ETV Bharat / offbeat

కార్తికమాసం స్పెషల్​ - అరుణాచలం TO తంజావూర్ - రూ.14వేలకే IRCTC సూపర్​ ప్యాకేజీ!

-తొమ్మిది రోజుల పాటు ఐఆర్​సీటీసీ టూర్​ -అతి తక్కువ ధరకే ఈ ప్రదేశాలు విజిట్​ చేయొచ్చు

IRCTC KARTIKA MASAM SPECIAL TOUR
IRCTC Divya Dakshin Yatra with Jyotirlinga Package (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : 2 hours ago

IRCTC Divya Dakshin Yatra with Jyotirlinga Package: మరికొన్ని రోజుల్లో కార్తిక మాసం రానుంది. ఈ మాసంలో చాలా మంది దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలనుకుంటారు. మరి మీరు కూడా ఆ లిస్ట్​లో ఉన్నారా? అయితే మీకో గుడ్​న్యూస్​. ఇండియన్​ రైల్వే క్యాటరింగ్​​ అండ్​​ టూరిజం కార్పొరేషన్ (IRCTC) అద్దిరిపోయే ప్యాకేజీ తీసుకొచ్చింది. అతి తక్కువ ధరకే ప్రముఖ దేవాలయాలను దర్శించుకునేందుకు వీలుగా ఓ అవకాశం కల్పిస్తోంది. మరి, ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

భారత్​ గౌరవ్​ టూరిస్ట్​ ట్రైన్​ ద్వారా కార్తిక మాసం స్పెషల్​గా ఐఆర్​సీటీసీ "దివ్య దక్షిణ యాత్ర విత్ జ్యోతిర్లింగ" పేరుతో ఈ ప్యాకేజీ తీసుకొచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఈ రైలు ప్రయాణిస్తుంది. ఈ టూర్ మొత్తం 8 రాత్రులు, 9 పగళ్లు ఉంటుంది. హైదరాబాద్​ నుంచి ప్రయాణం స్టార్ట్​ అవుతుంది. మరి ప్రయాణ వివరాలు చూస్తే..

  • మొదటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు సికింద్రాబాద్​ నుంచి భారత్​ గౌరవ్​ టూరిస్ట్​ ట్రైన్​ స్టార్ట్​ అవుతుంది. భువనగిరి, జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్​, డోర్నకల్​, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట మీదుగా రెండో రోజు ఉదయం 8 గంటలకు తిరువణ్ణామలై రైల్వేస్టేషన్​కు చేరుకుంటారు. అక్కడి నుంచి ముందుగానే బుక్​ చేసిన హోటల్​కు తీసుకెళ్తారు. అక్కడ ప్రెషప్​ అయ్యి.. అరుణాచలం ఆలయాన్ని దర్శించుకుంటారు. ఆ తర్వాత రైల్వే స్టేషన్‌కు వచ్చి కుదాల్​నగర్​ స్టార్ట్​ అవుతారు.
  • మూడో రోజు ఉదయం కుదాల్​నగర్​ చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా రామేశ్వరం చేరుకుంటారు. అక్కడ హోటల్​లో చెకిన్​ అవుతారు. తర్వాత ఫ్రెష్​ అయ్యి స్థానికంగా ఉన్న దేవాలయాలను దర్శించుకుంటారు. సాయంత్రం తిరిగి హోటల్​కు చేరుకుని ఆ రాత్రి అక్కడే భోజనం చేసి స్టే చేస్తారు.
  • నాలుగోరోజు మధ్యాహ్నం భోజనం తర్వాత రామేశ్వరం నుంచి బస్సు ప్రయాణం ద్వారా మధురై స్టార్ట్​ అవుతారు. సాయంత్రం మీనాక్షి అమ్మన్​ ఆలయాన్ని దర్శించుకుంటారు. ఆ తర్వాత సమయాన్ని బట్టి షాపింగ్​ చేసుకోవచ్చు. అనంతరం కుదాల్​నగర్​ రైల్వేస్టేషన్​కు చేరుకుంటారు. అక్కడి నుంచి కన్యాకుమారికి ట్రైన్​ జర్నీ స్టార్ట్​ అవుతుంది.
  • ఐదో రోజు ఉదయం కన్యాకుమారి రైల్వే స్టేషన్​కు చేరుకుంటారు. హోటల్​లో చెకిన్​ అయ్యి ఫ్రెషప్​ అనంతరం రాక్​ మెమోరియల్​, గాంధీ మండపం, సన్​సెట్​ సందర్శిస్తారు. తిరిగి హోటల్​కు చేరుకుని భోజనం ముగించి ఆ రాత్రికి కన్యాకుమారిలో స్టే చేస్తారు.
  • ఆరో రోజు ఉదయం బ్రేక్​ఫాస్ట్​ అనంతరం హోటల్​ నుంచి చెక్​ అవుట్​ అయ్యి కన్యాకుమారి రైల్వే స్టేషన్​కు చేరుకుని అక్కడి నుంచి కొచ్చువేలికి బయలుదేరుతారు. కొచ్చువేలి చేరుకున్న తర్వాత రోడ్డు మార్గం ద్వారా త్రివేండ్రం స్టార్ట్​ అవుతారు. అక్కడికి చేరుకున్నాక పద్మనాభ స్వామి ఆలయం దర్శించుకుంటారు. ఆ తర్వాత కొద్దిసేపు కోవలం బీచ్​లో ఎంజాయ్​ చేస్తారు. అక్కడి నుంచి కొచ్చువేలి స్టేషన్​కు చేరుకుని అక్కడి నుంచి తిరుచిరాపల్లి బయలుదేరుతారు.
  • ఏడో రోజు ఉదయం తిరుచిరాపల్లి చేరుకుని హోటల్​లో ఫ్రెషప్​ అనంతరం శ్రీరంగం టెంపుల్​ దర్శించుకుంటారు. మధ్యాహ్నం భోజనం తర్వాత తంజావూర్​ స్టార్ట్​ అవుతారు. అక్కడ బృహదీశ్వర ఆలయాన్ని దర్శించుకుని.. అక్కడి నుంచి తంజావూర్​ రైల్వే స్టేషన్​కు చేరుకుంటారు. అక్కడి నుంచి సికింద్రాబాద్​కు స్టార్ట్​ అవుతారు.
  • 8వ రోజు రేణిగుంట, గూడూరు, నెల్లూరు, కావలి, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, మధిర, ఖమ్మం, డోర్నకల్​, మహబూబాబాద్​, వరంగల్​, కాజీపేట, జనగాం, భువనగిరి మీదుగా 9వ రోజు ఉదయం 2.30 గంటలకు సికింద్రాబాద్ చేరుకోవడంతో దివ్య దర్శన యాత్ర పూర్తవుతుంది.

ప్యాకేజీ ధరలు చూస్తే..

  • ఎకానమీ(SL): పెద్దలకు రూ.14,250, 5 నుంచి 11 సంవత్సరాల పిల్లలకు రూ.13,250గా నిర్ణయించారు.
  • స్టాండర్డ్​(3AC): పెద్దలకు రూ.21,900, 5 నుంచి 11 సంవత్సరాల పిల్లలకు రూ.20,700గా నిర్ణయించారు.
  • కంఫర్ట్​(2AC): పెద్దలకు రూ.28,450, 5 నుంచి 11 సంవత్సరాల పిల్లలకు రూ.27,010గా ధరలు నిర్ణయించారు.

ప్యాకేజీలో ఉండేవి ఇవే:

  • ట్రైన్​ టికెట్లు
  • హోటల్​ అకామిడేషన్​
  • ఉదయం టీ, టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనం రైల్వే సిబ్బంది చూసుకుంటారు.
  • ప్యాకేజ్​ను బట్టి ప్రయాణానికి ఏసీ లేదా నాన్​ ఏసీ వెహికిల్ సమకూరుస్తారు.
  • టూరిస్టులకు ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉంటుంది.
  • ప్రస్తుతం ఈ టూర్​ నవంబర్​ 6వ తేదీన ప్రారంభం కానుంది.
  • ఈ ప్యాకేజీకి సంబంధించి వివరాలు, టూర్​ బుకింగ్​ కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

కాఫీ విత్ కర్ణాటక : హైదరాబాద్​ నుంచి IRCTC సూపర్​ ప్యాకేజీ! - తక్కువ ధరలోనే ఎంజాయ్​ చేసిరావొచ్చు!

IRCTC "హ్యాపీ హిమాచల్​ అండ్​ పాపులర్​ పంజాబ్​" - అందుబాటు ధరలోనే 8 రోజుల టూర్​!

IRCTC Divya Dakshin Yatra with Jyotirlinga Package: మరికొన్ని రోజుల్లో కార్తిక మాసం రానుంది. ఈ మాసంలో చాలా మంది దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలనుకుంటారు. మరి మీరు కూడా ఆ లిస్ట్​లో ఉన్నారా? అయితే మీకో గుడ్​న్యూస్​. ఇండియన్​ రైల్వే క్యాటరింగ్​​ అండ్​​ టూరిజం కార్పొరేషన్ (IRCTC) అద్దిరిపోయే ప్యాకేజీ తీసుకొచ్చింది. అతి తక్కువ ధరకే ప్రముఖ దేవాలయాలను దర్శించుకునేందుకు వీలుగా ఓ అవకాశం కల్పిస్తోంది. మరి, ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

భారత్​ గౌరవ్​ టూరిస్ట్​ ట్రైన్​ ద్వారా కార్తిక మాసం స్పెషల్​గా ఐఆర్​సీటీసీ "దివ్య దక్షిణ యాత్ర విత్ జ్యోతిర్లింగ" పేరుతో ఈ ప్యాకేజీ తీసుకొచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఈ రైలు ప్రయాణిస్తుంది. ఈ టూర్ మొత్తం 8 రాత్రులు, 9 పగళ్లు ఉంటుంది. హైదరాబాద్​ నుంచి ప్రయాణం స్టార్ట్​ అవుతుంది. మరి ప్రయాణ వివరాలు చూస్తే..

  • మొదటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు సికింద్రాబాద్​ నుంచి భారత్​ గౌరవ్​ టూరిస్ట్​ ట్రైన్​ స్టార్ట్​ అవుతుంది. భువనగిరి, జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్​, డోర్నకల్​, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట మీదుగా రెండో రోజు ఉదయం 8 గంటలకు తిరువణ్ణామలై రైల్వేస్టేషన్​కు చేరుకుంటారు. అక్కడి నుంచి ముందుగానే బుక్​ చేసిన హోటల్​కు తీసుకెళ్తారు. అక్కడ ప్రెషప్​ అయ్యి.. అరుణాచలం ఆలయాన్ని దర్శించుకుంటారు. ఆ తర్వాత రైల్వే స్టేషన్‌కు వచ్చి కుదాల్​నగర్​ స్టార్ట్​ అవుతారు.
  • మూడో రోజు ఉదయం కుదాల్​నగర్​ చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా రామేశ్వరం చేరుకుంటారు. అక్కడ హోటల్​లో చెకిన్​ అవుతారు. తర్వాత ఫ్రెష్​ అయ్యి స్థానికంగా ఉన్న దేవాలయాలను దర్శించుకుంటారు. సాయంత్రం తిరిగి హోటల్​కు చేరుకుని ఆ రాత్రి అక్కడే భోజనం చేసి స్టే చేస్తారు.
  • నాలుగోరోజు మధ్యాహ్నం భోజనం తర్వాత రామేశ్వరం నుంచి బస్సు ప్రయాణం ద్వారా మధురై స్టార్ట్​ అవుతారు. సాయంత్రం మీనాక్షి అమ్మన్​ ఆలయాన్ని దర్శించుకుంటారు. ఆ తర్వాత సమయాన్ని బట్టి షాపింగ్​ చేసుకోవచ్చు. అనంతరం కుదాల్​నగర్​ రైల్వేస్టేషన్​కు చేరుకుంటారు. అక్కడి నుంచి కన్యాకుమారికి ట్రైన్​ జర్నీ స్టార్ట్​ అవుతుంది.
  • ఐదో రోజు ఉదయం కన్యాకుమారి రైల్వే స్టేషన్​కు చేరుకుంటారు. హోటల్​లో చెకిన్​ అయ్యి ఫ్రెషప్​ అనంతరం రాక్​ మెమోరియల్​, గాంధీ మండపం, సన్​సెట్​ సందర్శిస్తారు. తిరిగి హోటల్​కు చేరుకుని భోజనం ముగించి ఆ రాత్రికి కన్యాకుమారిలో స్టే చేస్తారు.
  • ఆరో రోజు ఉదయం బ్రేక్​ఫాస్ట్​ అనంతరం హోటల్​ నుంచి చెక్​ అవుట్​ అయ్యి కన్యాకుమారి రైల్వే స్టేషన్​కు చేరుకుని అక్కడి నుంచి కొచ్చువేలికి బయలుదేరుతారు. కొచ్చువేలి చేరుకున్న తర్వాత రోడ్డు మార్గం ద్వారా త్రివేండ్రం స్టార్ట్​ అవుతారు. అక్కడికి చేరుకున్నాక పద్మనాభ స్వామి ఆలయం దర్శించుకుంటారు. ఆ తర్వాత కొద్దిసేపు కోవలం బీచ్​లో ఎంజాయ్​ చేస్తారు. అక్కడి నుంచి కొచ్చువేలి స్టేషన్​కు చేరుకుని అక్కడి నుంచి తిరుచిరాపల్లి బయలుదేరుతారు.
  • ఏడో రోజు ఉదయం తిరుచిరాపల్లి చేరుకుని హోటల్​లో ఫ్రెషప్​ అనంతరం శ్రీరంగం టెంపుల్​ దర్శించుకుంటారు. మధ్యాహ్నం భోజనం తర్వాత తంజావూర్​ స్టార్ట్​ అవుతారు. అక్కడ బృహదీశ్వర ఆలయాన్ని దర్శించుకుని.. అక్కడి నుంచి తంజావూర్​ రైల్వే స్టేషన్​కు చేరుకుంటారు. అక్కడి నుంచి సికింద్రాబాద్​కు స్టార్ట్​ అవుతారు.
  • 8వ రోజు రేణిగుంట, గూడూరు, నెల్లూరు, కావలి, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, మధిర, ఖమ్మం, డోర్నకల్​, మహబూబాబాద్​, వరంగల్​, కాజీపేట, జనగాం, భువనగిరి మీదుగా 9వ రోజు ఉదయం 2.30 గంటలకు సికింద్రాబాద్ చేరుకోవడంతో దివ్య దర్శన యాత్ర పూర్తవుతుంది.

ప్యాకేజీ ధరలు చూస్తే..

  • ఎకానమీ(SL): పెద్దలకు రూ.14,250, 5 నుంచి 11 సంవత్సరాల పిల్లలకు రూ.13,250గా నిర్ణయించారు.
  • స్టాండర్డ్​(3AC): పెద్దలకు రూ.21,900, 5 నుంచి 11 సంవత్సరాల పిల్లలకు రూ.20,700గా నిర్ణయించారు.
  • కంఫర్ట్​(2AC): పెద్దలకు రూ.28,450, 5 నుంచి 11 సంవత్సరాల పిల్లలకు రూ.27,010గా ధరలు నిర్ణయించారు.

ప్యాకేజీలో ఉండేవి ఇవే:

  • ట్రైన్​ టికెట్లు
  • హోటల్​ అకామిడేషన్​
  • ఉదయం టీ, టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనం రైల్వే సిబ్బంది చూసుకుంటారు.
  • ప్యాకేజ్​ను బట్టి ప్రయాణానికి ఏసీ లేదా నాన్​ ఏసీ వెహికిల్ సమకూరుస్తారు.
  • టూరిస్టులకు ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉంటుంది.
  • ప్రస్తుతం ఈ టూర్​ నవంబర్​ 6వ తేదీన ప్రారంభం కానుంది.
  • ఈ ప్యాకేజీకి సంబంధించి వివరాలు, టూర్​ బుకింగ్​ కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

కాఫీ విత్ కర్ణాటక : హైదరాబాద్​ నుంచి IRCTC సూపర్​ ప్యాకేజీ! - తక్కువ ధరలోనే ఎంజాయ్​ చేసిరావొచ్చు!

IRCTC "హ్యాపీ హిమాచల్​ అండ్​ పాపులర్​ పంజాబ్​" - అందుబాటు ధరలోనే 8 రోజుల టూర్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.