తెలంగాణ

telangana

ETV Bharat / state

"మాకు చదువు చెప్పండి"

'మాకు తరగతులు నిర్వహించండి. ఇప్పటికే 50 రోజులు వృథా అయిపోయింది. యాజమాన్యం నిర్లక్ష్యంతో మేమెంతో నష్టపోతున్నాం': ఎంబీబీఎస్ విద్యార్థులు

By

Published : Mar 1, 2019, 6:59 PM IST

"మాకు చదువు చెప్పండి"

"మాకు చదువు చెప్పండి"
తరగతులు నిర్వహించాలంటూ... హైదరాబాద్​ మహేశ్వర వైద్య కళాశాలకు చెందిన ఎంబీబీఎస్ విద్యార్థులు వరంగల్​లోని కాలోజి నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. గత 50 రోజులుగా బోధన తరగతులు నిర్వహించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఎవరు చెప్పినా పట్టించుకోవట్లేరు

యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా.. తామెందుకు ఏడాది కోల్పోవాలని ప్రశ్నించారు. సమస్యలను వెంటనే పరిష్కరించి, యాజమాన్యాన్ని మార్చాలని వర్శిటి అధికారులను కొరారు. లేనిపక్షంలో ఆందోళనను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. గతంలోనే తమ సమస్యను వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details