తెలంగాణ

telangana

ETV Bharat / state

పరిగిలో పర్యటించిన జిల్లా కలెక్టర్

వికారాబాద్​ జిల్లా పరిగి మున్సిపాలిటీలో కలెక్టర్ పౌసుమి బసు పర్యటించి.. ఆస్తుల నమోదును తనిఖీ చేశారు. మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. ఆస్తుల వివరాల నమోదును వీలైనంత  త్వరగా నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.

By

Published : Oct 17, 2020, 8:49 AM IST

Vikarabad Collector visits in parigi town
పరిగిలో పర్యటించిన జిల్లా కలెక్టర్

వికారాబాద్​ జిల్లా పరిగి మున్సిపాలిటీలో జిల్లా కలెక్టర్​ పౌసుమి బసు పర్యటించారు. ఆస్తుల వివరాల నమోదును పరిశీలించిన ఆమె.. వీలైనంత త్వరగా ధరణి నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్​ కమిటీ వెనుక భాగంలో ఏర్పాటు చేసిన పబ్లిక్​ టాయ్​లెట్స్​ను పరిశీలించారు. మూత్రశాలలు, ఆ చుట్టపక్కల ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.

కూరగాయల మార్కెట్​లోని మాంసం దుకాణాలకు ప్రత్యేక షెడ్లు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పరిగి మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ కుమార్, ఎమ్మార్వో, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:24 గంటల్లో కరెంట్ సరఫరా జరగాలి: కేటీఆర్ ఆదేశం

ABOUT THE AUTHOR

...view details