ETV Bharat / offbeat

90's కిడ్స్​ ఫేవరెట్ "తేనె మిఠాయిలు" - ఇక ఇంట్లోనే సింపుల్​గా చేసుకోండి! సూపర్​ టేస్ట్​!

-ఎక్కడ దొరకని వీటిని ఇంట్లోనే ఈజీగా తయారు చేయండి -టేస్ట్​ గురించి చెప్పక్కర్లేదు

author img

By ETV Bharat Telugu Team

Published : 2 hours ago

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

How to Make Dry Rasgulla : మనలో చాలా మంది చిన్నతనంలో తేనె మిఠాయిలు తినే ఉంటారు. వీటినే డ్రై రసగుల్లాలు అని కూడా వీటిని పిలుస్తారు. పైన క్రిస్పీగా, లోపల జ్యూసీ జ్యూసీగా ఉండే ఇవే ఎంతో రుచికరంగా ఉంటాయి. నోట్లో వేసుకోగానే కరిగే ఈ మిఠాయిలు 90's కిడ్స్​కి చాలా ఫేవరెట్​. అయితే, ప్రస్తుత కాలంలో ఇవి ఎక్కువగా దొరకడం లేదు. కాబట్టి ఇంట్లోనే సింపుల్​గా ఈ తేనె మిఠాయిలను తయారు చేసుకోండి. ఇక ఈ జనరేషన్​ పిల్లలకు ఇస్తే ఇష్టంగా తినేస్తారు. మరి వాటిని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు..

  • మైదా పిండి-కప్పు
  • కార్న్​ఫ్లోర్​ -టీస్పూన్​
  • బేకింగ్​ పౌడర్​-అర టీస్పూన్​
  • పంచదార-కప్పు
  • నీళ్లు-ముప్పావు కప్పు(3/4)
  • ఫుడ్​ కలర్​-పావు టీస్పూన్​
  • నిమ్మరసం-2 టేబుల్​స్పూన్లు
  • ఆయిల్​ -డీప్​ ఫ్రైకి సరిపడా
  • యాలకుల పొడి-అరటీస్పూన్​

తయారీ విధానం..

  • ముందుగా ఒక మిక్సింగ్​ బౌల్లో మైదా పిండి జల్లించి తీసుకోవాలి. అలాగే కార్న్​ఫ్లోర్​, చిటికెడు ఉప్పు, బేకింగ్​ పౌడర్​ కూడా జల్లించుకోవాలి. (బేకింగ్ పౌడర్​కి బదులుగా వంటసోడా కూడా యూజ్​ చేయవచ్చు)
  • ఇందులోనే ఫుడ్​ కలర్​ వేసుకుని పిండిని బాగా కలుపుకోవాలి. పిండిలో కొద్దిగా నిమ్మరసం వేసి కలుపుకోవాలి. తర్వాత కొద్దికొద్దిగా నీళ్లు కలుపుకుంటూ సాఫ్ట్​గా పిండి ముద్దను చేసుకోవాలి.
  • తర్వాత కొద్దిగా నూనె వేసి.. పిండి ముద్దను కలిపి మూత పెట్టాలి.
  • ఇప్పుడు పంచదార పాకం కోసం.. స్టౌపై పాన్​ పెట్టండి. ఇందులో నీళ్లు పోసి పంచదార వేసి కరిగించండి.
  • ఈ తేనె మిఠాయి కోసం పంచదార పాకం.. గులాబ్​ జామున్​ పాకానికి ఎక్కువగా, తీగ పాకానికి తక్కువగా ఉండాలి.
  • పాకం రెడీ అయిన తర్వాత ఇందులో యాలకుల పొడి, నిమ్మరసం వేసి స్టౌ ఆఫ్​ చేసి మూత పెట్టండి.
  • ఇప్పుడు రసగుల్లాలు చేయడానికి పిండిని మరోసారి మిక్స్​ చేయాలి.
  • కొద్దిగా పొడి పిండి చల్లి చపాతీ కర్రతో కాస్త మందంగా చపాతీలాగా చేసుకోవాలి.
  • ఇప్పుడు క్యాప్​ సహాయంతో చిన్నగా రసగుల్లాలుగా చేసుకోవాలి.
  • తేనె మిఠాయిలను ఫ్రై చేయడానికి స్టౌపై కడాయి పెట్టండి. ఇందులో సరిపడా నూనె వేసి వేడి చేయండి.
  • ఆయిల్​ వేడైన తర్వాత రసగుల్లాలను ఒక్కోటిగా వేస్తు బాగా ఫ్రై చేసుకోండి. రసగుల్లాలు వేగిన తర్వాత వాటిని గోరువెచ్చగా ఉన్న చక్కెర పాకంలో వేసి 10 నిమిషాలు అలా వదిలేయండి.
  • తర్వాత ప్లేట్​లోకి తీసుకోండి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత తినండి. అంతే టేస్టీగా ఉంటాయి.
  • ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా పిల్లలకు ఈ విధంగా తేనె మిఠాయిలు చేసి పెట్టండి.

కరకరలాడే 'పిచ్చుక గూళ్లు' - ఈ వెరైటీ స్వీట్ మీరెప్పుడైనా టేస్ట్ చేశారా?

నోట్లో వేస్తే కరిగిపోయే "కమ్మని కలాకండ్​" - ఇలా చేస్తే అచ్చం స్వీట్​ షాప్​ టేస్ట్​!

How to Make Dry Rasgulla : మనలో చాలా మంది చిన్నతనంలో తేనె మిఠాయిలు తినే ఉంటారు. వీటినే డ్రై రసగుల్లాలు అని కూడా వీటిని పిలుస్తారు. పైన క్రిస్పీగా, లోపల జ్యూసీ జ్యూసీగా ఉండే ఇవే ఎంతో రుచికరంగా ఉంటాయి. నోట్లో వేసుకోగానే కరిగే ఈ మిఠాయిలు 90's కిడ్స్​కి చాలా ఫేవరెట్​. అయితే, ప్రస్తుత కాలంలో ఇవి ఎక్కువగా దొరకడం లేదు. కాబట్టి ఇంట్లోనే సింపుల్​గా ఈ తేనె మిఠాయిలను తయారు చేసుకోండి. ఇక ఈ జనరేషన్​ పిల్లలకు ఇస్తే ఇష్టంగా తినేస్తారు. మరి వాటిని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు..

  • మైదా పిండి-కప్పు
  • కార్న్​ఫ్లోర్​ -టీస్పూన్​
  • బేకింగ్​ పౌడర్​-అర టీస్పూన్​
  • పంచదార-కప్పు
  • నీళ్లు-ముప్పావు కప్పు(3/4)
  • ఫుడ్​ కలర్​-పావు టీస్పూన్​
  • నిమ్మరసం-2 టేబుల్​స్పూన్లు
  • ఆయిల్​ -డీప్​ ఫ్రైకి సరిపడా
  • యాలకుల పొడి-అరటీస్పూన్​

తయారీ విధానం..

  • ముందుగా ఒక మిక్సింగ్​ బౌల్లో మైదా పిండి జల్లించి తీసుకోవాలి. అలాగే కార్న్​ఫ్లోర్​, చిటికెడు ఉప్పు, బేకింగ్​ పౌడర్​ కూడా జల్లించుకోవాలి. (బేకింగ్ పౌడర్​కి బదులుగా వంటసోడా కూడా యూజ్​ చేయవచ్చు)
  • ఇందులోనే ఫుడ్​ కలర్​ వేసుకుని పిండిని బాగా కలుపుకోవాలి. పిండిలో కొద్దిగా నిమ్మరసం వేసి కలుపుకోవాలి. తర్వాత కొద్దికొద్దిగా నీళ్లు కలుపుకుంటూ సాఫ్ట్​గా పిండి ముద్దను చేసుకోవాలి.
  • తర్వాత కొద్దిగా నూనె వేసి.. పిండి ముద్దను కలిపి మూత పెట్టాలి.
  • ఇప్పుడు పంచదార పాకం కోసం.. స్టౌపై పాన్​ పెట్టండి. ఇందులో నీళ్లు పోసి పంచదార వేసి కరిగించండి.
  • ఈ తేనె మిఠాయి కోసం పంచదార పాకం.. గులాబ్​ జామున్​ పాకానికి ఎక్కువగా, తీగ పాకానికి తక్కువగా ఉండాలి.
  • పాకం రెడీ అయిన తర్వాత ఇందులో యాలకుల పొడి, నిమ్మరసం వేసి స్టౌ ఆఫ్​ చేసి మూత పెట్టండి.
  • ఇప్పుడు రసగుల్లాలు చేయడానికి పిండిని మరోసారి మిక్స్​ చేయాలి.
  • కొద్దిగా పొడి పిండి చల్లి చపాతీ కర్రతో కాస్త మందంగా చపాతీలాగా చేసుకోవాలి.
  • ఇప్పుడు క్యాప్​ సహాయంతో చిన్నగా రసగుల్లాలుగా చేసుకోవాలి.
  • తేనె మిఠాయిలను ఫ్రై చేయడానికి స్టౌపై కడాయి పెట్టండి. ఇందులో సరిపడా నూనె వేసి వేడి చేయండి.
  • ఆయిల్​ వేడైన తర్వాత రసగుల్లాలను ఒక్కోటిగా వేస్తు బాగా ఫ్రై చేసుకోండి. రసగుల్లాలు వేగిన తర్వాత వాటిని గోరువెచ్చగా ఉన్న చక్కెర పాకంలో వేసి 10 నిమిషాలు అలా వదిలేయండి.
  • తర్వాత ప్లేట్​లోకి తీసుకోండి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత తినండి. అంతే టేస్టీగా ఉంటాయి.
  • ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా పిల్లలకు ఈ విధంగా తేనె మిఠాయిలు చేసి పెట్టండి.

కరకరలాడే 'పిచ్చుక గూళ్లు' - ఈ వెరైటీ స్వీట్ మీరెప్పుడైనా టేస్ట్ చేశారా?

నోట్లో వేస్తే కరిగిపోయే "కమ్మని కలాకండ్​" - ఇలా చేస్తే అచ్చం స్వీట్​ షాప్​ టేస్ట్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.