తెలంగాణ

telangana

Clay Ganesh Idols Telangana : ప్రకృతిని ప్రేమిద్దాం.. మట్టి గణపయ్యను పూజిద్దాం

By ETV Bharat Telangana Team

Published : Sep 15, 2023, 10:44 AM IST

Clay Ganesh Idols Telangana : వారంతా మట్టితో మమేకమై...కాలానికి అనుగుణంగా విగ్రహాలను, మట్టి వస్తువులను తయారు చేస్తుంటారు. రంగులు, రసాయనాలతో తయారు చేసిన వినాయక ప్రతిమలు నీటిలో నిమజ్జనం చేయడం వల్ల జల కాలుష్యం ఏర్పడుతుందని...మట్టి గణపతులను మాత్రమే తయారు చేస్తూ ..వృత్తికి జీవం పోస్తున్న హన్మకొండకు చెందిన కుటుంబం, అలాగే గోమాత పేడతో తయారు చేసిన విగ్రహాలను పంపిణీకి సిద్దం చేసిన...సిద్దిపేటకు చెందిన సిద్ద రామేశ్వరా ఫౌండేషన్ సభ్యులు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

Eco Friendly Ganesh
Eco Friendly Ganesh Making in Hanamkonda

Clay Ganesh Idols Telangana ప్రకృతిని ప్రేమిద్దాం.. మట్టి గణపయ్యను పూజిద్దాం

Clay Ganesh Idols Telangana : హనుమకొండ జిల్లా పోచమ్మ కుంటకు చెందిన వెంకన్న కుటుంబం కులవృత్తిని నమ్ముకొని జీవనం సాగిస్తున్నారు. వీరు వేసవి కాలంలో రంజాన్లను... వర్షాకాలంలో పూల కుండీలను తయారు చేస్తుంటారు. వినాయక చవితికి రెండు నెలల ముందు నుంచి మట్టి విగ్రహాలను తయారు చేయడంలో నిమగ్నమౌతుంటారు. దాదాపు పదేళ్లుగా పర్యావరణ పరిరక్షణలో తన వంతు బాధ్యతను నిర్వర్తిస్తూ.. మట్టి గణపతులను తయారు చేస్తున్నారు. బంక మట్టినుపయోగించి విభిన్న రకాల ఆకృతుల్లో ఈ విగ్రహాలను తయారు చేస్తున్నారు.

Eco Friendly Ganesh Making Siddipet : మట్టి విగ్రహాలకు ఆదరణ పెరుగుతుండటంతో పర్యావరణానికి ఎలాంటి ముప్పు లేకుండా సహజంగా రంగులను ఉపయోగించి గత పది సంవత్సరాలుగా మట్టి గణపతులను తయారు చేస్తున్నానని వెంకన్న తెలిపారు. పీవోపీ విగ్రహాలను చెరువులో నిమజ్జనం చేయడం వల్ల జీవరాశులకు ముప్పు వాటిల్లుతుందని అన్నారు . మట్టి గణపతుల తయారీకి తన కుటుంబ సభ్యులు ఎంతగానో సహకరిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎలాంటి లాభాలను ఆశించకుండా మట్టి విగ్రహాలను తయారుచేసి నిర్వాహకులకు అందించడంలో తమ వంతు పాత్ర పోషించడం ఆనందంగా ఉందని వారు తెలిపారు. ఏడాది పొడవునా సాఫ్ట్ వేర్ రంగంలో బిజీగా ఉన్నప్పటికీ పది రోజులపాటు సెలవులు పెట్టి.. తండ్రికి సహాయం చేయడం ఎంతో సంతోషంగా ఉందని వెంకన్న కుమారుడు పూర్ణచందర్ పేర్కొన్నారు.

Bhagyanagar Ganesh Utsava Committee Meeting : 'వినాయక ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి'

"రంజాన్​ సమయంలో నీటి కుండలు, వర్షాకాలంలో పూల కుండీలు తయారు చేస్తాం. వినాయకు చవితి వచ్చినప్పుడు విగ్రహాలను తయారు చేస్తాం. ప్రతి ఒక్కరు మట్టి విగ్రహాలను పూజించాలి పర్యవరణాన్ని సంరక్షించాలి. రంగు వినాయకులను వాడకూడదు. బంకమట్టితో మేము విగ్రహాలను చేస్తున్నాం. ఇవి పర్యావరణానికి ఎలాంటి కీడు కలిగించవు. ". - వెంకన్న మట్టి గణపతి తయారుదారు

Clay Ganesh Idols Hanamkonda :రకరకాల రసాయనాలతో కూడిన రంగులు, నీటిలో కరగని పదార్ధాలతో తయారు చేసిన వినాయక ప్రతిమలతో నీరు కలుషితం అవుతుంది. నీటిలోని జీవరాశులకు హాని కలుగుతుంది. కాబట్టి బంక మట్టితో మాత్రమే తయారు చేసిన వినాయకులతో నీరు శుద్ధికావడంతో పాటు .. నీటిలోని జీవరాశులకు ఎలాంటి హాని ఉండదు. పర్యావరణాన్ని కాపాడడానికి మట్టి, గోమాత పేడతో తయారు చేస్తున్న గణేష్ విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేసేందుకు సిద్దం చేశామని.. సిద్ద రామేశ్వరా పౌండేషన్‌ సభ్యులు పేర్కొన్నారు. ప్రతి ఏడాది లాగానే ప్రజల డిమాండ్​కు సరిపడా మట్టి గణపతులను తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నామని మట్టి విగ్రహల తయారీదారులు చెబుతున్నారు.

"చాలా సంవత్సరాల నుంచి ఇక్కడే విగ్రహాలను కొంటున్నాం. ఇవి నీటిలో తొందరగా కరిగిపోతాయి. పీవోపీతో చేసిన విగ్రహాలు నీటిలో కరగవు. అవి నీళ్లలో ఉండే చేపలకు హాని చేస్తాయి. పర్యావరణానికీ వాటి వల్లే కీడే జరుగుతుంది. అందుకే మేం పీవోపీ కంటే మట్టి విగ్రహాలకే ప్రాధాన్యమిస్తాం. ఇవి ధర కూడా తక్కువే. చూడటానికి చాలా అందంగా ఉంటాయి కూడా." - కొనుగోలుదారులు

Khairatabad Ganesh 2023 : నవరాత్రి ఉత్సవాలకు సిద్ధమవుతున్న ఖైరతాబాద్ గణేశుడు.. 18 నుంచి భక్తులకు దర్శనం

Badhyatha Foundation Ganesh Festival 2023 : 'పండుగ పైసలు పల్లెకిద్దాం వారికి తోడుగా ఉందాం'

ABOUT THE AUTHOR

...view details