తెలంగాణ

telangana

ETV Bharat / state

వికారాబాద్​లో లంచం తీసుకుంటూ పట్టుబడిన వైద్యాధికారి

వికారాబాద్​లో రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు ఓ అవినీతి అధికారి. నిఘా పెట్టిన అధికారులు వలపన్ని పట్టుకున్నారు.

By

Published : Apr 15, 2019, 9:27 PM IST

Updated : Apr 15, 2019, 9:58 PM IST

లంచం తీసుకుంటూ పట్టుబడిన అధికారి


వికారాబాద్​ జిల్లా కేంద్రంలో రేయిన్​బో స్కానింగ్ సెంటర్ కోసం డాక్టర్ రాములు... ఆన్​లైన్​లో గత మూడు నెలల క్రితం దరఖాస్తు చేసుకున్నాడు. రూ. 30వేలు ఇస్తే గాని అనుమతులు ఇవ్వనని అక్కడ విధుల్లో వున్న డీఎంహెచ్​వో అధికారి చంద్రయ్య తెగేసి చెప్పాడు. విసుగు చెందిన బాధితుడు అవినీతి నిరోధక శాఖను ఆశ్రయించాడు. నిఘా పెట్టిన అధికారులు వలపన్ని అవినీతి చేపను పట్టుకున్నారు.

లంచం తీసుకుంటూ పట్టుబడిన ఆరోగ్యశాఖ అధికారి
Last Updated : Apr 15, 2019, 9:58 PM IST

ABOUT THE AUTHOR

...view details