తెలంగాణ

telangana

ETV Bharat / state

పెద్దగట్టుకు పోటెత్తిన భక్తులు

లింగమంతుల జాతరకు భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారి మొక్కులు తీర్చుకునేందుకు మూడో రోజు పెద్దఎత్తున తరలివస్తున్నారు. సూర్యాపేట జిల్లా దురాజ్​పల్లి పెద్దగట్టు పరిసరాల్లో భక్తుల కోలాహలం నెలకొంది.

By

Published : Mar 2, 2021, 7:22 PM IST

huge crowd of devotees for the temple in lingamattula jatahara in peddagttu in suryapet district
లింగమంతుల జాతరకు కొనసాగుతున్న భక్తుల రద్దీ

ప్రతిష్ఠాత్మక పెద్దగట్టు లింగమంతుల జాతరకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. మూడో రోజు స్వామివారికి మొక్కులు తీర్చుకునేందుకు క్యూ కట్టారు. సూర్యాపేట జిల్లా దురాజ్​పల్లి పెద్దగట్టు పరిసరాలు కోలాహలంగా మారాయి. జాతరలో చేసిన ఏర్పాట్లపై భక్తులు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. అన్ని సౌకర్యాలు బాగున్నాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

లింగమంతుల జాతరకు కొనసాగుతున్న భక్తుల రద్దీ

పెద్దగట్టుకు వచ్చేవారి సంఖ్య మధ్యాహ్నం నుంచి పెరిగింది. ఈనెల 28న ప్రారంభమైన జాతర మార్చి 4వ తేదీ వరకు కొనసాగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకోవడం పట్ల భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి:యువతపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కక్షసాధింపు ధోరణి: భట్టి

ABOUT THE AUTHOR

...view details