ETV Bharat / bharat

పొట్టకూటి కోసం వలస వచ్చిన అత్తా కోడలిపై గ్యాంగ్​ రేప్

శ్రీ సత్యసాయి జిల్లాలో అత్తాకోడలిపై సామూహిక అత్యాచారం - కత్తులతో బెదిరించి అత్యాచారానికి పాల్పడిన నలుగురు దుండగులు.

author img

By ETV Bharat Telugu Team

Published : 3 hours ago

Updated : 8 minutes ago

four-persons-gang-rape
four-persons-gang-rape (ETV Bharat)

Four Persons Gang Rape of Mother in law and Daughter in Law : పండుగ వేళ శ్రీ సత్యసాయి జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. పొట్టకూటి కోసం వేరే రాష్ట్రం నుంచి వలస వచ్చిన అత్తాకోడలిని కత్తులతో బెదిరించి నలుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఉపాధి కోసం ఓ కుంటుంబం ఐదు నెలల క్రితం కర్ణాటక రాష్ట్రం బళ్లారి నుంచి వచ్చి శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఓ పేపర్ మిల్లులో వాచ్మెన్​గా పనిచేస్తున్నారు. ఎప్పటిలాగే విధులు ముంగించుకొని నిన్న(శుక్రవారం)రాత్రి నిద్రకు ఉపక్రమించారు.

కత్తులతో బెదిరించి అత్యాచారం : ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి మూడు గంటల సమయంలో నలుగురు దుండగులు రెండు బైక్​లపై వచ్చి పేపర్ మిల్లు ఉన్న ప్రాంతంలో తిరుగుతున్నారు. అనుమానం వచ్చిన ఇంట్లో పెద్దాయన బయటకు వచ్చి టార్చ్ లైట్ వేసి అక్కడ ఉన్న నలుగురిని ప్రశ్నించారు. ఇక్కడ ఎందుకు తీరుగుతున్నారని నిలదీశారు. దీంతో దుండగుల్లో ఒకరు పెద్దాయనపై దడిచేశాడు. వెంటలో లోపల ఉన్న కుమారుడు బయటకు వచ్చి ఆపే ప్రయత్నం చేయగా వెంటనే మిగతా ముగ్గురు నిందితులు వచ్చి దాడికి పాల్పడ్డారు. అనంతరం ఇంటి లోపల ఇద్దరు మహిళలు ఉన్నారని గుర్తించిన నలుగురు దుండగులు వెంటనే గదిలోకి చొరబడి ఆ మహిళలను కత్తులతో బెదిరించి అత్యాచారానికి ఒడిగట్టారు. అనంతరం ఆ దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు.

బాపట్ల జిల్లాలో ప్రేమోన్మాది అఘాయిత్యం - అర్ధరాత్రి యువతి ఇంటికెళ్లి చాకుతో దాడి

ఎస్పీతో మాట్లాడిన బాలకృష్ణ : ఈ ఘటనపై బాధితులు చిలమత్తూరు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. ద్విచక్ర వాహనాలపై వచ్చి మూకుమ్మడిగా లైంగిక దాడికి పాల్పడ్డ నిందితులను గుర్తించేందుకు పోలీసులు ముమ్మర గాలింపు చేపట్టారు. అత్యాచారానికి పాల్పడిన వారిని వెంటనే పట్టుకుంటామని హామీ ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించి హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అత్యాచారానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు.

నిందితులను కఠినంగా శిక్షించాలి : ఈ ఘటనపై మంత్రి సవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించారు. ఉపాధి కోసం వచ్చిన కుటుంబ సభ్యులను బంధించి అత్తాకోడలిపై అఘాయిత్యానికి పాల్పడి క్షమించరాని నేరం చేశారని తెలిపారు. పండగ వేళ ఇటువంటి ఘటన చోటు చేసుకోవడం బాధాకరమని పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని సవిత హామీ ఇచ్చారు.

'వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించలేం'- సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్‌ - Marital Rape Case

అత్యాచారం జరిగిందనడానికి సాక్ష్యమేంటి? - నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్‌ సతీమణి - Jani Master Wife Comments

Four Persons Gang Rape of Mother in law and Daughter in Law : పండుగ వేళ శ్రీ సత్యసాయి జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. పొట్టకూటి కోసం వేరే రాష్ట్రం నుంచి వలస వచ్చిన అత్తాకోడలిని కత్తులతో బెదిరించి నలుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఉపాధి కోసం ఓ కుంటుంబం ఐదు నెలల క్రితం కర్ణాటక రాష్ట్రం బళ్లారి నుంచి వచ్చి శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఓ పేపర్ మిల్లులో వాచ్మెన్​గా పనిచేస్తున్నారు. ఎప్పటిలాగే విధులు ముంగించుకొని నిన్న(శుక్రవారం)రాత్రి నిద్రకు ఉపక్రమించారు.

కత్తులతో బెదిరించి అత్యాచారం : ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి మూడు గంటల సమయంలో నలుగురు దుండగులు రెండు బైక్​లపై వచ్చి పేపర్ మిల్లు ఉన్న ప్రాంతంలో తిరుగుతున్నారు. అనుమానం వచ్చిన ఇంట్లో పెద్దాయన బయటకు వచ్చి టార్చ్ లైట్ వేసి అక్కడ ఉన్న నలుగురిని ప్రశ్నించారు. ఇక్కడ ఎందుకు తీరుగుతున్నారని నిలదీశారు. దీంతో దుండగుల్లో ఒకరు పెద్దాయనపై దడిచేశాడు. వెంటలో లోపల ఉన్న కుమారుడు బయటకు వచ్చి ఆపే ప్రయత్నం చేయగా వెంటనే మిగతా ముగ్గురు నిందితులు వచ్చి దాడికి పాల్పడ్డారు. అనంతరం ఇంటి లోపల ఇద్దరు మహిళలు ఉన్నారని గుర్తించిన నలుగురు దుండగులు వెంటనే గదిలోకి చొరబడి ఆ మహిళలను కత్తులతో బెదిరించి అత్యాచారానికి ఒడిగట్టారు. అనంతరం ఆ దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు.

బాపట్ల జిల్లాలో ప్రేమోన్మాది అఘాయిత్యం - అర్ధరాత్రి యువతి ఇంటికెళ్లి చాకుతో దాడి

ఎస్పీతో మాట్లాడిన బాలకృష్ణ : ఈ ఘటనపై బాధితులు చిలమత్తూరు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. ద్విచక్ర వాహనాలపై వచ్చి మూకుమ్మడిగా లైంగిక దాడికి పాల్పడ్డ నిందితులను గుర్తించేందుకు పోలీసులు ముమ్మర గాలింపు చేపట్టారు. అత్యాచారానికి పాల్పడిన వారిని వెంటనే పట్టుకుంటామని హామీ ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించి హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అత్యాచారానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు.

నిందితులను కఠినంగా శిక్షించాలి : ఈ ఘటనపై మంత్రి సవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించారు. ఉపాధి కోసం వచ్చిన కుటుంబ సభ్యులను బంధించి అత్తాకోడలిపై అఘాయిత్యానికి పాల్పడి క్షమించరాని నేరం చేశారని తెలిపారు. పండగ వేళ ఇటువంటి ఘటన చోటు చేసుకోవడం బాధాకరమని పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని సవిత హామీ ఇచ్చారు.

'వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించలేం'- సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్‌ - Marital Rape Case

అత్యాచారం జరిగిందనడానికి సాక్ష్యమేంటి? - నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్‌ సతీమణి - Jani Master Wife Comments

Last Updated : 8 minutes ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.