తెలంగాణ

telangana

ETV Bharat / state

తండ్రి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం మొక్కల పంపిణీ

తండ్రి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం విద్యార్థులకు గులాబీ మొక్కలు పంపిణీ చేశారు ఓ వరంగల్ జిల్లా వాసి. తండ్రి పేరున పర్యావరణ పరిరక్షణ కోసం చేపట్టిన ఆ వ్యక్తి ఆశయాన్ని అందరూ అభినందిస్తున్నారు.

By

Published : Aug 9, 2019, 11:41 AM IST

తండ్రి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం మొక్కల పంపిణీ

వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో డాక్టర్ సిరంగి సంతోష్ కుమార్ తన తండ్రి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం విద్యార్థులకు మొక్కలు పంపిణీ చేస్తున్నారు. ఈ సంవత్సరం 200 మంది పాఠశాల విద్యార్థులకు గులాబీ మొక్కలు అందజేశారు. విద్యార్థులు పచ్చని చెట్టు ప్రగతికి మెట్టు అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సంతోష్ విద్యార్థులను ఉద్దేశించి చెట్లను పెంచే ప్రక్రియ జీవితంలో ఒక భాగం కావాలన్నారు. పాత్రికేయులకు కొబ్బరి మొక్కలు పంపిణీ చేశారు. ఈ ఏడాది ఒక వెయ్యి మెుక్కలు పంపిణీ చేసి వాటి సంరక్షణ బాధ్యతలు తీసుకుంటానని పేర్కొన్నారు. డాక్టర్ సిరంగి సంతోష్ కుమార్ ప్రకృతి ప్రేమపై స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

తండ్రి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం మొక్కల పంపిణీ

ABOUT THE AUTHOR

...view details