తెలంగాణ

telangana

ETV Bharat / state

యాదాద్రిలో 12 గంటల వరకు 80 శాతం పోలింగ్​

యాదాద్రి జిల్లాలో ఎమ్మెల్లీ ఎన్నికల్లో ప్రజా ప్రతినిధులు ఉత్సాహంగా ఓటింగ్​లో పాల్గొంటున్నారు. పోలింగ్​ సరళిని కలెక్టర్​ పరిశీలించారు. మధ్యాహ్నం 12 గంటల వరకు 80 శాతం పోలింగ్​ నమోదైంది.

By

Published : May 31, 2019, 12:51 PM IST

ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్​

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ డివిజన్ కేంద్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు​ ప్రశాంతంగా సాగుతున్నాయి. మధ్యాహ్నం 12 గంటల వరకు 80 శాతం పోలింగ్​ నమోదైంది. 83 మంది ఓటర్లకు గానూ 67 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి, తెరాస అభ్యర్థి చిన్నప్పరెడ్డి పోలింగ్​ కేంద్రాన్ని సందర్శించారు. జిల్లా కలెక్టర్​ ఎన్నికల సరళిని పరిశీలించారు. వావిలాపల్లి ఎంపీటీసీ సభ్యురాలు తన చిన్నబాబుతో ఓటు హక్కు వినియోగించుకోవడం అందరినీ ఆకట్టుకుంది.

చౌటుప్పల్​లో ప్రశాంతంగా ఎమ్మెల్సీ పోలింగ్​

ABOUT THE AUTHOR

...view details