తెలంగాణ

telangana

ETV Bharat / state

"పార్లమెంట్​ ఎన్నికలకు సర్వం సిద్ధం"

పార్లమెంట్​ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సంగారెడ్డి జిల్లా కలెక్టర్​ హనుమంతరావు తెలిపారు. ఎన్నికల నిర్వహణపై అవగాహన కల్పించేందుకు ఎస్పీతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు.

By

Published : Mar 11, 2019, 5:25 PM IST

పార్లమెంట్ ఎన్నికలపై వివరాలు వెల్లడిస్తున్న కలెక్టర్

పార్లమెంట్ ఎన్నికలపై వివరాలు వెల్లడిస్తున్న కలెక్టర్
సంగారెడ్డి జిల్లాలో పార్లమెంట్ ఎన్నికలు సజావుగా నిర్వహిస్తామని కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఆదేశాలు వచ్చాయని, ఇప్పటి నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుందని పేర్కొన్నారు.

నామినేషన్ల వివరాలు...

ఈనెల 18 నుంచి 25 వరకు నామినేషన్ల స్వీకరణ, 26న పరిశీలన, 28న ఉపసంహరణ గడువు తేదిలు ఖరారైనట్లు తెలిపారు. ఏప్రిల్ 11న జిల్లా వ్యాప్తంగా 1557కేంద్రాలలో పోలింగ్ నిర్వహించేందుకు సన్నద్ధం అయినట్లు చెప్పారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశామన్నారు. రెవెన్యూ, పోలీసు శాఖ సమన్వయంతో కలిసి పనిచేస్తామని ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు.

ఇవీ చూడండి:అఖిలపక్షం నేతలతో ఎస్​ఈసీ సమావేశం

ABOUT THE AUTHOR

...view details