తెలంగాణ

telangana

ETV Bharat / state

'అనుచిత వ్యాఖ్యలు చేసేవారు బహిరంగ క్షమాపణ చెప్పాలి'

పేదవిద్యార్థుల అభివృద్ధిని అడ్డుకోవాలని కొందరు ప్రయత్నిస్తున్నారని... అందుకే రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల కార్యదర్శి డా.ఆర్​ఎస్ ప్రవీణ్​కుమార్​పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని స్వేరోస్ బహుజన సంఘాలు నిరసన తెలిపారు. పరకాల పట్టణంలో ఆందోళన నిర్వహించారు.

By

Published : Mar 18, 2021, 5:26 PM IST

sworos protest at parkal in warangal district
'అనుచిత వ్యాఖ్యలు చేసేవారు బహిరంగ క్షమాపణ చెప్పాలి'

వరంగల్ జిల్లా పరకాల పట్టణంలో స్వేరోస్ బహుజన సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల కార్యదర్శి డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్​పై కొందరు ఉద్దేశ్య పూర్వకంగానే అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. పేద పిల్లల ఎదుగుదల, విద్యార్థుల అభివృద్ధిని అడ్డుకోవాలనే ప్రవీణ్ కుమార్​పై విషప్రచారం చేస్తున్నారన్నారు.

ప్రవీణ్ కుమార్​పై, స్వేరోస్ సంఘంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వారు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాబోయే రోజుల్లో ఓటుతో సమాధానం చెప్తామంటూ హెచ్చరించారు.

ఇదీ చూడండి:బీమారంగంలో విదేశీ పెట్టుబడులను వ్యతిరేకిస్తూ ఆందోళన

ABOUT THE AUTHOR

...view details