తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రశాంతంగా కొనసాగుతున్న రీపోలింగ్​

వనపర్తి జిల్లా పానగల్లు మండలం కదిరేపాడు గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల రీపోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఈ నెల 14న జరిగిన తుదిదశ ఎన్నికల్లో బ్యాలెట్​ పత్రాలు తారుమారైనందున రేపు ఆ గ్రామంలో రీపోలింగ్​ జరపాలని ఈసీ ఖరారు చేసింది.

By

Published : May 17, 2019, 10:02 AM IST

కదిరేపాడులో రీపోలింగ్​

వనపర్తి జిల్లా పానగల్లు మండలం కదిరేపాడు గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల రీపోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఈ నెల 14న జరిగిన ఎన్నికల్లో పెబ్బేరు మండలం పెంచికలపాడు ప్రాదేశిక స్థానానికి చెందిన బ్యాలెట్​ పత్రాలు కదిరేపాడుకి రావడం వల్ల పేర్లు తారుమారయ్యాయి. 64వ బూతులో 587 ఓట్లుండగా 501 ఓట్లు పోలయ్యాయి. జరిగిన పొరపాటును సరిచేస్తూ ఎన్నికల సంఘం ఇవాళ రీపోలింగ్​ జరిపేందుకు తేదీని ఖరారు చేసింది. మరోసారి ఎలాంటి ఘటనలు జరగకుండా అధికారులు అన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

కదిరేపాడులో రీపోలింగ్

ABOUT THE AUTHOR

...view details