ETV Bharat / bharat

ATMల నుంచి రూ.60లక్షలు చోరీ! పోలీసుల సినిమాటిక్ ఛేజ్- ఎన్​కౌంటర్​లో నిందితుడు మృతి!! - Tamilnadu Police Chase ATM Heist

author img

By ETV Bharat Telugu Team

Published : 2 hours ago

Updated : 1 hours ago

Tamilnadu Police Chase ATM Heist : కంటైనర్​ లారీలో పారిపోతున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను తమిళనాడు పోలీసులు సినీ ఫక్కీలో ఛేజ్​ చేశారు. అనంతరం కాల్పులకు దిగిన గ్యాంగ్​పైకి ఎదురు కాల్పులు జరిపారు. దీంతో ఓ నిందితుడు మృతి చెందాడు.

Tamilnadu Police Chase ATM Heist
Tamilnadu Police Chase ATM Heist (ETV Bharat)

Tamilnadu Police Chase ATM Heist : అంతరాష్ట్ర దొంగల ముఠాకు చెందిన ఓ కంటైనర్ లారీని తమిళనాడు పోలీసులు సినీ ఫక్కీలో​ ఛేజ్​ చేశారు. ఈ క్రమంలో పారిపోతున్న ఆ గ్యాంగ్​లోని ఓ వ్యక్తిపై కాల్పులు జరిపినట్లు ఓ పోలీసు అధికారి తెలిపారు. ఈ ఘటనలో ఆ వ్యక్తి చనిపోయినట్లు వెల్లడించారు.

సినిమాటిక్ ఛేజ్​
కేరళ త్రిస్సూర్​లోని షొర్నూర్​ రోడ్​, కోలాజీ, మప్రాణంలోని ఎస్​బీఐ ఏటీఎంలలో చోరీలు జరిగాయి. దాదాపు రూ.60 లక్షల వరకు నగదు దొంగలు ఎత్తుకెళ్లిపోయారు. ఈ చోరీకి పాల్పడిన దొంగలుగా భావిస్తున్న కొందరు ఓ కంటైనర్​ లారీలో పారిపోతున్నట్లు తమిళనాడులోని నమక్కల్​ జిల్లా పోలీసులకు సమాచారం అందింది. వెంటనే స్పందించిన పోలీసులు, ఆ కంటైనర్​ను ఛేజ్​ చేశారు. మొదటగా డ్రైవర్​కు లారీని ఆపాలని చెప్పారు. కానీ అతడు పట్టించుకోకుండా వేగంగా వెళ్లాడు.

అనంతరం లారీని అడ్డగించిన పోలీసులపైకి, దొంగల ముఠా కాల్పులు జరిపింది. ఈ క్రమంలో తప్పించుకోవడానికి ప్రయత్నించిన ఓ నిందితుడిపై పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. దీంతో అతడు మృతి చెందాడు. మరో ఆరుగురిలో కొంతమందికి బుల్లెట్​ గాయాలయ్యాయి. కాగా, ఈ ఆపరేషన్​లో గాయపడిన పోలీసు అధికారులు ఇన్​స్పెక్టర్​ తవమణి, ఎస్​ఐ రంజిత్​ను ఆస్పత్రికి తరలించారు. లారీలో దాచిన ఓ కారును కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ దొంగల ముఠా రాజస్థాన్​, హరయాణాకు చెందినదిగా పోలీసుల భావిస్తున్నారు.

హైవేపై ఫాస్ట్​ అండ్ ఫ్యూరియస్!
గతేడాది దిల్లీ-మంబయి ఎక్స్​ప్రెస్​వేపై సినీ ఫక్కీలో లారీని ఛేజ్ చేశారు టాస్క్​ఫోర్స్​ పోలీసులు. 32 ఆవులను అక్రమంగా తరలిస్తున్న లారీని 20 కిలోమీటర్లు వెంబడించారు. అనంతరం ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకన్నారు. ఈ ఘటన హరియాణాలోని గురుగ్రామ్​ జిల్లాలో జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గురుగ్రామ్​లో జిల్లాలో దిల్లీ-ముంబయి ఎక్స్​ప్రెస్​వేపై ఆవులను స్మగ్లింగ్​ చేస్తున్న లారీని గుర్తించి, గో రక్షక దళం పోలీసులకు సమాచారం అందించింది. రంగంలోకి దిగిన టాస్క్​ఫోర్స్​ పోలీసులు లారీని వెంబడించారు. పోలీసులను చూసి అప్రమత్తమైన స్మగ్లర్లు వేగం పెంచారు. ఘమ్​డోజ్​ టోల్​ప్లాజా వద్ద బ్యారియర్​ను ఢీకొట్టి ఆగకుండా లారీని పరిగెత్తించారు. కారులో లారీని వెంబడిస్తున్న టాస్క్​ఫోర్స్​ పోలీసులు రోడ్డుపై మేకులు చల్లారు. దీంతో లారీ ముందు టైరు ఒకటి పంక్చర్ అయింది. కొద్ది సేపటి తర్వాత రిమ్​ నుంచి టైరు విడిపోయింది. అయినా రిమ్​పై లారీ దూసుకెళ్లింది. హైవేపై 20 కిలోమీటర్లు ఛేజ్ చేసిన పోలీసులు బోంద్సీ ప్రాంతంలో లారీని అడ్డుకున్నారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. లారీలో ఉన్న 32 ఆవులను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్​ఫోర్స్​ పోలీసుల సూపర్​ ఛేజింగ్​ సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. ఆ వీడియో చాడాలంటే ఈ లింక్​పై క్లిక్ చేయండి.

Tamilnadu Police Chase ATM Heist : అంతరాష్ట్ర దొంగల ముఠాకు చెందిన ఓ కంటైనర్ లారీని తమిళనాడు పోలీసులు సినీ ఫక్కీలో​ ఛేజ్​ చేశారు. ఈ క్రమంలో పారిపోతున్న ఆ గ్యాంగ్​లోని ఓ వ్యక్తిపై కాల్పులు జరిపినట్లు ఓ పోలీసు అధికారి తెలిపారు. ఈ ఘటనలో ఆ వ్యక్తి చనిపోయినట్లు వెల్లడించారు.

సినిమాటిక్ ఛేజ్​
కేరళ త్రిస్సూర్​లోని షొర్నూర్​ రోడ్​, కోలాజీ, మప్రాణంలోని ఎస్​బీఐ ఏటీఎంలలో చోరీలు జరిగాయి. దాదాపు రూ.60 లక్షల వరకు నగదు దొంగలు ఎత్తుకెళ్లిపోయారు. ఈ చోరీకి పాల్పడిన దొంగలుగా భావిస్తున్న కొందరు ఓ కంటైనర్​ లారీలో పారిపోతున్నట్లు తమిళనాడులోని నమక్కల్​ జిల్లా పోలీసులకు సమాచారం అందింది. వెంటనే స్పందించిన పోలీసులు, ఆ కంటైనర్​ను ఛేజ్​ చేశారు. మొదటగా డ్రైవర్​కు లారీని ఆపాలని చెప్పారు. కానీ అతడు పట్టించుకోకుండా వేగంగా వెళ్లాడు.

అనంతరం లారీని అడ్డగించిన పోలీసులపైకి, దొంగల ముఠా కాల్పులు జరిపింది. ఈ క్రమంలో తప్పించుకోవడానికి ప్రయత్నించిన ఓ నిందితుడిపై పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. దీంతో అతడు మృతి చెందాడు. మరో ఆరుగురిలో కొంతమందికి బుల్లెట్​ గాయాలయ్యాయి. కాగా, ఈ ఆపరేషన్​లో గాయపడిన పోలీసు అధికారులు ఇన్​స్పెక్టర్​ తవమణి, ఎస్​ఐ రంజిత్​ను ఆస్పత్రికి తరలించారు. లారీలో దాచిన ఓ కారును కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ దొంగల ముఠా రాజస్థాన్​, హరయాణాకు చెందినదిగా పోలీసుల భావిస్తున్నారు.

హైవేపై ఫాస్ట్​ అండ్ ఫ్యూరియస్!
గతేడాది దిల్లీ-మంబయి ఎక్స్​ప్రెస్​వేపై సినీ ఫక్కీలో లారీని ఛేజ్ చేశారు టాస్క్​ఫోర్స్​ పోలీసులు. 32 ఆవులను అక్రమంగా తరలిస్తున్న లారీని 20 కిలోమీటర్లు వెంబడించారు. అనంతరం ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకన్నారు. ఈ ఘటన హరియాణాలోని గురుగ్రామ్​ జిల్లాలో జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గురుగ్రామ్​లో జిల్లాలో దిల్లీ-ముంబయి ఎక్స్​ప్రెస్​వేపై ఆవులను స్మగ్లింగ్​ చేస్తున్న లారీని గుర్తించి, గో రక్షక దళం పోలీసులకు సమాచారం అందించింది. రంగంలోకి దిగిన టాస్క్​ఫోర్స్​ పోలీసులు లారీని వెంబడించారు. పోలీసులను చూసి అప్రమత్తమైన స్మగ్లర్లు వేగం పెంచారు. ఘమ్​డోజ్​ టోల్​ప్లాజా వద్ద బ్యారియర్​ను ఢీకొట్టి ఆగకుండా లారీని పరిగెత్తించారు. కారులో లారీని వెంబడిస్తున్న టాస్క్​ఫోర్స్​ పోలీసులు రోడ్డుపై మేకులు చల్లారు. దీంతో లారీ ముందు టైరు ఒకటి పంక్చర్ అయింది. కొద్ది సేపటి తర్వాత రిమ్​ నుంచి టైరు విడిపోయింది. అయినా రిమ్​పై లారీ దూసుకెళ్లింది. హైవేపై 20 కిలోమీటర్లు ఛేజ్ చేసిన పోలీసులు బోంద్సీ ప్రాంతంలో లారీని అడ్డుకున్నారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. లారీలో ఉన్న 32 ఆవులను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్​ఫోర్స్​ పోలీసుల సూపర్​ ఛేజింగ్​ సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. ఆ వీడియో చాడాలంటే ఈ లింక్​పై క్లిక్ చేయండి.

Last Updated : 1 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.