తెలంగాణ

telangana

ETV Bharat / state

చావులోనూ వీడని 'ప్రేమ' బంధం

వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. కానీ పెద్దలు కుదరదన్నారు. అంతే..కనీసం చావులోనైనా ఒక్కటవ్వాలని నిర్ణయించుకున్నారు. ఆత్మహత్య చేసుకున్నారు.

By

Published : May 16, 2019, 12:59 PM IST

ప్రేమికుల ఆత్మహత్య

సిద్దిపేట జిల్లా కొండపాకలో విషాదం చోటుచేసుకుంది. లకుడారం గ్రామానికి చెందిన మంజే కనకయ్య, రాచకొండ తారా కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు మందలించారు. ప్రేమించిన పాపానికి రెండేళ్ల క్రితం యువకుడికి 30వేల జరిమానా విధించారు. కానీ ప్రేమికులిద్దరూ దూరంగా ఉండలేకపోయారు. కులాలు వేరు కావటం వల్ల పెళ్లికి పెద్దలు ఒప్పుకోరని కఠిన నిర్ణయం తీసుకున్నారు. బుధవారం ఉదయం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా కొండపాకలోని ప్రభుత్వ పాఠశాలల భవనానికి చేరుకున్నారు. ముందు విషం తాగారు. గదిలోకి వెళ్లి ఓకే తాడుతో ఇద్దరు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
నిన్నటి నుంచి వీరిద్దరు కనిపించట్లేదని కుటుంబ సభ్యులు వెతికారు. ఇంతలో పాఠశాల భవనం నుంచి దుర్వాసన రావడాన్ని గమనించిన స్థానికులు లోపలికి వెళ్లి చూడగా విషయం వెలుగులోకి వచ్చింది. కుకునూరుపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details