తెలంగాణ

telangana

ETV Bharat / state

మద్దిరాలలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్​ చెక్కుల పంపిణీ

సూర్యాపేట జిల్లాలోని జాజిరెడ్డిగూడెంలో ఎంపీటీసీల వీడ్కోలు కార్యక్రమం, మద్దిరాల మండంలో కల్యాణ లక్ష్మి, షాదీముబారక్​ చెక్కుల పంపిణీ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే గాదరి కిశోర్​ పాల్గొన్నారు.

By

Published : Jun 28, 2019, 11:26 PM IST

మద్దిరాలలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్​ చెక్కుల పంపిణీ

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని జాజిరెడ్డిగూడెం, మద్దిరాల మండలాల్లో ఎమ్మెల్యే గాదరి కిశోర్​ పర్యటించారు. జాజిరెడ్డిగూడెం ఎంపీపీ కార్యాలయంలో నిర్వహించిన ఎంపీటీసీల వీడ్కోలు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. పార్టీలకు అతీతంగా అందరూ అభివృద్ధికి బాసటగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం మద్దిరాల మండలంలో కల్యాణి లక్ష్మి, షాదీ ముబారక్​ చెక్కుల పంపిణీ చేశారు. 164 మంది లబ్ధిదారులకు 1 కోటి 64 లక్షల 19 వేల రూపాయిల విలువైన చెక్కులను అందించారు.

మద్దిరాలలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్​ చెక్కుల పంపిణీ

ABOUT THE AUTHOR

...view details