ETV Bharat / international

పశ్చిమాసిలో టెన్షన్- మరోసారి రెచ్చిపోయిన హౌతీ రెబల్స్ - బ్రిటన్ నౌకపై దాడి

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 27, 2024, 8:44 AM IST

Updated : Jan 27, 2024, 9:05 AM IST

Houthis Missile Attack On Ship : యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు శుక్రవారం మరోసారి రెచ్చిపోయారు. గల్ఫ్‌ ఆఫ్ ఎడెన్‌లో ఆయిల్​ ట్యాంకులతో వెళుతున్న బ్రిటన్​కు చెందిన నౌకపై క్షిపణితో దాడి చేశారు. మరోవైపు అమెరికా గస్తీ నౌకపై కూడా మిస్సైల్​ దాడి చేశారు.

Houthis Missile Attack On Ship
Houthis Missile Attack On Ship

Houthis Missile Attack On Ship : గల్ఫ్‌ ఆఫ్‌ ఎడెన్‌లో నౌకలపై యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారుల దాడులు కొనసాగుతున్నాయి. శుక్రవారం బ్రిటన్​కు చెందిన ఆయిల్​ ట్యాంకులతో వెళ్తున్న ఓ నౌకపై క్షిపణితో దాడి చేశారు. దీంతో మార్లిన్‌ లాండ నౌకలోని కార్గో ట్యాంకులో మంటలు చెలరేగాయి. దీంతో సిబ్బంది వెంటనే మంటలను అదుపుచేసేందుకు చర్యలు చేపట్టారు. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదని నౌక ఆపరేటర్‌ ట్రాఫిగురా పేర్కొంది.

ఈ ఘటన సౌత్​ ఈస్ట్ ఎడెన్​కు 60 నాటికల్ మైళ్ల దూరంలో జరిగింది. దాడి జరిగిన వెంటనే యుద్ధ నౌకలు ఆ ప్రాంతంలో మోహరించినట్లు యూకే మారిటైమ్‌ ట్రేడ్‌ ఆపరేషన్స్‌ తెలిపింది. అలానే మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని, ఈమార్గంలో వెళుతున్న నౌకలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు హుతీ తిరుగుబాటుదారులు ప్రయోగించిన ఒక క్షిపణిని తమ యుద్ధ నౌకలు కూల్చివేసినట్లు అమెరికా మిలిటరీ తెలిపింది.

అమెరికా గస్తీ నౌకపై దాడి
మరోవైపు గల్ఫ్​ ఆఫ్​ ఏడెన్​లో గస్తీ తిరుగుతున్న అమెరికా యుద్ధనౌక ఈఎస్​ఎస్​ కార్నే పై హౌతీ తిరుగుబాటుదారులు శుక్రవారం క్షిపణిని ప్రయోగించారు. దీన్ని తమ దళాలు కూల్చివేశాయని అమెరికా మిలిటరీ ఓ ప్రకటనతో తెలిపింది. అయితే ఎర్రసముద్రంలో రవాణా నౌకలపై హౌతీ దాడులకు దిగినప్పటినుంచి, అమెరికా నౌకను డైరెక్ట్​గా టార్గెట్​ చేయడం ఇదే తొలిసారి.

చైనా వార్నింగ్!
గాజాపై ఇజ్రాయెల్‌ దాడుల తర్వాత ఎర్ర సముద్రంలో ఒక్కసారిగా ఉద్రిక్తతలు పెరిగాయి. గాజాకు మద్దతుగా ఇజ్రాయెల్‌ సహా పశ్చిమదేశాలకు చెందిన నౌకలపై హౌతీ రెబెల్స్‌ ఎర్ర సముద్రం, గల్ఫ్‌ ఆఫ్‌ ఎడెన్‌లో దాడులకు పాల్పడుతున్నారు. ఆ మార్గంలో విదేశీ వాణిజ్య నౌకలు ప్రయాణించడానికి భయపడుతున్నాయి. చుట్టూ తిరిగి వెళ్లడం వల్ల ప్రయాణ ఖర్చు భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో అమెరికా, బ్రిటన్‌, యెమెన్‌లోని హౌతీ రెబెల్స్‌ స్థావరాలపై వైమానిక దాడులు నిర్వహిస్తున్నాయి. ఈ జాబితాలోకి పరోక్షంగా చైనా చేరింది. యెమెన్‌లోని హౌతీలతో పాటు పలు మిలింటెంట్ గ్రూప్‌లను ప్రోత్సహిస్తున్న ఇరాన్‌ను చైనా హెచ్చరించినట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. నౌకలపై దాడులు ఆపకపోతే ఇరాన్‌తో వ్యాపార సంబంధాలు తెంచుకునేందుకు డ్రాగన్ సిద్ధపడినట్టు తెలుస్తోంది. పూర్తి కథనం కోసం ఈ లింక్​పై క్లిక్ చేయండి.

వెనక్కి తగ్గని హౌతీలు- అమెరికా నౌకపైకి క్షిపణి ప్రయోగం- ఇరాన్ బాంబుల వర్షం!

హౌతీ రెబల్స్​ స్థావరాలపై అమెరికా బాంబుల వర్షం- ఐదుగురు మృతి

Houthis Missile Attack On Ship : గల్ఫ్‌ ఆఫ్‌ ఎడెన్‌లో నౌకలపై యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారుల దాడులు కొనసాగుతున్నాయి. శుక్రవారం బ్రిటన్​కు చెందిన ఆయిల్​ ట్యాంకులతో వెళ్తున్న ఓ నౌకపై క్షిపణితో దాడి చేశారు. దీంతో మార్లిన్‌ లాండ నౌకలోని కార్గో ట్యాంకులో మంటలు చెలరేగాయి. దీంతో సిబ్బంది వెంటనే మంటలను అదుపుచేసేందుకు చర్యలు చేపట్టారు. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదని నౌక ఆపరేటర్‌ ట్రాఫిగురా పేర్కొంది.

ఈ ఘటన సౌత్​ ఈస్ట్ ఎడెన్​కు 60 నాటికల్ మైళ్ల దూరంలో జరిగింది. దాడి జరిగిన వెంటనే యుద్ధ నౌకలు ఆ ప్రాంతంలో మోహరించినట్లు యూకే మారిటైమ్‌ ట్రేడ్‌ ఆపరేషన్స్‌ తెలిపింది. అలానే మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని, ఈమార్గంలో వెళుతున్న నౌకలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు హుతీ తిరుగుబాటుదారులు ప్రయోగించిన ఒక క్షిపణిని తమ యుద్ధ నౌకలు కూల్చివేసినట్లు అమెరికా మిలిటరీ తెలిపింది.

అమెరికా గస్తీ నౌకపై దాడి
మరోవైపు గల్ఫ్​ ఆఫ్​ ఏడెన్​లో గస్తీ తిరుగుతున్న అమెరికా యుద్ధనౌక ఈఎస్​ఎస్​ కార్నే పై హౌతీ తిరుగుబాటుదారులు శుక్రవారం క్షిపణిని ప్రయోగించారు. దీన్ని తమ దళాలు కూల్చివేశాయని అమెరికా మిలిటరీ ఓ ప్రకటనతో తెలిపింది. అయితే ఎర్రసముద్రంలో రవాణా నౌకలపై హౌతీ దాడులకు దిగినప్పటినుంచి, అమెరికా నౌకను డైరెక్ట్​గా టార్గెట్​ చేయడం ఇదే తొలిసారి.

చైనా వార్నింగ్!
గాజాపై ఇజ్రాయెల్‌ దాడుల తర్వాత ఎర్ర సముద్రంలో ఒక్కసారిగా ఉద్రిక్తతలు పెరిగాయి. గాజాకు మద్దతుగా ఇజ్రాయెల్‌ సహా పశ్చిమదేశాలకు చెందిన నౌకలపై హౌతీ రెబెల్స్‌ ఎర్ర సముద్రం, గల్ఫ్‌ ఆఫ్‌ ఎడెన్‌లో దాడులకు పాల్పడుతున్నారు. ఆ మార్గంలో విదేశీ వాణిజ్య నౌకలు ప్రయాణించడానికి భయపడుతున్నాయి. చుట్టూ తిరిగి వెళ్లడం వల్ల ప్రయాణ ఖర్చు భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో అమెరికా, బ్రిటన్‌, యెమెన్‌లోని హౌతీ రెబెల్స్‌ స్థావరాలపై వైమానిక దాడులు నిర్వహిస్తున్నాయి. ఈ జాబితాలోకి పరోక్షంగా చైనా చేరింది. యెమెన్‌లోని హౌతీలతో పాటు పలు మిలింటెంట్ గ్రూప్‌లను ప్రోత్సహిస్తున్న ఇరాన్‌ను చైనా హెచ్చరించినట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. నౌకలపై దాడులు ఆపకపోతే ఇరాన్‌తో వ్యాపార సంబంధాలు తెంచుకునేందుకు డ్రాగన్ సిద్ధపడినట్టు తెలుస్తోంది. పూర్తి కథనం కోసం ఈ లింక్​పై క్లిక్ చేయండి.

వెనక్కి తగ్గని హౌతీలు- అమెరికా నౌకపైకి క్షిపణి ప్రయోగం- ఇరాన్ బాంబుల వర్షం!

హౌతీ రెబల్స్​ స్థావరాలపై అమెరికా బాంబుల వర్షం- ఐదుగురు మృతి

Last Updated : Jan 27, 2024, 9:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.