తెలంగాణ

telangana

ETV Bharat / state

సిద్దిపేట నుంచి తొలి అడుగు: హరీశ్​ రావు

బ్రెస్ట్ క్యాన్సర్ నివారణకు సిద్దిపేట నుంచి తొలి అడుగు వేయాలన్నారు ఎమ్మెల్యే హరీశ్​ రావు. మహిళలు వంద శాతం స్క్రీనింగ్​ టెస్ట్​ చేయించుకుని బ్రెస్ట్ క్యాన్సర్ నివారణలో సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాలు మొదటి స్థానంలో నిలవాలన్నారు.

By

Published : Sep 6, 2019, 8:32 PM IST

హరీశ్​ రావు

బ్రెస్ట్ క్యాన్సర్​పై మహిళలకు ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు, ఆరోగ్య కార్యకర్తలు అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే హరీశ్​ రావు అన్నారు. సిద్దిపేటలో నిర్వహించిన క్యాన్సర్ అవగాహన సదస్సులో పాల్గొన్నారు. బ్రెస్ట్ క్యాన్సర్ నివారణ మాసంగా అక్టోబర్ నెల నిలవాలన్నారు. ప్రాథమిక దశలోనే క్యాన్సర్​ను గుర్తించాలన్నారు. 35 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల వరకు గల మహిళలు స్క్రీనింగ్ టెస్ట్ చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి, వైద్యులు రఘురాం పాల్గొన్నారు.

సిద్దిపేట నుంచి తొలి అడుగు: హరీశ్​ రావు

ABOUT THE AUTHOR

...view details