ETV Bharat / offbeat

యువతలో చైతన్యం - రాష్ట్రపతి అవార్డు అందుకున్న అనంతపురం యువకుడు - Achieving Award by Social Programs

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 10, 2024, 5:19 PM IST

Anantapur Man Achieving President's Award With Social Programs : సేవామార్గాన్ని ఎంచుకోవడం కోసం బీటెక్‌ చదువును వదులుకుని డిగ్రీ వైపు అడుగులేశాడా యువకుడు. ఎన్​ఎస్​ఎస్​లో చేరిన అనతికాలంలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలచే ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నాడు. అంతేకాదు ప్రభుత్వ కార్యక్రమాలకు అంబాసిడర్​గా వ్యవహరించాడు. రాష్ట్రపతి నుంచి ఆహ్వానం పొందాడు. ఐక్యరాజ్యసమితి సదస్సులో సైతం పాల్గొని వారెవ్వా అనిపించిన తెలుగు తేజం గురించి తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.

anantapur_man_achieving_presidents_award
anantapur_man_achieving_presidents_award (ETV Bharat)

Anantapur Man Achieving President's Award With Social Programs : ఉన్నతంగా చదవాలి, ఉద్యోగంలో చేరాలి, ఐదంకెల జీతం తీసుకోవాలనేదే నేటి యువత ఆలోచన. కానీ, అంతటితో జీవితానికి సార్థకత లభించదని భావించాడీ యువకుడు. ఎన్​ఎస్​ఎస్​లో చేరిన అనతికాలంలో ఐక్యరాజ్యసమితి సదసులో పాల్గొని యువత పారిశ్రామికవేత్తలుగా ఎదిగితే ఒనగూరే ప్రయోజానాలు వివరించి అక్కడి ప్రతినిధులచే ప్రశంసలు అందుకున్నాడు.

అనంతపురం జిల్లా కందిగోపుల గ్రామానికి చెందిన వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు భరత్‌. తల్లిదండ్రులు ఆదినారాయణ, శారద చంద్రిక దేవి. పదో తరగతిలో ప్రతిభ కనబరిచి ఉచితంగా ఇంటర్‌ చదివాడు భరత్‌. ఎంసెట్‌లో మంచి ర్యాంకు సాధించి బీటెక్‌లో చేరినా బాల్యం నుంచి సేవా కార్యక్రమాలపై ఉన్న ప్రేమతో డిగ్రీ చేయాలని భావించాడు.

డిగ్రీలో చేరిన తొలినాళ్లలోనే ఎన్​ఎస్​ఎస్​లో చేరిన ఈ యువకుడు అనతి కాలంలోనే అనేక సేవా కార్యక్రమాలకు ప్రాతినిధ్యం వహించాడు. 39సార్లు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి వేలాది యువతను అందులో భాగం చేశాడు. 35సార్లు రక్తదానం చేసి ఇండియన్ రెడ్‌క్రాస్ నుంచి ఉత్తమ రక్తదాత అవార్డు అందుకున్నాడు. తనతో సహా 236 మంది అవయవదానం చేయడానికి కీలకంగా వ్యవహరించాడు. ఓ వైపు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూనే 2 డిగ్రీలు, 7 పీజీలు పూర్తి చేసి ఔరా అనిపిస్తున్నాడు.

'సమయం దొరికినప్పుడల్లా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటాను. నేను 2014 ఎన్నికల్లో 5వేల మంది కొత్త ఓటర్లను చేర్పించి భారత ఎన్నికల కమిషన్‌ నుంచి ఎలక్ట్రోలర్‌ అంబాసిడర్‌ అవార్డు పొందాను. గ్రామీణ యువతకు సాఫ్ట్‌ స్కిల్స్‌, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి మై గవర్నమెంట్‌ పోర్టల్‌కు ఆంబాసిడర్‌గా నియమితమయ్యాను. ఇవేకాక రాష్ట్రపతి అవార్డు, యూత్‌ ఛాంపియన్‌, యూకే నుంచి ప్రిన్సెస్ డయానా, యూఎన్ఓ యూత్ లీడర్, 2024లో కేంద్రం నుంచి అత్యున్నత యువ పురస్కారం వంటి అవార్డులు అందుకోవడం చాలా ఆనందంగా ఉన్నాను.' -భరత్‌, రాష్ట్రపతి అవార్డు గ్రహీత

పంచాయతీ కార్యదర్శి టూ సివిల్స్- 5వ ప్రయత్నంలో 50వ ర్యాంక్​తో విజయం - Vaasanthi Ananthapur success story

సేవా కార్యక్రమాలతో పాటు యువతను చైతన్యపరుస్తున్న భరత్‌ను ఐరాస ఆహ్వానించింది. 2017లో ఇండోనేషియాలో జరిగిన ఐరాస సదస్సులో పాల్గొన్నాడు. యువత పారిశ్రామిక వేత్తలుగా ఎదిగితే ప్రపంచ దేశాలకు ఒనగూరే ప్రయోజనాలు వివరించి ఐరాస ప్రతినిధుల మన్ననలు పొందాడు. అప్పటి నుంచి జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో పాల్గొంటూ ప్రసంగిస్తున్నాడు భరత్‌.

పల్లెటూరి నుంచి ప్రపంచ స్థాయి వేదికల మీద ప్రసంగిస్తున్న భరత్‌ పట్ల కుటుంబ సభ్యులు, అధ్యాపకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భరత్‌ ఏ కాలేజీకి వెళ్లినా విద్యార్థులంతా అతని చుట్టే వాలిపోతారని అంటున్నారు. చదువుతో పాటు సేవా కార్యక్రమాల్లో నిర్వహిస్తున్నందుకు గర్వంగా ఉందని చెబుతన్నారు.

యూఎన్​ఓ నిర్వహిస్తున్న V-4 ప్రాజక్టుకు కో-ఆర్డినేటర్‌గా నియమితులైయ్యారు భరత్‌. దాంతో పాటు కేంద్రం యువతకు నిర్వహిస్తున్నవివిధ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. ఈ 2 బాధ్యతలు విజయవంతంగా నిర్వర్తిస్తూ ఐరాస, కేంద్ర ప్రభుత్వ అధికారుల మన్ననలు పొందుతున్నాడు. భవిష్యత్తులో సివిల్స్‌ సాధించడమే తన లక్ష్యమని చెబుతున్నాడు.

చదువంటే ఉద్యోగమేనా!- వ్యవసాయంలో వెంకటాంపల్లి యువత విజయబావుటా - Young Farmers

Anantapur Man Achieving President's Award With Social Programs : ఉన్నతంగా చదవాలి, ఉద్యోగంలో చేరాలి, ఐదంకెల జీతం తీసుకోవాలనేదే నేటి యువత ఆలోచన. కానీ, అంతటితో జీవితానికి సార్థకత లభించదని భావించాడీ యువకుడు. ఎన్​ఎస్​ఎస్​లో చేరిన అనతికాలంలో ఐక్యరాజ్యసమితి సదసులో పాల్గొని యువత పారిశ్రామికవేత్తలుగా ఎదిగితే ఒనగూరే ప్రయోజానాలు వివరించి అక్కడి ప్రతినిధులచే ప్రశంసలు అందుకున్నాడు.

అనంతపురం జిల్లా కందిగోపుల గ్రామానికి చెందిన వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు భరత్‌. తల్లిదండ్రులు ఆదినారాయణ, శారద చంద్రిక దేవి. పదో తరగతిలో ప్రతిభ కనబరిచి ఉచితంగా ఇంటర్‌ చదివాడు భరత్‌. ఎంసెట్‌లో మంచి ర్యాంకు సాధించి బీటెక్‌లో చేరినా బాల్యం నుంచి సేవా కార్యక్రమాలపై ఉన్న ప్రేమతో డిగ్రీ చేయాలని భావించాడు.

డిగ్రీలో చేరిన తొలినాళ్లలోనే ఎన్​ఎస్​ఎస్​లో చేరిన ఈ యువకుడు అనతి కాలంలోనే అనేక సేవా కార్యక్రమాలకు ప్రాతినిధ్యం వహించాడు. 39సార్లు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి వేలాది యువతను అందులో భాగం చేశాడు. 35సార్లు రక్తదానం చేసి ఇండియన్ రెడ్‌క్రాస్ నుంచి ఉత్తమ రక్తదాత అవార్డు అందుకున్నాడు. తనతో సహా 236 మంది అవయవదానం చేయడానికి కీలకంగా వ్యవహరించాడు. ఓ వైపు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూనే 2 డిగ్రీలు, 7 పీజీలు పూర్తి చేసి ఔరా అనిపిస్తున్నాడు.

'సమయం దొరికినప్పుడల్లా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటాను. నేను 2014 ఎన్నికల్లో 5వేల మంది కొత్త ఓటర్లను చేర్పించి భారత ఎన్నికల కమిషన్‌ నుంచి ఎలక్ట్రోలర్‌ అంబాసిడర్‌ అవార్డు పొందాను. గ్రామీణ యువతకు సాఫ్ట్‌ స్కిల్స్‌, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి మై గవర్నమెంట్‌ పోర్టల్‌కు ఆంబాసిడర్‌గా నియమితమయ్యాను. ఇవేకాక రాష్ట్రపతి అవార్డు, యూత్‌ ఛాంపియన్‌, యూకే నుంచి ప్రిన్సెస్ డయానా, యూఎన్ఓ యూత్ లీడర్, 2024లో కేంద్రం నుంచి అత్యున్నత యువ పురస్కారం వంటి అవార్డులు అందుకోవడం చాలా ఆనందంగా ఉన్నాను.' -భరత్‌, రాష్ట్రపతి అవార్డు గ్రహీత

పంచాయతీ కార్యదర్శి టూ సివిల్స్- 5వ ప్రయత్నంలో 50వ ర్యాంక్​తో విజయం - Vaasanthi Ananthapur success story

సేవా కార్యక్రమాలతో పాటు యువతను చైతన్యపరుస్తున్న భరత్‌ను ఐరాస ఆహ్వానించింది. 2017లో ఇండోనేషియాలో జరిగిన ఐరాస సదస్సులో పాల్గొన్నాడు. యువత పారిశ్రామిక వేత్తలుగా ఎదిగితే ప్రపంచ దేశాలకు ఒనగూరే ప్రయోజనాలు వివరించి ఐరాస ప్రతినిధుల మన్ననలు పొందాడు. అప్పటి నుంచి జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో పాల్గొంటూ ప్రసంగిస్తున్నాడు భరత్‌.

పల్లెటూరి నుంచి ప్రపంచ స్థాయి వేదికల మీద ప్రసంగిస్తున్న భరత్‌ పట్ల కుటుంబ సభ్యులు, అధ్యాపకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భరత్‌ ఏ కాలేజీకి వెళ్లినా విద్యార్థులంతా అతని చుట్టే వాలిపోతారని అంటున్నారు. చదువుతో పాటు సేవా కార్యక్రమాల్లో నిర్వహిస్తున్నందుకు గర్వంగా ఉందని చెబుతన్నారు.

యూఎన్​ఓ నిర్వహిస్తున్న V-4 ప్రాజక్టుకు కో-ఆర్డినేటర్‌గా నియమితులైయ్యారు భరత్‌. దాంతో పాటు కేంద్రం యువతకు నిర్వహిస్తున్నవివిధ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. ఈ 2 బాధ్యతలు విజయవంతంగా నిర్వర్తిస్తూ ఐరాస, కేంద్ర ప్రభుత్వ అధికారుల మన్ననలు పొందుతున్నాడు. భవిష్యత్తులో సివిల్స్‌ సాధించడమే తన లక్ష్యమని చెబుతున్నాడు.

చదువంటే ఉద్యోగమేనా!- వ్యవసాయంలో వెంకటాంపల్లి యువత విజయబావుటా - Young Farmers

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.