తెలంగాణ

telangana

By

Published : Nov 22, 2020, 7:52 PM IST

ETV Bharat / state

కార్తికం: నారసింహుని సన్నిధికి పోటెత్తిన భక్తులు

యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం కార్తిక కాంతులతో వెలుగులీనుతోంది. భక్తులు వేకువ జామునే దీపాలు వెలిగించి స్వామి వారిని దర్శించుకుంటున్నారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చి నారసింహుని సన్నిధిలో వ్రతాలు ఆచరిస్తున్నారు. ఆదివారం భక్తుల తాకిడి పెరిగింది.

karthika special puja yadadri lakshmi narasimha temple
కార్తికం: నారసింహుని సన్నిధికి పోటెత్తిన భక్తులు

పవిత్ర పుణ్య‌క్షేత్రమైన యాదాద్రి శ్రీ ల‌క్ష్మీ న‌ర‌సింహ స్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివార‌ము సెలవు కావడంతో ముందురోజు నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చి... ఉదయాన్నే కార్తిక దీపాలు వెలిగించి శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుపుకున్నారు. శివాల‌యంలో ప్రత్యేక పూజలు చేసి బాలాల‌యంలో సువర్ణ మూర్తుల దర్శనానికి బారులు తీరారు.

యాదాద్రి పుణ్యక్షేత్రంలో శివకేశవులకు ప్రీతికరమైన కార్తిక మాసంలో వేలాది మంది భక్తులు నరసింహుని సన్నిధికి వచ్చి... సత్యనారాయణ వ్రతాలు జరుపుకుంటారు. కార్తిక మాసం పవిత్రమైనదని... అన్నవరం తర్వాత అధిక సంఖ్యలో వ్రతాలు యాదాద్రిలోనే జరుగుతాయని అర్చకులు తెలిపారు.

కార్తిక మాసంలో యాదాద్రి క్షేత్రంలో దీపారాధన చేయటం సంతోషంగా ఉందని భక్తులు తెలిపారు. శివకేశవుల నిలయమైన యాదాద్రి ఆలయంలో దీపారాధన చేస్తే సంవత్సర కాలం సుఖ‌సంతోషాల‌తో ఉంటామని అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి:శోభాయమానంగా తుంగభద్ర నదీ పుష్కర హారతి

ABOUT THE AUTHOR

...view details