తెలంగాణ

telangana

By

Published : Aug 10, 2020, 4:36 PM IST

ETV Bharat / state

తూప్రాన్​పేట హత్యను చేధించిన పోలీసులు

పాలోళ్ల తగాదా ఒకరిపై ఒకరు కర్రలు, రాడ్లతో దాడి చేసుకునే వరకు వెళ్లింది. చివరకు ఆ ఘటనలో ఒకరు మృత్యువాత చెందారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తూప్రాన్​పేటలో ఈనెల 7న జరిగింది. తాజాగా ఆ హత్య కేసులో నిందితులను భువనగిరి డీసీపీ అరెస్టు చేశారు.

Police crack down on Tupran peta murder at yadadri bhuvanagiri
తూప్రాన్​పేట హత్యను చేధించిన పోలీసులు

పాత కక్షలు మనసులో పెట్టుకుని హత్య చేసిన యాదాద్రి భువనగిరి జిల్లా తూప్రాన్ పేటకు చెందిన దండుగుల యాదగిరి, దండుగుల రమేష్, దండుగుల దేవేందర్, దండుగుల వెంకటేష్​ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు. ఈనెల 7న దండుగుల యాదగిరి, మందుగుల వెంకటేష్ కుమారులు గొడవ పెట్టుకోవడం వల్ల దండుగుల యాదగిరి తన సోదరులతో మందుగుల వెంకటేష్​పై కర్రలు, రాడ్డుతో దాడి చేశాడు. దాంతో తీవ్రంగా గాయపడిన వెంకటేష్​ను హైద్రాబాద్ ఆస్పత్రి​కి తరలించే లోపే మృతి చెందాడు. దాడికి పాల్పడిన వారిలో నలుగురిని అరెస్ట్ చేయగా.. దండుగుల వెంకటేష్ పరారీలో ఉన్నట్లు డీసీపీ నారాయణరెడ్డి తెలిపారు.

గత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో దండుగుల యాదగిరి అమ్మ సర్పంచ్​గా పోటీ చేసిందని డీసీపీ వివరాలు వెల్లడించారు. ఆ ఎన్నికల్లో ఓటమితో బంధువులైన మందుగుల వెంకటేష్ తన కుటుంబసభ్యులు ఎన్నికల్లో సహకరించక ఓటమికి కారణమయ్యాడని దండుగుల వెంకటేష్​ను నిందించాడు. ఈ నేపథ్యంలో తరచూ అతనితో గొడవలు పెట్టుకునేవాడు. గతంలో ఇరువురు స్థానిక పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదులు చేసుకున్నారు.

ఇదీ చూడండి :బైక్‌ లేకున్నా ఫొటో పెట్టి రూ.30 వేలు అన్నాడు... రూ.73వేలు దోచాడు

ABOUT THE AUTHOR

...view details