ETV Bharat / bharat

క్షీణించిన దిల్లీ​ మంత్రి ఆతిశీ ఆరోగ్యం- ఆస్పత్రిలో చేర్చిన ఆప్ నేతలు - Delhi Water Crisis

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 25, 2024, 7:35 AM IST

Updated : Jun 25, 2024, 8:18 AM IST

Atishi Health Condition : దిల్లీకి హరియాణా నుంచి నీటిని విడుదల చేయాలని కోరుతూ నిరాహార దీక్ష చేపట్టిన ఆప్ మంత్రి ఆతిశీ ఆరోగ్యం క్షీణించింది. మంగళవారం తెల్లవారుజూమున ఆమెను ఆప్​ నేతలు ఆస్పత్రికి తరలించారు.

Atishi Hunger Strike
Atishi Hunger Strike (ANI)

Atishi Health Condition : దిల్లీకి హరియాణా నుంచి నీటిని విడుదల చేయాలని కోరుతూ నిరాహార దీక్ష చేపట్టిన ఆప్ మంత్రి ఆతిశీ ఆరోగ్యం క్షీణించింది. దీంతో మంగళవారం తెల్లవారుజామున ఆతిశీని లోక్​నాయక్ జై ప్రకాశ్ ఆస్పత్రికి తరలించారు ఆప్​ నేతలు. షుగర్​ లెవెల్స్ పడిపోవడం వల్లే ఆరోగ్యం ఆతిశీని ఆస్పత్రికి తరలించినట్లు దిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ అన్నారు.

'సోమవారం రాత్రే ఆతిశీ ఘగర్​ లేవల్స్ తగ్గిపోయాయి. రక్త నమూనాలను ఆస్పత్రికి పంపించినప్పుడు షుగర్ లేవల్స్ 36కి పడిపోయాయి అని వైద్యులు చెప్పారు. వెంటనే వైద్యుల వద్దకు తీసుకెళ్లాం. ప్రస్తుతం ఆతిశీకి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. రిపోర్ట్​ వచ్చాకే ఏమైనా చెబుతాం' అని సౌరభ్ భరద్వాజ్ పేర్కొన్నారు.

'వెంటనే ఆస్పత్రిలో చేర్పించాలి'
బ్లడ్​ శాంపిల్స్​ను ఆస్పత్రి పంపించినప్పుడు ఆతిశీని వెంటనే ఆస్పత్రిలో చేర్పించాలని వైద్యులు సూచించినట్లు ఆప్​ ఎంపీ సంజయ్ సింగ్ అన్నారు. 'దిల్లీ ప్రజలకు నీరు అందించడం కోసం గత 5 రోజులుగా నిరహార దీక్ష చేస్తున్నారు. ఏమీ తినకపోవడం వల్ల మరింత ఆరోగ్యం క్షీణించింది. ఆతిశీ రక్తనమూనాలకు ఆస్పత్రికి పంపించాం. ఆతిశీకి రక్తపోటు, చక్కెర స్థాయిలు తగ్గుతున్నాయని వైద్యులు నిర్ధరించారు. శరీరంలో కీటోన్‌ స్థాయి పెరిగిందనీ, బరువు కూడా తగ్గినట్లు తెలుస్తోందని అన్నారు. వెంటనే ఆస్పత్రిలో చేర్చించకపోతే ఆమె పరిస్థితి మరింత విషమించే అవకాశం ఉందని అన్నారు. అందకే ఆస్పత్రికి తీసుకెళ్లాం' అని సంజయ్ తెలిపారు.

దిల్లీకి హరియాణా నుంచి నీటిని విడుదల చేయాలని జూన్​ 21 నుంచి ఆతిశీ నిరాహార దీక్ష చేపట్టారు. దిల్లీకి అందాల్సిన నీటి కంటే 100 ఎమ్​జీడీ (రోజుకు మిలియన్‌ గ్యాలన్లు) తక్కువగా హరియాణా ప్రభుత్వం విడుదల చేస్తోందని ఆతిశీ తెలిపారు. దీంతో దాదాపు 28 లక్షల మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆతిశీ అన్నారు. మరోవైపు హరియాణా సీఎం నయాబ్ సింగ్ సైనీని కలిసి తమ సమస్యను పరిష్కరించాలని కోరామని, ఆయన సానుకూలంగా స్పందించినట్లు దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా వెల్లడించారు.

లోక్​సభ స్పీకర్​ ఎన్నికపై ఉత్కంఠ- ఓం బిర్లాకే మరోసారి ఛాన్స్​! వారితో బీజేపీ సంప్రదింపులు

రాజ్యసభా పక్షనేతగా జేపీ నడ్డా- మొత్తం మూడు కీలక బాధ్యతలు!

Atishi Health Condition : దిల్లీకి హరియాణా నుంచి నీటిని విడుదల చేయాలని కోరుతూ నిరాహార దీక్ష చేపట్టిన ఆప్ మంత్రి ఆతిశీ ఆరోగ్యం క్షీణించింది. దీంతో మంగళవారం తెల్లవారుజామున ఆతిశీని లోక్​నాయక్ జై ప్రకాశ్ ఆస్పత్రికి తరలించారు ఆప్​ నేతలు. షుగర్​ లెవెల్స్ పడిపోవడం వల్లే ఆరోగ్యం ఆతిశీని ఆస్పత్రికి తరలించినట్లు దిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ అన్నారు.

'సోమవారం రాత్రే ఆతిశీ ఘగర్​ లేవల్స్ తగ్గిపోయాయి. రక్త నమూనాలను ఆస్పత్రికి పంపించినప్పుడు షుగర్ లేవల్స్ 36కి పడిపోయాయి అని వైద్యులు చెప్పారు. వెంటనే వైద్యుల వద్దకు తీసుకెళ్లాం. ప్రస్తుతం ఆతిశీకి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. రిపోర్ట్​ వచ్చాకే ఏమైనా చెబుతాం' అని సౌరభ్ భరద్వాజ్ పేర్కొన్నారు.

'వెంటనే ఆస్పత్రిలో చేర్పించాలి'
బ్లడ్​ శాంపిల్స్​ను ఆస్పత్రి పంపించినప్పుడు ఆతిశీని వెంటనే ఆస్పత్రిలో చేర్పించాలని వైద్యులు సూచించినట్లు ఆప్​ ఎంపీ సంజయ్ సింగ్ అన్నారు. 'దిల్లీ ప్రజలకు నీరు అందించడం కోసం గత 5 రోజులుగా నిరహార దీక్ష చేస్తున్నారు. ఏమీ తినకపోవడం వల్ల మరింత ఆరోగ్యం క్షీణించింది. ఆతిశీ రక్తనమూనాలకు ఆస్పత్రికి పంపించాం. ఆతిశీకి రక్తపోటు, చక్కెర స్థాయిలు తగ్గుతున్నాయని వైద్యులు నిర్ధరించారు. శరీరంలో కీటోన్‌ స్థాయి పెరిగిందనీ, బరువు కూడా తగ్గినట్లు తెలుస్తోందని అన్నారు. వెంటనే ఆస్పత్రిలో చేర్చించకపోతే ఆమె పరిస్థితి మరింత విషమించే అవకాశం ఉందని అన్నారు. అందకే ఆస్పత్రికి తీసుకెళ్లాం' అని సంజయ్ తెలిపారు.

దిల్లీకి హరియాణా నుంచి నీటిని విడుదల చేయాలని జూన్​ 21 నుంచి ఆతిశీ నిరాహార దీక్ష చేపట్టారు. దిల్లీకి అందాల్సిన నీటి కంటే 100 ఎమ్​జీడీ (రోజుకు మిలియన్‌ గ్యాలన్లు) తక్కువగా హరియాణా ప్రభుత్వం విడుదల చేస్తోందని ఆతిశీ తెలిపారు. దీంతో దాదాపు 28 లక్షల మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆతిశీ అన్నారు. మరోవైపు హరియాణా సీఎం నయాబ్ సింగ్ సైనీని కలిసి తమ సమస్యను పరిష్కరించాలని కోరామని, ఆయన సానుకూలంగా స్పందించినట్లు దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా వెల్లడించారు.

లోక్​సభ స్పీకర్​ ఎన్నికపై ఉత్కంఠ- ఓం బిర్లాకే మరోసారి ఛాన్స్​! వారితో బీజేపీ సంప్రదింపులు

రాజ్యసభా పక్షనేతగా జేపీ నడ్డా- మొత్తం మూడు కీలక బాధ్యతలు!

Last Updated : Jun 25, 2024, 8:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.