తెలంగాణ

telangana

ETV Bharat / state

తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల ఆందోళన

వర్షానికి తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్​ చేస్తూ వరంగల్​ గ్రామీణ జిల్లా నీరుకుళ్ల గ్రామంలో రైతులు ఆందోళన చేపట్టారు. అధికారులు ధాన్యం కొనుగోలు చేయడంలో ఆలస్యం చేయడం వల్లే ఇలా జరగిందన్నారు.

By

Published : May 30, 2020, 6:06 PM IST

farmers protest in warangal rural district
తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల ఆందోళన

వరంగల్ గ్రామీణ జిల్లా ఆత్మకూరు మండలం నీరుకుళ్ల గ్రామంలో రాత్రి కురిసిన వర్షానికి ధాన్యం తడవడం వల్ల రైతులు జాతీయ రహదారిపై నిరసన వ్యక్తం చేశారు. అధికారులు ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యం చేయడం వల్లే ఇలా జరిగిందని అన్నదాతలు తెలిపారు.

వారి ఆందోళనను విరమింపజేసేందుకు వచ్చిన అధికారులతో రైతులు వాగ్వాదానికి దిగారు. తమ ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు సానుకూలంగా స్పందించి తడిసిన ధాన్యం పూర్తిగా కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు.

ఇవీ చూడండి: డీజిల్ దందాలో పోలీసుల పాత్ర.. ఆరుగురిపై వేటు

ABOUT THE AUTHOR

...view details