ETV Bharat / offbeat

సూపర్ టేస్టీ, స్పైసీ "నెల్లూరు నెయ్యి కారం దోశ" - నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోండిలా! - Nellore Karam Dosa Recipe

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 8, 2024, 9:25 AM IST

Nellore Karam Dosa Recipe : రోజూ ఏ దోశ వేస్తాం? సాదా దోశ లేదంటే రవ్వ దోశ. మహా అయితే ఎగ్‌ దోశ. అయితే.. ఈసారి వెరైటీగా నెల్లూరు స్టైల్​లో ఇలా నెయ్యి కారం దోశ వేసుకోండి. టేస్ట్ సూపర్​గా ఉంటుంది! మరి దీనిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

How to Make Nellore Ghee Karam Dosa
Nellore Karam Dosa Recipe (ETV Bharat)

How to Make Nellore Ghee Karam Dosa : ఎక్కువ మంది బ్రేక్​ఫాస్ట్​లో ఇష్టపడే టిఫెన్స్​లో ఒకటి.. దోశ. ఈ టేస్టీ సౌత్ ఇండియన్ టిఫెన్​కు మంచి గిరాకీ ఉంటుంది. అయితే, దోశలలో రకరకాల వెరైటీలు ఉంటాయి. అందులో చాలా మంది ఇప్పటి వరకు ప్లెయిన్​ దోశ, మసాలా దోశ, ఆనియన్​ దోశ, ఎగ్​ దోశ, రవ్వ దోశ, పోహా దోశ(Poha Dosa).. వంటి వాటిని టేస్ట్ చేసి ఉంటారు. కానీ, ఎప్పుడైనా నెల్లూర్ ఫేమస్ నెయ్యి కారం దోశను రుచి చూశారా? దీన్ని ఒక్కసారి టేస్ట్ చేశారంటే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంటుంది ఈ దోశ. మరి, ఈ సూపర్ టేస్టీ దోశ తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు :

  • మినప పప్పు - 1 కప్పు
  • బియ్యం - 3 కప్పులు
  • మెంతులు - 1 టీస్పూన్
  • శనగపప్పు - 2 టేబుల్​స్పూన్లు
  • అటుకులు - పావు కప్పు

కారంపొడి కోసం :

  • ఎండుమిర్చి - 10
  • ఉప్పు - రుచికి సరిపడా
  • వెల్లుల్లి రెబ్బలు - 4
  • ఉల్లిపాయ - 2

పల్లీ చట్నీ కోసం :

  • పల్లీలు - 1 కప్పు
  • పచ్చిమిర్చి - 6
  • వెల్లుల్లి రెబ్బలు - 5
  • చింతపండు - కొద్దిగా
  • ఉప్పు - రుచికి సరిపడా

తయారీ విధానం :

  • ముందుగా దోశ పిండిని ప్రిపేర్​ చేసుకోవాలి. అందుకోసం ఒక బౌల్​లో మినప పప్పు, బియ్యం, మెంతులు, శనగపప్పును తీసుకొని శుభ్రంగా కడిగి కనీసం 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. అలాగే మరో బౌల్​లో అటుకులను కడిగి మంచినీళ్లు పోసుకొని 6 గంటలపాటు నానబెట్టుకోవాలి.
  • ఆ తర్వాత మిక్సీ జార్​లోకి బియ్యం, మినపప్పు మిశ్రమంతో పాటు నానబెట్టుకున్న అటుకులు, కొద్దిగా వాటర్ వేసుకొని పిండిని మరీ మెత్తగా కాకుండా కాస్త రవ్వలా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి.
  • ఆపై పిండిని గిన్నెలోకి తీసుకొని చేతితో రెండు నుంచి మూడు నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత 8 నుంచి 10 గంటల పాటు పులియబెట్టుకోవాలి. వాతావరణం చల్లగా ఉంటే పిండి పులియడానికి కాస్త టైమ్ పడుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
  • పిండి పులిసిన తర్వాత దాన్ని ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. ఆపై ఓ గిన్నెలోకి కావాల్సిన మొత్తంలో తీసుకుని.. రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసుకొని దోశ పిండిని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అయితే, పిండి అనేది మరీ మందంగా, పల్చగా ఉండకుండా చూసుకోవాలి.
  • ఇప్పుడు ఎర్రకారం కోసం వేడినీటిలో ఎండుమిర్చిని ఓ 15 నిమిషాలు నానబెట్టాలి.
  • ఎండుమిర్చి నానిన తర్వాత.. మిక్సీ జార్​ తీసుకుని అందులోకి నానబెట్టిన ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, కాస్త పెద్ద సైజ్​లో తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలతో పాటు అవసరమైతే కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తని పేస్ట్​లా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
  • ఆ తర్వాత పల్లీలను, పచ్చిమిర్చిని వేయించుకొని చల్లారాక మిక్సీ జార్​లోకి తీసుకొని వెల్లుల్లి రెబ్బలు, చింతపండు, ఉప్పు, కొద్దిగా వాటర్ వేసుకొని చట్నీని ప్రిపేర్ చేసుకోవాలి. అందులో సగం చట్నీని గట్టిగా ఉంచుకొని, మిగతా చట్నీని కాస్త వాటర్ కలుపుకొని దోశలు తినడానికి రెడీ చేసుకోవచ్చు.
  • ఇప్పడు స్టౌ​ ఆన్​ చేసి దోశ పెనం పెట్టి బాగా హీట్​ చేసుకోవాలి. అది వేడెక్కిన తర్వాత కొద్దిగా వాటర్ చల్లుకొని టిష్యూ పేపర్ లేదా కాటర్ క్లాత్​తో క్లీన్ చేసుకోవాలి.
  • అనంతరం మంటను లో-ఫ్లేమ్​లో ఉంచి కొద్దిగా దోశ పిండిని వేసుకుని వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి.
  • దోశపై తడి ఆరిపోయేంత వరకు ఉడికించుకున్నాక దానిపై రెండు టీస్పూన్ల గట్టి పల్లీ చట్నీ, ఒక టీస్పూన్ ఎర్రకారం, అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఆ మిశ్రమాన్నంతా దోశ మెుత్తం సమానంగా స్ప్రెడ్ అయ్యేలా గరిటెతో రుద్దుకోవాలి.
  • ఆపై మంటను మీడియం ఫ్లేమ్​లో ఉంచి దోశ అన్ని వైపులా చక్కగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్​లోకి తీసుకుంటే చాలు. అంతే.. ఎంతో టేస్టీగా ఉండే "నెల్లూర్ నెయ్యి కారం దోశ" రెడీ!

ఇవీ చదవండి :

నోరూరించే "పాలకూర దోశ" - ఆకుకూరలు తినని వారికి బెస్ట్​ ఛాయిస్​ - ప్రిపరేషన్ వెరీ ఈజీ!

దోశలు క్రిస్పీగా రావడం లేదా? ఈ టిప్స్ పాటిస్తూ వేస్తే సూపర్​ క్రిస్పీతో పాటు టేస్ట్ అద్దిరిపోతాయి!

How to Make Nellore Ghee Karam Dosa : ఎక్కువ మంది బ్రేక్​ఫాస్ట్​లో ఇష్టపడే టిఫెన్స్​లో ఒకటి.. దోశ. ఈ టేస్టీ సౌత్ ఇండియన్ టిఫెన్​కు మంచి గిరాకీ ఉంటుంది. అయితే, దోశలలో రకరకాల వెరైటీలు ఉంటాయి. అందులో చాలా మంది ఇప్పటి వరకు ప్లెయిన్​ దోశ, మసాలా దోశ, ఆనియన్​ దోశ, ఎగ్​ దోశ, రవ్వ దోశ, పోహా దోశ(Poha Dosa).. వంటి వాటిని టేస్ట్ చేసి ఉంటారు. కానీ, ఎప్పుడైనా నెల్లూర్ ఫేమస్ నెయ్యి కారం దోశను రుచి చూశారా? దీన్ని ఒక్కసారి టేస్ట్ చేశారంటే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంటుంది ఈ దోశ. మరి, ఈ సూపర్ టేస్టీ దోశ తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు :

  • మినప పప్పు - 1 కప్పు
  • బియ్యం - 3 కప్పులు
  • మెంతులు - 1 టీస్పూన్
  • శనగపప్పు - 2 టేబుల్​స్పూన్లు
  • అటుకులు - పావు కప్పు

కారంపొడి కోసం :

  • ఎండుమిర్చి - 10
  • ఉప్పు - రుచికి సరిపడా
  • వెల్లుల్లి రెబ్బలు - 4
  • ఉల్లిపాయ - 2

పల్లీ చట్నీ కోసం :

  • పల్లీలు - 1 కప్పు
  • పచ్చిమిర్చి - 6
  • వెల్లుల్లి రెబ్బలు - 5
  • చింతపండు - కొద్దిగా
  • ఉప్పు - రుచికి సరిపడా

తయారీ విధానం :

  • ముందుగా దోశ పిండిని ప్రిపేర్​ చేసుకోవాలి. అందుకోసం ఒక బౌల్​లో మినప పప్పు, బియ్యం, మెంతులు, శనగపప్పును తీసుకొని శుభ్రంగా కడిగి కనీసం 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. అలాగే మరో బౌల్​లో అటుకులను కడిగి మంచినీళ్లు పోసుకొని 6 గంటలపాటు నానబెట్టుకోవాలి.
  • ఆ తర్వాత మిక్సీ జార్​లోకి బియ్యం, మినపప్పు మిశ్రమంతో పాటు నానబెట్టుకున్న అటుకులు, కొద్దిగా వాటర్ వేసుకొని పిండిని మరీ మెత్తగా కాకుండా కాస్త రవ్వలా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి.
  • ఆపై పిండిని గిన్నెలోకి తీసుకొని చేతితో రెండు నుంచి మూడు నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత 8 నుంచి 10 గంటల పాటు పులియబెట్టుకోవాలి. వాతావరణం చల్లగా ఉంటే పిండి పులియడానికి కాస్త టైమ్ పడుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
  • పిండి పులిసిన తర్వాత దాన్ని ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. ఆపై ఓ గిన్నెలోకి కావాల్సిన మొత్తంలో తీసుకుని.. రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసుకొని దోశ పిండిని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అయితే, పిండి అనేది మరీ మందంగా, పల్చగా ఉండకుండా చూసుకోవాలి.
  • ఇప్పుడు ఎర్రకారం కోసం వేడినీటిలో ఎండుమిర్చిని ఓ 15 నిమిషాలు నానబెట్టాలి.
  • ఎండుమిర్చి నానిన తర్వాత.. మిక్సీ జార్​ తీసుకుని అందులోకి నానబెట్టిన ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, కాస్త పెద్ద సైజ్​లో తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలతో పాటు అవసరమైతే కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తని పేస్ట్​లా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
  • ఆ తర్వాత పల్లీలను, పచ్చిమిర్చిని వేయించుకొని చల్లారాక మిక్సీ జార్​లోకి తీసుకొని వెల్లుల్లి రెబ్బలు, చింతపండు, ఉప్పు, కొద్దిగా వాటర్ వేసుకొని చట్నీని ప్రిపేర్ చేసుకోవాలి. అందులో సగం చట్నీని గట్టిగా ఉంచుకొని, మిగతా చట్నీని కాస్త వాటర్ కలుపుకొని దోశలు తినడానికి రెడీ చేసుకోవచ్చు.
  • ఇప్పడు స్టౌ​ ఆన్​ చేసి దోశ పెనం పెట్టి బాగా హీట్​ చేసుకోవాలి. అది వేడెక్కిన తర్వాత కొద్దిగా వాటర్ చల్లుకొని టిష్యూ పేపర్ లేదా కాటర్ క్లాత్​తో క్లీన్ చేసుకోవాలి.
  • అనంతరం మంటను లో-ఫ్లేమ్​లో ఉంచి కొద్దిగా దోశ పిండిని వేసుకుని వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి.
  • దోశపై తడి ఆరిపోయేంత వరకు ఉడికించుకున్నాక దానిపై రెండు టీస్పూన్ల గట్టి పల్లీ చట్నీ, ఒక టీస్పూన్ ఎర్రకారం, అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఆ మిశ్రమాన్నంతా దోశ మెుత్తం సమానంగా స్ప్రెడ్ అయ్యేలా గరిటెతో రుద్దుకోవాలి.
  • ఆపై మంటను మీడియం ఫ్లేమ్​లో ఉంచి దోశ అన్ని వైపులా చక్కగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్​లోకి తీసుకుంటే చాలు. అంతే.. ఎంతో టేస్టీగా ఉండే "నెల్లూర్ నెయ్యి కారం దోశ" రెడీ!

ఇవీ చదవండి :

నోరూరించే "పాలకూర దోశ" - ఆకుకూరలు తినని వారికి బెస్ట్​ ఛాయిస్​ - ప్రిపరేషన్ వెరీ ఈజీ!

దోశలు క్రిస్పీగా రావడం లేదా? ఈ టిప్స్ పాటిస్తూ వేస్తే సూపర్​ క్రిస్పీతో పాటు టేస్ట్ అద్దిరిపోతాయి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.