తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్రజా భాగస్వామ్యంతోనే గ్రామాభివృద్ధి సాధ్యం'

ప్రజా భాగస్వామ్యంతోనే గ్రామాభివృద్ధి సాధ్యమని జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్ అన్నారు. గ్రామాభివృద్ధిలో అందరూ ముందుండాలని సూచించారు.

By

Published : Sep 7, 2019, 3:51 PM IST

'ప్రజా భాగస్వామ్యంతోనే గ్రామాభివృద్ధి సాధ్యం'

జహీరాబాద్ మండలం రాయిపల్లిలో గ్రామ పంచాయతీ 30 రోజుల ప్రత్యేక కార్యాచరణలో భాగంగా గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బీబీపాటిల్, ఎమ్మెల్యే మాణిక్ రావు, ఎమ్మెల్సీ మహమ్మద్ ఫరీదుద్దీన్ పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 30 రోజుల కార్యక్రమాన్ని గ్రామస్థులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ సూచించారు. ఊర్లో కమిటీలు ఏర్పాటు చేసుకుని అన్ని సమస్యలు పరిష్కరించుకుని అభివృద్ధి సాధించాలని తెలిపారు.

'ప్రజా భాగస్వామ్యంతోనే గ్రామాభివృద్ధి సాధ్యం'

ABOUT THE AUTHOR

...view details