కోరారు. రైతు భరోసా, రైతు రుణమాఫీ రాష్ట్రానికి జీవరేఖ లాంటి పథకాలు రాష్ట్ర ప్రజలకు ఆర్థిక భరోసా, అధిక భద్రతను కల్పిస్తాయని అన్నారు. కేంద్ర పథకాలను వినియోగించుకోవాలంటే తరచూ కఠినమైన నిబంధనలు విధిస్తున్నారని, ఫలితంగా కేంద్ర ప్రాయోజిత పథకాలను పొందడంలో రాష్ట్రాలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని డిప్యూటీ సీఎం భట్టి పేర్కొన్నారు.

కీలక దశల్లో తెలంగాణ వేగంగా అడుగులు : రాష్ట్రాలు తమ అవసరాలకు అనుగుణంగా కేంద్ర ప్రాయోజిత పథకాలు వినియోగించుకునేలా స్వయం ప్రతిపత్తి కల్పించాలని ఆర్థిక సంఘాన్ని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కోరారు. కీలక దశలో ఉన్న తెలంగాణ రాష్ట్రం వేగంగా అడుగులు వేస్తుందని వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి రూ.6.85 లక్షల కోట్లకు పైగా రుణభారంతో సతమతం అవుతోందని వివరించారు. సెస్​లు, సర్​ఛార్జీలల్లో రాష్ట్రాలకు వాటా ఇవ్వాలని ఉపముఖ్యమంత్రి కోరారు.

సంపద, ఆదాయం మధ్య పెద్ద అంతరం : సంక్షేమ కార్యక్రమాల బలోపేతం, మౌలిక సదుపాయాల కల్పన ద్వారా అంతరాలను పరిష్కరించడానికి అవకాశం ఉందని డిప్యూటీ సీఎం భట్టి అన్నారు. చారిత్రక కారణాల వల్ల అభివృద్ధిలో అసమానతలు ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర తలసరి ఆదాయం ఎక్కువ ఉన్నప్పటికీ సంపద, ఆదాయం మధ్య పెద్ద అంతరం ఉందని చెప్పారు. ఇలాంటి అసమానతలు మూలంగానే రాష్ట్ర సాధన ఉద్యమం ప్రారంభమైందని గుర్తు చేశారు. అసమానతల పరిష్కారానికి మౌలిక సదుపాయాలు, సంక్షేమ రంగంపై గణనీయంగా ఖర్చు చేయాల్సి ఉందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు.

కేంద్ర నిధుల్లో రాష్ట్రానికి వాటాలు మరింతగా పెంచండి - 16వ ఆర్థిక సంఘానికి ప్రభుత్వం విజ్ఞప్తి

రానున్న పదేళ్లలో తెలంగాణను ట్రిలియన్‌ డాలర్‌ ఎకానమీగా మార్చడమే మా లక్ష్యం - సీఎం రేవంత్​ - CM REVANTH INAGURATES COGNIZANT

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.