తెలంగాణ

telangana

ETV Bharat / state

వ్రత మండప నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం: యాడా

యాదాద్రి మహాదివ్య పుణ్యక్షేత్రంగా ఆవిష్కృతం కానుంది. భక్తులు మొక్కులు తీర్చుకునే విధంగా వ్రత సముదాయాల నిర్మాణానికి యాడా ప్రణాళికలు రూపొందిస్తోంది.

By

Published : Jan 30, 2021, 10:53 AM IST

Yada has drawn up plans for the construction of the new Sri Satyanarayana Swamy Vrata Mandapa in Yadadri.
వ్రత మండప నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం: యాడా

యాదాద్రిలో సరికొత్తగా నిర్మితమయ్యే శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత మండప నిర్మాణానికి యాడా ప్రణాళికలు రూపొందించింది. రూ.11 కోట్ల వ్యయంతో కొండకింద గండిచెర్వు వద్ద సత్య నారాయణస్వామి వ్రత మండప సముదాయాన్ని నిర్మించతలపెట్టినట్లు ప్రాధికార సంస్థ అధికారులు తెలిపారు. తొలి దఫాలో 45 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో గ్రౌండ్ ప్లోర్ నిర్మించనున్నట్లు వెల్లడించారు. ఒకేసారి 250 జంటలు వ్రతాలు చేసుకునేలా ఏర్పాటు చేయనున్నట్లు యాడా పేర్కోంది.

దీక్షా భక్తుల కోసం..

స్వామి వారి దీక్ష భూనే భక్తులకు కోసం గండి చెరువు వద్ద రూ.9 కోట్ల వ్యయంతో.. అన్ని మౌలిక వసతులతో సంప్రదాయ హంగులతో విడిది సముదాయాన్ని నిర్మించనున్నట్లు యాడా తెలిపింది.

ఇదీ చదవండి:తెలంగాణకు రూ.245 కోట్ల వరద సాయం

ABOUT THE AUTHOR

...view details