తెలంగాణ

telangana

By

Published : Jan 17, 2021, 6:12 PM IST

ETV Bharat / state

'రాష్ట్ర సాధనలో పద్మశాలి సంఘం కృషి ఎనలేనిది'

రాష్ట్ర సాధనకు పద్మశాలి సంఘం ఎక్కువగా పోరాడిందని తెదేపా అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు. పోరాట యోధుల బిడ్డలుగా ఉన్నందుకు గర్విస్తున్నానని పేర్కొన్నారు. సంగారెడ్డిలో ఆ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణలో పాల్గొన్నారు.

L. Ramana at the Padmashali Community Calendar Launch
పద్మశాలి సంఘం క్యాలెండర్ ఆవిష్కరణలో ఎల్.రమణ

తెలంగాణ సాధనలో పద్మశాలి సంఘం ఎంతో కృషి చేసిందని తెదేపా అధ్యక్షుడు ఎల్.రమణ కొనియాడారు. వారు అనేక రంగాల్లో ముందుకు సాగడం సంతోషంగా ఉందన్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఆ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణలో పాల్గొన్నారు.

చేనేత కార్మికులు ఎంతో కష్టపడి పైస్థాయికి ఎదుగుతున్నారు. ప్రజా సంక్షేమం కోసం తమ ప్రాణాలు కోల్పోయిన ఘనత పద్మశాలి సంఘాలకు దక్కింది. పద్మశాలి పోరాట యోధుల బిడ్డలుగా ఉన్నందుకు గర్విస్తున్నాను.

-ఎల్.రమణ, తెదేపా అధ్యక్షుడు

ఘనత వారిదే..

అగ్గిపెట్టెలో చీరను ఎగుమతి చేసిన ఘనత పద్మశాలిలకు ఉందని మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభకర్ అన్నారు. తెరాస ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని తెలిపారు. సంగారెడ్డిలో చేనేత భవన నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు గుండు సుధారాణి పాల్గొన్నారు.

ఇదీ చూడండి:గంగపుత్రులను బాధపెట్టే వ్యాఖ్యలు చేయలే.. : తలసాని

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details