తెలంగాణ

telangana

By

Published : Sep 7, 2020, 1:50 PM IST

ETV Bharat / state

యాదాద్రి క్షేత్రంలో.. పంచ నరసింహులకు.. పంచ మండపాలు!

తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా రూపు దిద్దుకుంటున్న యాదాద్రి పుణ్యక్షేత్రం సర్వాంగ సుందరంగా కొలువు దీరనున్నది. చరిత్రలో నిలిచిపోయేలా యాదాద్రిలో ముఖ్యమంత్రి కేసీఆర్​ పలు నిర్మాణాలు చేయిస్తున్నారు. ప్రత్యేక శైలిలో కృష్ణశిలతో నిర్మిస్తున్న కట్టడాలు కనువిందు చేస్తున్నాయి. తాజాగా పంచ నారసింహుల కోసం పలు కైంకర్యాలు నిర్వహించడానికి పంచ మండపాలు సిద్ధం చేస్తున్నారు.

Pancha Mandapas Construction completed in Yadadri Temple
యాదాద్రి క్షేత్రంలో.. పంచ నరసింహులకు.. పంచ మండపాలు!

యాదాద్రి పుణ్యక్షేత్రం పునర్నిర్మాణ పనులు శరవేగంగా సాగవుతున్నాయి. కృష్ణశిలతో నిర్మిస్తున్న కట్టడాలు సర్వాంగ సుందరంగా కనువిందు చేస్తున్నాయి. వైష్ణవ ఆచారాల ప్రకారం ఆగమ శాస్త్రం అనుసరిస్తూ.. నిర్మాణాలు చేపడుతున్నారు. ఆలయంలో పలు కైంకర్యాలకు పంచ నారసింహులకు పంచ మండపాలు సకల హంగులతో రూపొందిస్తున్నారు.

పంచ నరసింహుల స్వయంభు క్షేత్రంగా విలసిల్లుతున్న యాదాద్రిలో ఆలయానికి తూర్పు దిశలో వార్షికోత్సవాల నిర్వహణకు ఒక మండపం, బ్రహ్మోత్సవాల నిర్వహణకు దక్షిణ దిశలో, మహరాజ గోపురం ఎదుట నిత్య సేవోత్సవంలో స్వామి వారు సేదతీరే.. వేంచేపు మండపం, ఆలయ పుష్కరిణిలో ఉత్సవాలు నిర్వహించే మండపాలు పూర్తయ్యాయి. కాగా.. ఐదో మండపమైన నిత్య కల్యాణ మండపం నిర్మాణంలో ఉంది. భక్తుల మనో ఉల్లాసానికి అష్టభుజ మండలం తొలి ప్రాకారంలో అద్దాల మండలం నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఇదీ చదవండి:"నా సొరకాయలు పోయాయి సార్..!"

ABOUT THE AUTHOR

...view details