Hathras Stampede Incident : ఉత్తర్ప్రదేశ్ హాథ్రస్ తొక్కిసలాట మృతుల సంఖ్య 121కు చేరుకుంది. మరో 28 మంది క్షతగాత్రలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు, హాథ్రాస్లో సత్సంగ్ నిర్వహించినవారిపై పోలీసులు ఎఫ్ఐఐర్ నమోదు చేశారు. సత్సంగ్ ముఖ్య నిర్వహకుడు దేవ ప్రకాశ్ మధుకర్, సికందరరావు తదితరులపై కేసు నమోదైంది.
పరారీలో 'భోలే బాబా'
హాథ్రస్లో సత్సంగ్ నిర్వహించిన మత బోధకుడు నారాయణ్ సాకర్ హరి అలియాస్ 'భోలే బాబా'ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం భోలే బాబా పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. మెయిన్పురిలో భోలే బాబాకు చెందిన రామ్ కుటీర్ ఛారిటబుల్ ట్రస్ట్లో సోదాలు నిర్వహించగా అక్కడా ఆయన కనిపించలేదని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సునీల్ కుమార్ తెలిపారు.
#WATCH | Uttar Pradesh: Visuals from Ram Kutir Charitable Trust in Mainpuri district.
— ANI (@ANI) July 3, 2024
A search operation was underway for 'Bhole Baba', who conducted a Satsang in Hathras where a stampede took place yesterday claiming the lives of 116 people. pic.twitter.com/6J2tAHyxrF
సుప్రీం కోర్టులో పిటిషన్
హాథ్రస్ ఘటనపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. గతంలో జరిగిన తొక్కిసలాట ఘటనల నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి గుణపాఠాలు నేర్చుకోలేదని, దీనిపై కఠిన మార్గదర్శకాలు జారీ చేయాలని పిటిషనర్ అభ్యర్థించారు. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో ఐదుగురు నిపుణులతో కమిటీని ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని పిటిషన్లో పేర్కొన్నారు. అటు ఘటనపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని అలహాబాద్ హైకోర్టులో మరో వ్యాజ్యం దాఖలైంది.
UP-Hathras stampede | Advocate Gaurav Dwivedi files a Public Interest Litigation (PIL) in the Allahabad High Court demanding a CBI inquiry into the Hathras Stampede accident pic.twitter.com/UtsF4fqnDe
— ANI (@ANI) July 3, 2024