తెలంగాణ

telangana

ETV Bharat / state

నీళ్లు ఇవ్వకపోతే లక్ష మందితో దీక్ష చేస్తా

సంగారెడ్డి పట్టణానికి గోదావరి నీళ్లు ఇవ్వకపోతే లక్ష మందితో దీక్ష చేస్తానని హెచ్చరించారు స్థానిక ఎమ్మెల్యే జగ్గారెడ్డి.

By

Published : Jul 19, 2019, 7:02 PM IST

Updated : Jul 19, 2019, 11:19 PM IST

జగ్గారెడ్డి

సంగారెడ్డికి గోదావరి నీళ్లు ఇవ్వాలని స్థానిక ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పఠాన్ చెరు నుంచి సంగారెడ్డికి గోదావరి నీటి తరలింపుపై ఈ నెలాఖరు లోపు ప్రభుత్వం ప్రకటన చేయాలని విజ్ఞప్తి చేశారు. అలా చేయనట్లైతే... ఆగస్టు 10న సంగారెడ్డి అంబేడ్కర్​ స్టేడియంలో లక్ష మందితో దీక్ష చేస్తానని ఆయన ప్రకటించారు. తాను చేయబోయే దీక్ష ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదని.. తమ సమస్య తీవ్రతను సర్కారు దృష్టికి తీసుకెళ్లాడానికేనని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.

లక్ష మందితో దీక్ష చేస్తా
Last Updated : Jul 19, 2019, 11:19 PM IST

ABOUT THE AUTHOR

...view details