తెలంగాణ

telangana

Atiq and Ashraf murder case Prayagraj

By

Published : Apr 20, 2023, 6:34 PM IST

ETV Bharat / videos

అతీక్ అహ్మద్ హత్య క్రైమ్​ సీన్​ రీక్రియేషన్.. కీలక విషయాలు వెల్లడి!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గ్యాంగ్​స్టర్​ అతీక్ అహ్మద్​, అతడి సోదరుడు అష్రఫ్​ అహ్మద్​​ హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. అందులో భాగంగా గురువారం ప్రయాగ్​రాజ్​లో భారీ భద్రత మధ్య క్రైమ్​ సీన్​ రీ కన్​స్ట్రక్షన్​ చేసింది సిట్​ బృందం. మరోవైపు, ఉత్తర్​ప్రదేశ్​ పభుత్వం ఏర్పాటు చేసిన జుడీషియల్​ కమిటీ కూడా ప్రయాగ్​రాజ్​ను సందర్శించింది.
ఈ కేసులో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. హత్యకు ముందు రోజు నిందితులు జర్నలిస్టుల లాగా ట్రైనింగ్​ తీసుకున్నారని పోలీసులు తెలిపారు. హంతకులకు సహకరించిన ముగ్గురుని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.  

అతీక్​ను ఏప్రిల్ 14న ప్రయాగ్​రాజ్​ కోర్టులో హాజరు పరిచేటప్పుడే చంపాలనుకున్నారు నిందితులు. కానీ కోర్టు వద్ద భారీ భద్రత ఉండటం వల్ల ప్లాన్​ వాయిదా వేశారు. ఆ తర్వాత ఆస్పత్రి వద్ద భద్రత తక్కువగా ఉండటం వల్ల.. హత్య చేయడానికి వీలు కలిగింది. అయితే, హత్యకు ముందు రోజు నిందితులు ఘటనా స్థలానికి 1.5 కిలో మీటర్ల దూరం ఉన్న హోటల్​లో​ బస చేసి.. రెక్కీ నిర్వహించారు. అతీక్​ హత్య తర్వాత పరారైన అతడి భార్య షైష్తా పర్వీన్​ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. బుధవారం కౌశంబీ జిల్లాలో ఆమె కోసం పలు చోట్ల దాడులు నిర్వహించారు.  

అయితే, 2005లో హత్యకు గురైన బీఎస్​పీ ఎమ్మెల్యే రాజ్​పాల్​ మర్డర్​ కేసులో కీలక సాక్షిగా ఉన్నాడు లాయర్​ ఉమేశ్​ పాల్.​ అతడు కూడా ఫిభ్రవరి 24న దారుణ హత్యకు గురయ్యాడు. ఉమేశ్​ పాల్​తో పాటు అతడి బాడీగార్డ్స్​ ఇద్దర్ని హత్య చేశారు. ఈ కేసులో అతీక్​, అతడి సోదరుడు అష్రఫ్​, ఇద్దరు కుమారులు, ఇద్దరు అనుచరులు, మరో తొమ్మిది మందిపై కేసులు నమోదయ్యాయి. పరారీలో ఉన్న అతిక్​ కుమారుడు అసద్​, అనుచరుడు గులామ్​ను ఏప్రిల్​ 13న టాక్స్​ఫోర్స్​ పోలీసులు ఎన్​కౌంటర్​ చేశారు. ఆ తర్వార జర్నలిస్టుల ముసుగులో వచ్చిన ముగ్గురు నిందితులు ఏప్రిల్​ 15న అతిక్, అష్రఫ్​ను దాదాపు 20 రౌండ్ల కాల్పులు జరిపి హత్య చేశారు.  

ABOUT THE AUTHOR

...view details