తెలంగాణ

telangana

By

Published : Feb 17, 2021, 2:24 PM IST

Updated : Feb 17, 2021, 2:49 PM IST

ETV Bharat / state

వ్యవసాయక్షేత్రంలో మొక్క నాటిన సీఎం కేసీఆర్

పుట్టినరోజు సందర్భంగా వ్యవసాయక్షేత్రంలో సీఎం కేసీఆర్ మొక్కనాటారు. 'కోటి వృక్షార్చన'లో పాల్గొని కేసీఆర్​... రుద్రాక్ష మొక్కను నాటారు. కోటివృక్షార్చన రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా కొనసాగుతోందని అన్నారు.

kcr
kcr

కోటి వృక్షార్చనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మొక్కలు నాటారు. సీఎం జన్మదినం సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్​లో భాగంగా కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని చేపట్టారు. రాజ్యసభ సభ్యులు సంతోశ్​ కుమార్ విజ్ఞప్తి మేరకు సీఎం కేసీఆర్ స్వయంగా కోటి వృక్షార్చనలో పాల్గొని రుద్రాక్ష మొక్కను నాటారు.

పుట్టినరోజు సందర్భంగా మొక్క నాటిన సీఎం కేసీఆర్

ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో ఆయన మొక్క నాటారు. తన పుట్టినరోజు సందర్భంగా కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని చేపట్టడంపై ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టారని రాజ్యసభ సభ్యులు సంతోశ్​ కుమార్​ను సీఎం అభినందించారు.

సీఎం కేసీఆర్​తో సెల్ఫీ తీసుకుంటున్న ఎంపీ సంతోశ్​

ఇదీ చదవండి:కేసీఆర్​కు అరుదైన బహుమతి.. జోరుగా 'కోటి వృక్షార్చన'

Last Updated : Feb 17, 2021, 2:49 PM IST

ABOUT THE AUTHOR

...view details