తెలంగాణ

telangana

ETV Bharat / state

ఓరుగల్లులో వాక్​ ఫర్​ ఓట్ అవగాహన కార్యక్రమం

ఓటుపై అవగాహన కల్పిస్తూ వరంగల్​లో వాక్​ ఫర్​ ఓట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు స్కేటింగ్ చేస్తూ ఆకట్టుకున్నారు. ఓటుహక్కును వినియోగించుకోవాలని ప్లకార్డులతో ప్రదర్శన చేపట్టారు.

వరంగల్​లో అవగాహన ర్యాలీ

By

Published : Apr 8, 2019, 10:16 AM IST

ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతూ... వరంగల్​లో అవగాహన ర్యాలీ చేపట్టారు. సఫల్ భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వాక్ ఫర్ ఓట్ కార్యక్రమన్ని నిర్వహించారు. హన్మకొండలోని ఆర్ట్స్ కళాశాల నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు జరిగింది.​ వరంగల్ నగర పాలక మున్సిపల్ కమిషనర్ రవికిరణ్ జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

వరంగల్​లో అవగాహన ర్యాలీ
ఓటు హక్కును వినియోగించుకొని పోలింగ్ శాతాన్ని పెంచాలని సఫల్​ భారత్​ ఫౌండేషన్ సంస్థ ఛైర్మన్ శారద కోరారు. ఎన్నికల్లో ప్రలోభాలకు గురికాకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details