తెలంగాణ

telangana

By

Published : Oct 17, 2020, 1:13 PM IST

Updated : Oct 17, 2020, 5:26 PM IST

ETV Bharat / state

వేయిస్తంభాల గుడిలో ఘనంగా నవరాత్రి ఉత్సవాలు

వరంగల్​ వేయి స్తంభాల గుడిలో దేవీ నవరాత్రుల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు అమ్మవారిని బాలా త్రిపుర సుందరి దేవిగా అలంకరించారు.

devi-navarathrulu-in-1000-pillars-temple-warangal-urban
వేయిస్తంభాల గుడిలో ఘనంగా నవరాత్రి ఉత్సవాలు

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని వేయి స్థంభాల గుడిలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలను ఛైర్మన్ మర్రి యాదవ్ రెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్ర శర్మ ప్రారంభించారు.

మొదటి రోజు అమ్మవారిని బాలా త్రిపుర సుందరి దేవిగా అలంకరించారు. 9 రోజుల పాటు ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగుతాయని అర్చకులు తెలిపారు.

పద్మాక్షి దేవాలయంలో ఉత్సవాలను వరంగల్ నగర పాలక కమిషనర్ పమేలా సత్పతి ప్రారంభించారు.

ఇదీ చదవండి:మల్టీప్లెక్స్​ల నిర్వహణకు 25 శాతం అదనపు భారం!

Last Updated : Oct 17, 2020, 5:26 PM IST

ABOUT THE AUTHOR

...view details