తెలంగాణ

telangana

ETV Bharat / state

విత్తన బంతులతో మెుక్కల పెంపకం

మెుక్కల ఆవశ్యకతను తెలియజేసేందుకు రంగారెడ్డి జిల్లా విజ్ఞాన్​ పాఠశాల విద్యార్థులకు ప్రహారీ ట్రస్ట్​ వారు విత్తన బంతులతో  మెుక్కలను ఎలా పెంచాలో అవగాహన కల్పించారు. అడవులను పెంచడానికి ఇది ఒక వినూత్నమైన విధానమని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు.

By

Published : Aug 24, 2019, 12:08 AM IST

Updated : Aug 24, 2019, 7:30 AM IST

విత్తన బంతులతో మెుక్కల పెంపకం

పర్యావరణ పరిరక్షణలో భాగంగా రంగారెడ్డి జిల్లా నిజాంపేటకు చెందిన విజ్ఞాన్​ పాఠశాల విద్యార్థులకు ప్రహారీ ట్రస్ట్​ సంస్థ వారు విత్తన బంతులతో అడవులను ఏ విధంగా పెంచాలో అవగాహన కల్పించారు. విత్తనాలను ఎరువులతో కలపి ముద్దగా చేసి... తడి ఆరాక..పెంచాలనుకునే ప్రదేశంలో విసిరేసినచో... వర్షానికి ఆ బంతులు నీటిని తీసుకుని మెుక్కగా తయారవుతాయని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. అడవుల పెంపకానికి ఇది సులువైన విధానమని వివరించారు.

విత్తన బంతులతో మెుక్కల పెంపకం
Last Updated : Aug 24, 2019, 7:30 AM IST

ABOUT THE AUTHOR

...view details