తెలంగాణ

telangana

ETV Bharat / state

యాదాద్రికి పోటెత్తిన భక్తజనం

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహుని ఆలయానికి భక్తులు పోటెత్తారు. అందులోనూ ఆదివారం సెలవురోజు కావడం వల్ల యాదాద్రికి తరలివచ్చారు.

By

Published : May 19, 2019, 6:33 PM IST

యాదాద్రికి పోటెత్తిన భక్తజనం

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవురోజుతో కుటుంబ సమేతంగా పిల్లపాపలతో కలిసి యాదాద్రికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. కల్యాణ, వ్రత మండపాలు, లడ్డూ ప్రసాద కౌంటర్లు భక్తులతో కిటకిటలాడాయి. స్వామివారి దర్శనానికి దాదాపు రెండుగంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు గంట సమయం పట్టింది. మరోవైపు ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్నందున అధికారులు కొండపైకి వాహనాలను అనుమతించడం లేదు.

యాదాద్రికి పోటెత్తిన భక్తజనం

ABOUT THE AUTHOR

...view details