తెలంగాణ

telangana

ETV Bharat / state

ఓటు హక్కు వినియోగంపై వనపర్తిలో 2కే రన్

ఓటు హక్కు వినియోగంపై అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును  వినియోగించుకోవాలని వనపర్తిలో 2కే రన్ నిర్వహించారు.

By

Published : Apr 2, 2019, 11:22 AM IST

ఓటు హక్కు వినియోగంపై షీటీం ఆధ్వర్యంలో టూకే రన్

ఓటు హక్కును ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి : శ్వేతా మహంతి
వనపర్తిలో ఓటు హక్కు వినియోగంపై షీటీం ఆధ్వర్యంలో టూకే రన్ జరిగింది. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఉద్దేశించిన ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి, ఎస్పీ అపూర్వరావు జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుంచి అంబేడ్కర్ చౌరస్తా వరకు ఈ పరుగును నిర్వహించారు.

ఓటు హక్కును ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి సూచించారు. మైదానానికి తిరిగి మొదటగా చేరిన విద్యార్థులకు బహుమతులను ఇచ్చి అభినందించారు.

షీ టీం సభ్యులు జిల్లాలో ప్రతి చోట ఉన్నారని, మహిళలను ఇబ్బందిపెడితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details