తెలంగాణ

telangana

ETV Bharat / videos

'కేసీఆర్... నిన్ను నాయినా అని పిలవనా'

By

Published : Apr 16, 2020, 3:54 PM IST

Updated : Apr 16, 2020, 5:17 PM IST

తెలంగాణ రాష్ట్రానికి దేవుడు ఇచ్చిన బహుమానం కేసీఆర్ అని ప్రముఖ నటుడు ఉత్తేజ్ అభివర్ణించారు. కరోనా కష్టకాలంలో ముఖ్యమంత్రి చెబుతోన్న మాటలు ప్రజల్లో కొండంత ధైర్యాన్ని నింపుతున్నాయని పేర్కొన్నారు. కేసీఆర్ మాటల స్ఫూర్తితో ముఖ్యమంత్రిపై "కేసీఆర్... నిన్ను నాయినా అని పిలవనా" అంటూ కవిత రాసిన ఉత్తేజ్... గోవర్ధనగిరినెత్తి గోకులాన్ని కాపాడిన శ్రీకృష్ణుడి తరహాలో భుజం కాసి ప్రజలను కాపాడుతున్నారని కొనియాడారు. తెలంగాణ యాసలో తన కవితను వినిపిస్తూ ఉత్తేజ్ ప్రత్యేక వీడియో విడుదల చేశారు.
Last Updated : Apr 16, 2020, 5:17 PM IST

ABOUT THE AUTHOR

...view details