తెలంగాణ

telangana

ETV Bharat / state

పరిశుభ్రతపై చార్టెడ్​​ అకౌంటెంట్స్ ర్యాలీ

తమతో పాటు చుట్టూ ఉన్న పరిసరాలనూ శుభ్రంగా ఉంచుకుంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని వరంగల్​ చార్టెడ్​ అకౌంటెంట్స్​ అన్నారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించారు.

By

Published : Jun 25, 2019, 5:43 PM IST

స్వచ్ఛ భారత్ అభియాన్ ర్యాలీ

ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు వరంగల్​లో స్వచ్ఛ భారత్ అభియాన్ ర్యాలీ నిర్వహించారు. దేశ వ్యాప్త వారోత్సవాల్లో భాగంగా పలు సామాజిక అంశాలపై అవగాహన కల్పించేందుకు ఐసీఏఐ విభాగం​ పలు కార్యక్రమాలు చేపట్టింది. హన్మకొండ చౌరస్తా నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం ప్రయాణ ప్రాంగణ పరిసరాలను శుభ్రం చేశారు. ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని చార్టెడ్​​ అకౌంటెంట్స్​ సూచించారు.

స్వచ్ఛ భారత్ అభియాన్ ర్యాలీ

ABOUT THE AUTHOR

...view details