తెలంగాణ

telangana

ETV Bharat / state

కాకతీయలో అధిక ఫీజులపై విద్యార్థుల కన్నెర్ర

ఉస్మానియా విశ్వవిద్యాలయం కన్నా కాకతీయలో ఫీజులు ఎక్కువగా వసూలు చేస్తున్నారంటూ పీహెచ్​డీ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. వెంటనే రుసుములు తగ్గించాలని డిమాండ్ చేశారు.

By

Published : May 15, 2019, 7:34 PM IST

Updated : May 15, 2019, 7:47 PM IST

విద్యార్థుల ఆందోళన

వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయంలో పరిశోధక విద్యార్థులు ఆందోళన చేపట్టారు. పెంచిన ప్రవేశ ఫీజులను తగ్గించాలని డిమాండ్ చేస్తూ కాకతీయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఛాంబర్​ను ముట్టడించారు. ఛాంబర్​లో బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఉస్మానియాలో రుసుములు తక్కువగా ఉన్నాయని కాకతీయలో మాత్రం అధికారులు ఎక్కువ వసూలు చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే ఫీజులు తగ్గించి తమకు ఆర్థిక భారం తగ్గించాలని విజ్ఞప్తి చేశారు.

విద్యార్థుల ఆందోళన
Last Updated : May 15, 2019, 7:47 PM IST

ABOUT THE AUTHOR

...view details