తెలంగాణ

telangana

ETV Bharat / state

నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన  ప్రభుత్వ చీఫ్​విప్​

వరంగల్​ నగరంలో జరిగే గణేశ్​ నిమజ్జన ఏర్పాట్లను ప్రభుత్వ  చీఫ్​ విప్​ వినయ్​ భాస్కర్​ పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంతంగా జరిగేలా  ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు.

By

Published : Sep 11, 2019, 10:45 AM IST

నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన  ప్రభుత్వ చీఫ్​విప్​

వరంగల్‌ నగరంలో జరిగే వినయక నిమజ్జనం ఏర్పాట్లను ప్రభుత్వ చీఫ్‌ విప్‌, వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్‌ పరిశీలించారు. హన్మకొండలోని పద్మాక్షిగుండం, చిన్నవడ్డేపల్లి చెరువు, బంధం చెరువులను గ్రేటర్ వరంగల్‌ మున్సిపల్‌ కమిషనర్ రవికిరణ్‌తో కలిసి ఆయన పరిశీలించారు. నిమజ్జనం వేడుకలు ప్రశాంతంగా జరిగే విధంగా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఎలాంటి ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా నిమజ్జనం ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని తెలిపారు. చెరువుల వద్ద భారీ క్రేన్లు, గజ ఈతగాళ్లు, నిఘా నేత్రాలు ఏర్పాటు చేశామని... ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు. వచ్చే సంవత్సరం నుంచి నగరంలో మట్టి వినాాయకులనేనిమజ్జనం చేసే విధంగా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.

నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ చీఫ్​విప్​

ABOUT THE AUTHOR

...view details