తెలంగాణ

telangana

By

Published : Apr 7, 2020, 5:18 PM IST

ETV Bharat / state

వర్ధమానుకోటలో మంత్రి జగదీశ్వర్​రెడ్డి పర్యటన

సూర్యాపేట జిల్లా నాగారం మండలం వర్ధమానుకోటలో విద్యుత్​ శాఖ మంత్రి జగదీశ్వర్​రెడ్డి పర్యటించారు. గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురికి కరోనా సోకిన నేపథ్యంలో గ్రామస్థులకు భరోసానిచ్చారు.

minister jagadeesh reddy visit to vardhamanukota village in suryapet district
వర్ధమానుకోటలో మంత్రి జగదీశ్వర్​రెడ్డి పర్యటన

సూర్యాపేట జిల్లా నాగారం మండలం వర్ధమానుకోట గ్రామంలో మంత్రి జగదీశ్వర్​రెడ్డి పర్యటించారు. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురికి కరోనా సోకిన నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే గాదరి కిశోర్​, కలెక్టర్​ వినయ్​ కృష్ణారెడ్డి, ఎస్పీ భాస్కరన్​తో కలిసి మంత్రి హుటాహుటిన ఆ గ్రామాన్ని సందర్శించారు.

వర్ధమానుకోట గ్రామంలో ప్రజలెవరూ ఇంటి నుంచి బయటికి రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రతి ఇంటికి బియ్యం, నిత్యవసర వస్తువులు, మందులు పంపిణీ చేయాలన్నారు. గ్రామస్థులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న మంత్రి.. పాజిటివ్​ లక్షణాలు వచ్చిన అందిరినీ గుర్తించి చికిత్స అందిస్తామన్నారు.

భయాందోళనలు రేకెత్తించేలా అనవసర ప్రచారం చేయొద్దని మంత్రి కోరారు. వైద్య సిబ్బంది, అధికారులు గ్రామంలోనే ఉండి పరిస్థితిని చక్కదిద్దుతారని హామీ ఇచ్చారు. అనంతరం గ్రామంలో రసాయనాలను స్ఫ్రే చేయించారు.

వర్ధమానుకోటలో మంత్రి జగదీశ్వర్​రెడ్డి పర్యటన

ఇవీచూడండి:డ్రోన్​ వీడియో: హైదరాబాద్​ను ఇలా ఎప్పుడైనా చూశారా?

ABOUT THE AUTHOR

...view details