తెలంగాణ

telangana

ETV Bharat / state

నయీం కేసులో బయటకొచ్చిన రాజకీయ నేతలు, పోలీసుల పేర్లు

నయీం కేసులో విచారణ వేగవంతం చేయాలని సుపరిపాలనా వేదిక కార్యదర్శి పద్మనాభరెడ్డి గవర్నర్​ నరసింహన్​ను కోరారు. సమాచార హక్కు చట్టం కింద నయీం కేసుతో సంబంధమున్న కొందరి రాజకీయ నేతలు, పోలీస్​ అధికారుల పేర్లను ఆయన బహిరంగం చేశారు.

By

Published : Aug 1, 2019, 5:32 PM IST

Updated : Aug 1, 2019, 5:55 PM IST

నయీం కేసులో ఎవరున్నారంటే...

నయీం కేసులో ఎవరున్నారంటే...

నయీం కేసు మరోసారి తెరపైకి వచ్చింది. కేసు విచారణ వేగవంతం చేసి నిందితులకు శిక్ష పడేలా చూడాలని సుపరిపాలనా వేదిక కార్యదర్శి పద్మనాభ రెడ్డి గవర్నర్ నరసింహన్​ను కోరారు. అంతేకాక సమాచార హక్కు చట్టం కింద ప్రత్యేక దర్యాప్తు బృందానికి సుపరిపాలన వేదిక దరఖాస్తు చేసింది. వారిచ్చిన సమాచారంలో నయీం కేసులో కొందరి రాజకీయ నేతలు, పోలీస్​ అధికారుల పేర్లు బయటపడ్డాయి.

జాబితాలో 8మంది రాజకీయ నాయకులు

నయీం కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారి నాగిరెడ్డి ఇచ్చిన సమాధానంలో 8 మంది రాజకీయ నాయకుల పేర్లున్నాయి. మాజీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య, భువనగిరి మాజీ జడ్పీటీసీ సుధాకర్, మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్, వలిగొండ మాజీ ఎంపీపీ నాగరాజు, భువనగిరి మాజీ ఎంపీపీ వెంకటేష్, భువనగిరి మాజీ సర్పంచ్ పింగళరెడ్డి, అబ్దుల్ నాజర్, బొల్లి ఈశ్వరయ్య, వి. సంజీవ పేర్లు బయటికి వచ్చాయి.

25 మంది పోలీస్ అధికారుల పేర్లు

నయీం కేసులో 25 మంది పోలీస్ అధికారుల పేర్లు ఉన్నట్లు ఆర్టీఐ దరఖాస్తుకు ఇచ్చిన సమాధానంలో వెల్లడైంది. ఇందులో అదనపు ఎస్పీలు ఎం. శ్రీనివాస్ రావు, ఎం.చంద్రశేఖర్, డీఎస్పీలు శ్రీనివాస రావు, సాయి మనోహర్, ప్రకాశ్ రావు, వెంకట నర్సయ్య, అరేందర్ రెడ్డి, తిరుపతన్న , సీఐలు మస్తాన్, రాజగోపాల్, వెంకటయ్య, శ్రీనివాస నాయుడు, కిషన్, శ్రీనివాసరావు, వెంకట్ రెడ్డి, ఎండీ మజిద్, వెంకట సూర్యప్రకాశ్, రవికిరణ్, బల్వంతయ్య, నరేందర్​గౌడ్, రవీందర్​తోపాటు హెడ్​కానిస్టేబుల్ దినేశ్ ఆనంద్, బాలయ్య, సాదత్​ల పేర్లు ఉన్నాయి.

ఇవీ చూడండి: 'ఉన్నావ్'​ విచారణకు సుప్రీం 45 రోజుల గడువు

Last Updated : Aug 1, 2019, 5:55 PM IST

ABOUT THE AUTHOR

...view details